అన్వేషించండి

సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ- పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!

సంగం బ్యారేజీ చుట్టూ రాజకీయ వివాదాలు ముసురుకుంటున్నాయి. బ్యారేజ్ నిర్మాణ పనుల పర్యవేక్షణ తమ పరిధిలో ఉండాలని ఇద్దరు ఎమ్మెల్యేలు పోటాపోటీగా మంత్రి దృష్టికి ఆ విషయాన్ని తీసుకెళ్లారు.

నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీని ఇటీవల మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. ఇదే నెలలో సీఎం జగన్ చేతుల మీదుగా ఈ బ్యారేజి ప్రారంభోత్సవం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. గతంలో కూడా పలుమార్లు చాలామంది నేతలు ఇలాగే హామీలిచ్చారు. కానీ ఈసారి పరిస్థితి చూస్తుంటే.. పనులు పూర్తికావొచ్చాయి కాబట్టి మంత్రి మాట నమ్మేట్టుగా ఉంది. అయితే బ్యారేజ్ పూర్తయ్యేనాటికి రాజకీయ వివాదాలకు ఇది కేంద్రబిందువుగా మారే అవకాశమున్నట్టు తెలుస్తోంది. 

సంగం బ్యారేజీ చుట్టూ రాజకీయ వివాదాలు ముసురుకుంటున్నాయి. బ్యారేజ్ నిర్మాణ పనుల పర్యవేక్షణ తమ పరిధిలో ఉండాలని ఇద్దరు ఎమ్మెల్యేలు పోటాపోటీగా మంత్రి దృష్టికి ఆ విషయాన్ని తీసుకెళ్లారు. సంగం బ్యారేజీ ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. కానీ ఆ బ్యారేజీ వల్ల సాగునీరు కావలి, కోవూరు నియోజకవర్గాల వారికి ఉపయోగంగా ఉంటుంది. దీంతో ఈ బ్యారేజి విషయంలో ఎమ్మెల్యేలు పంతాలు, పట్టింపులకు పోతున్నట్టు తెలుస్తోంది. నీటి విడుదల, పంపిణీ విషయంలో ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో సంగం సెక్షన్‌ ను సెంట్రల్‌ డివిజన్‌ పర్యవేక్షణలో ఉంచే ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం తమ నియోజకవర్గంలో జరిగే పనులపై తమకు పూర్తి స్థాయిలో సమాచారం ఉండటంలేదని, మరొక నియోజకవర్గంలోని డీఈ, ఈఈలు ఈ పనుల్ని పర్యవేక్షిస్తుండటంతో తమకు కనీస సమాచారం కూడా రావడంలేదని మంత్రికి ఫిర్యాదు చేశారు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి. ఆయన సోదరుడు దివంగత నేత గౌతమ్ రెడ్డి పేరు మీదుగా ఈ బ్యారేజ్ నిర్మిస్తుండటంతో.. దీని నిర్మాణంపై తమకు పూర్తి స్థాయిలో సమాచారం రావాలని ఆయన కోరుకుంటున్నారు. కానీ మరొక నియోజకవర్గానికి చెందిన డీఈ, ఈఈలు సకాలంలో సమాచారం ఇవ్వడంలేదనేది ఇక్కడ ప్రధాన అభియోగం. 

దీంతో ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి అభ్యర్థన మేరకు.. సంగం బ్యారేజ్ పనుల బాధ్యతను ఆత్మకూరు డివిజన్‌కు కేటాయిస్తూ రెండురోజుల క్రితం జలవనరులశాఖ ఎస్‌ఈ కృష్ణమోహన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ విషయంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. సంగం బ్యారేజ్ పనుల పర్యవేక్షణకు వచ్చిన మంత్రి అంబటికి ఎమ్మెల్యే నల్లపురెడ్డి అసంతృప్తి తెలియజేస్తూ వినతిపత్రం ఇచ్చారు. సంగం బ్యారేజీకి సంబంధించిన పనుల పర్యవేక్షణ, సాంకేతికత నియంత్రణను నెల్లూరు డివిజన్‌ పరిధిలోనే ఉంచాలని ఆయన మంత్రిని కోరారు. నియంత్రణను ఆత్మకూరు డివిజన్‌కు మార్చితే ఇబ్బందులు తలెత్తుతాయని ఆయన మంత్రికి చెప్పారు. దీంతో వెంటనే అంతకు ముందు అధికారులు ఇచ్చిన ఉత్తర్వులు నిలిపివేయమని మంత్రి ఆదేశించారు. దీంతో జలవనరులశాఖ సీఈ హరినారాయణరెడ్డి గతంలో ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేశారు.

అయితే పోటా పోటీగా ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి కూడా దీనిపై మంత్రి అంబటికి ఫిర్యాదు చేశారు. బ్యారేజ్ పనుల్ని సెంట్రల్‌ డివిజన్‌ ఈఈ, బుచ్చిరెడ్డిపాలెం డీఈలు చూస్తున్నారని, దీంతో.. తమకు అక్కడి పనులను పర్యవేక్షించడం కష్టంగా ఉందని తెలిపారు. తమ పరిధిలో జరిగే సమీక్ష సమావేశాలకు ఆయా అధికారులు రాకపోవడంతో అసలు పనులు జరుగుతున్నాయో లేదో తెలియడంలేదని, వాటి పురోగతిపై సరైన సమాచారం లేదని చెప్పారు. ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగే పనులను ఇతర నియోజకవర్గాలకు చెందిన డివిజన్ అధికారులు ఎలా నిర్వహిస్తారని అడిగారు. దీనిపై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు.. సీఈ, ఎస్‌ఈ తో మాట్లాడతానని చెప్పారు. దీన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డికి ఆయన హామీ ఇచ్చారని తెలుస్తోంది. మొత్తమ్మీద ఈ నెలలో బ్యారేజ్ ప్రారంభోత్సవం జరుగుతుందని అనుకుంటున్న సందర్భంలో.. చివర్లో ఇలా ఎమ్మెల్యేలు పేచీ పెట్టడంతో వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందోననే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. 

టాప్ హెడ్ లైన్స్

YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
YSRCP DSC Protests: ఏపీలో డీఎస్సీ సెగ!అక్రమాలు జరిగాయని  వైఎస్‌ఆర్‌సీపీ నిరసనలు! తాడిపత్రిసహా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత!
ఏపీలో డీఎస్సీ సెగ!అక్రమాలు జరిగాయని  వైఎస్‌ఆర్‌సీపీ నిరసనలు! తాడిపత్రిసహా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత!
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget