అన్వేషించండి

సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ- పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!

సంగం బ్యారేజీ చుట్టూ రాజకీయ వివాదాలు ముసురుకుంటున్నాయి. బ్యారేజ్ నిర్మాణ పనుల పర్యవేక్షణ తమ పరిధిలో ఉండాలని ఇద్దరు ఎమ్మెల్యేలు పోటాపోటీగా మంత్రి దృష్టికి ఆ విషయాన్ని తీసుకెళ్లారు.

నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీని ఇటీవల మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. ఇదే నెలలో సీఎం జగన్ చేతుల మీదుగా ఈ బ్యారేజి ప్రారంభోత్సవం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. గతంలో కూడా పలుమార్లు చాలామంది నేతలు ఇలాగే హామీలిచ్చారు. కానీ ఈసారి పరిస్థితి చూస్తుంటే.. పనులు పూర్తికావొచ్చాయి కాబట్టి మంత్రి మాట నమ్మేట్టుగా ఉంది. అయితే బ్యారేజ్ పూర్తయ్యేనాటికి రాజకీయ వివాదాలకు ఇది కేంద్రబిందువుగా మారే అవకాశమున్నట్టు తెలుస్తోంది. 

సంగం బ్యారేజీ చుట్టూ రాజకీయ వివాదాలు ముసురుకుంటున్నాయి. బ్యారేజ్ నిర్మాణ పనుల పర్యవేక్షణ తమ పరిధిలో ఉండాలని ఇద్దరు ఎమ్మెల్యేలు పోటాపోటీగా మంత్రి దృష్టికి ఆ విషయాన్ని తీసుకెళ్లారు. సంగం బ్యారేజీ ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. కానీ ఆ బ్యారేజీ వల్ల సాగునీరు కావలి, కోవూరు నియోజకవర్గాల వారికి ఉపయోగంగా ఉంటుంది. దీంతో ఈ బ్యారేజి విషయంలో ఎమ్మెల్యేలు పంతాలు, పట్టింపులకు పోతున్నట్టు తెలుస్తోంది. నీటి విడుదల, పంపిణీ విషయంలో ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో సంగం సెక్షన్‌ ను సెంట్రల్‌ డివిజన్‌ పర్యవేక్షణలో ఉంచే ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం తమ నియోజకవర్గంలో జరిగే పనులపై తమకు పూర్తి స్థాయిలో సమాచారం ఉండటంలేదని, మరొక నియోజకవర్గంలోని డీఈ, ఈఈలు ఈ పనుల్ని పర్యవేక్షిస్తుండటంతో తమకు కనీస సమాచారం కూడా రావడంలేదని మంత్రికి ఫిర్యాదు చేశారు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి. ఆయన సోదరుడు దివంగత నేత గౌతమ్ రెడ్డి పేరు మీదుగా ఈ బ్యారేజ్ నిర్మిస్తుండటంతో.. దీని నిర్మాణంపై తమకు పూర్తి స్థాయిలో సమాచారం రావాలని ఆయన కోరుకుంటున్నారు. కానీ మరొక నియోజకవర్గానికి చెందిన డీఈ, ఈఈలు సకాలంలో సమాచారం ఇవ్వడంలేదనేది ఇక్కడ ప్రధాన అభియోగం. 

దీంతో ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి అభ్యర్థన మేరకు.. సంగం బ్యారేజ్ పనుల బాధ్యతను ఆత్మకూరు డివిజన్‌కు కేటాయిస్తూ రెండురోజుల క్రితం జలవనరులశాఖ ఎస్‌ఈ కృష్ణమోహన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ విషయంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. సంగం బ్యారేజ్ పనుల పర్యవేక్షణకు వచ్చిన మంత్రి అంబటికి ఎమ్మెల్యే నల్లపురెడ్డి అసంతృప్తి తెలియజేస్తూ వినతిపత్రం ఇచ్చారు. సంగం బ్యారేజీకి సంబంధించిన పనుల పర్యవేక్షణ, సాంకేతికత నియంత్రణను నెల్లూరు డివిజన్‌ పరిధిలోనే ఉంచాలని ఆయన మంత్రిని కోరారు. నియంత్రణను ఆత్మకూరు డివిజన్‌కు మార్చితే ఇబ్బందులు తలెత్తుతాయని ఆయన మంత్రికి చెప్పారు. దీంతో వెంటనే అంతకు ముందు అధికారులు ఇచ్చిన ఉత్తర్వులు నిలిపివేయమని మంత్రి ఆదేశించారు. దీంతో జలవనరులశాఖ సీఈ హరినారాయణరెడ్డి గతంలో ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేశారు.

అయితే పోటా పోటీగా ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి కూడా దీనిపై మంత్రి అంబటికి ఫిర్యాదు చేశారు. బ్యారేజ్ పనుల్ని సెంట్రల్‌ డివిజన్‌ ఈఈ, బుచ్చిరెడ్డిపాలెం డీఈలు చూస్తున్నారని, దీంతో.. తమకు అక్కడి పనులను పర్యవేక్షించడం కష్టంగా ఉందని తెలిపారు. తమ పరిధిలో జరిగే సమీక్ష సమావేశాలకు ఆయా అధికారులు రాకపోవడంతో అసలు పనులు జరుగుతున్నాయో లేదో తెలియడంలేదని, వాటి పురోగతిపై సరైన సమాచారం లేదని చెప్పారు. ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగే పనులను ఇతర నియోజకవర్గాలకు చెందిన డివిజన్ అధికారులు ఎలా నిర్వహిస్తారని అడిగారు. దీనిపై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు.. సీఈ, ఎస్‌ఈ తో మాట్లాడతానని చెప్పారు. దీన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డికి ఆయన హామీ ఇచ్చారని తెలుస్తోంది. మొత్తమ్మీద ఈ నెలలో బ్యారేజ్ ప్రారంభోత్సవం జరుగుతుందని అనుకుంటున్న సందర్భంలో.. చివర్లో ఇలా ఎమ్మెల్యేలు పేచీ పెట్టడంతో వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందోననే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
Viral Video: త్రివిక్రమ్‌ డైలాగ్స్‌కు AI విజువలైజేషన్! నవ్వు ఆపుకోలేకపోయిన చంద్రబాబు!
త్రివిక్రమ్‌ డైలాగ్స్‌కు AI విజువలైజేషన్! నవ్వు ఆపుకోలేకపోయిన చంద్రబాబు!

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Embed widget