అన్వేషించండి

అందరి ముందు తిట్టాడని నరికేశాడు- నెల్లూరు జంట హత్య కేసులో అసలు ట్విస్ట్

నెల్లూరు జంట హత్యల కేసుని పోలీసులు ఛేదించారు. ఆస్తి తగాదాలు కాదు, దొంగతనం కాదు, అందరి ముందు తనను అవమానించాడన్న కోపంలో మృతుడికి చెందిన హోటల్ లో పనిచేసే ఓ వ్యక్తి చేసిన దారుణం ఇది.

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన నెల్లూరు డబుల్ మర్డర్ కేసులో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ఎన్నో కోణాల నుంచి విచారించిన పోలీసులు... అసలు విషయం తెలిసి షాక్ తిన్నారు. ఇలాంటి వాటికి కూడా మర్డర్స్ చేస్తారా అని స్థానికులు కూడా చర్చించుకుంటున్నారు. ఆస్తి తగాదాలు కాదు, దొంగతనం కాదు, అందరి ముందు తనను అవమానించాడన్న కోపంలో మృతుడికి చెందిన హోటల్ లో పనిచేసే ఓ వ్యక్తి చేసిన దారుణం ఇది.

నెల్లూరులో హోటల్ నిర్వాహకులు కృష్ణారావు, సునీతను హోటల్ లో పనిచేసే వ్యక్తులే హత్య చేశారనే విషయం బయటపడింది. కృష్ణారావు, సునీత స్థానికంగా శ్రీరామ క్యాంటీన్ నిర్వహిస్తుంటారు. ఈ హోటల్ లో పనిచేసే ఉద్యోగుల్లో శివ, రామకృష్ణ కూడా ఉన్నారు. వీరిద్దరూ బంధువులు, వరుసకు బావ, బావమరిది అవుతారు. ఇటీవల సప్లయర్ శివను కృష్ణారావు కోపడ్డారు, అందరి ముందు మందలించారు. దీంతో శివ కృష్ణారావుపై కక్షగట్టాడు. ఇంటికి వెళ్లి అతడిని, అతని భార్య సునీతను కూడా చంపేశాడు. ఈ జంట హత్యల్లో ఇతడికి రామకృష్ణ సహకరించాడని తెలుస్తోంది. 


అందరి ముందు తిట్టాడని నరికేశాడు- నెల్లూరు జంట హత్య కేసులో అసలు ట్విస్ట్

హత్య జరిగిన తర్వాత ఇంటిలోని వస్తువులు పెద్దగా చోరీకాలేదు, కొంతమొత్తం నగదు కనిపించకుండా పోయినా, నగలను మాత్రం ముట్టుకోలేదు. దీంతో ఇది దోపిడీ కోసం చేసిన పని కాదని పోలీసులు నిర్థారించుకున్నారు. అందులోనూ హత్యలు అర్థరాత్రి జరిగాయి. దీంతో ఈ హత్యల వెనక వేరే కారణం ఉంటుందని అనుమానించిన పోలీసులు ఆ దిశగా ఇన్వెస్టిగేష్ ప్రారంభించారు. కృష్ణారావు, సునీత నిర్వహించే హోటల్ సమాచారం సేకరించారు. ఇటీవల కాలంలో అక్కడ జరిగిన సంఘటనలను అడిగి తెలుసుకున్నారు. దీంతో అసలు విషయం బయటపడింది. 

ప్రత్యేక పోలీసు బృందాలతో వేట..

నెల్లూరులో జరిగిన జంట హత్యల కేసుని పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇటీవల కాలంలో ఎప్పుడూ ఇంత ఘోరం జరగకపోవడం, పైగా ఒకేసారి జంటహత్యలు, ఇంట్లోనే గొంతుకోసి దారుణంగా చంపడం, రోజులు గడుస్తున్నా అనుమానితుల్ని కూడా పట్టుకోలేకపోవడంతో పోలీసులు మరింత సీరియస్ గా కేసుపై ఫోకస్ పెట్టారు. వేదాయపాళెం, సీసీఎస్‌ ఇన్‌ స్పెక్టర్లతో ముందు రెండు బృందాలు ఏర్పాటు చేసారు. ఆ తర్వాత ఎస్పీ ఆదేశాలతో ముగ్గురు ఇన్‌ స్పెక్టర్లతో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. ఆర్థిక లావాదేవీలపై దృష్టిపెట్టారు. ఆస్తి విషయంలో ఆ కుటుంబానికి ఎవరితోనూ వివాదాలు లేవని తెలుసుకున్నారు. ఇక పాత కక్షలు కూడా లేవని తేలింది. దీంతో హోటల్ లో ఏం జరిగిందనే కోణంలో పోలీసులు పరిశోధన సాగించారు. 

సీసీ టీవీ ఫుటేజీ కీలకం.. 
హత్యలు జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితులు సంఘటన జరిగిన తర్వాత అశోక్ నగర్ నుంచి పడారుపల్లి మార్గంలో వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఎస్పీ, పోలీసు బృందం పడారుపల్లి వైపు సీసీ కెమెరాలపై దృష్టిపెట్టారు. కానీ స్పష్టమైన ఆధారాలు లభించకపోవడంతో సీసీ కెమెరాలు ఇచ్చిన క్లూతో హోటల్ లో కూపీ లాగారు. దీంతో హోటల్ లో ఇటీవల కృష్ణారావు తిట్టడం, దాంతో శివ అనే సర్వర్ మనస్తాపానికి లోనైన విషయం తెలిసింది. దీంతో పోలీసులు శివ, అతడి బావమరిది రామకృష్ణను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అసలు విషయం బయటపడింది. తనను అందరి ముందు అవమానించారన్న కారణంతోనే కృష్ణారావు దంపతులను హత్య చేసినట్టు శివ ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

HPV Vaccine India: దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
PM Kisan Yojana: హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
HPV Vaccine: రూ. 10 HPV వ్యాక్సిన్ ఉచితంగా నేటి నుంచి పంపిణీ! వ్యాక్సినేషన్‌కు 14 ఏళ్ల బాలికలకు అవసరమయ్యే పత్రాలివే! 
రూ. 10 HPV వ్యాక్సిన్ ఉచితంగా నేటి నుంచి పంపిణీ! వ్యాక్సినేషన్‌కు 14 ఏళ్ల బాలికలకు అవసరమయ్యే పత్రాలివే! 
Ongole Latest News: రన్నింగ్ ట్రైన్ నుంచి పడిపోయిన 9 ఏళ్ల బాలిక.. రైల్వే సిబ్బంది సాహసం..ఒంగోలులో ఏం జరిగిందంటే?
రన్నింగ్ ట్రైన్ నుంచి పడిపోయిన 9 ఏళ్ల బాలిక.. రైల్వే సిబ్బంది సాహసం..ఒంగోలులో ఏం జరిగిందంటే?

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ranji Trophy Winner: తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
Kakinada Huge explosion : సామర్లకోట బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు - 10 మంది దుర్మరణం
సామర్లకోట బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు - 10 మంది దుర్మరణం
HPV Vaccine India: దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
ISRAEL-IRAN WAR: ఖమేనీ కార్యాలయంపై ఇజ్రాయెల్‌-అమెరికా ఉమ్మడి దాడి!మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు!
ఖమేనీ కార్యాలయంపై ఇజ్రాయెల్‌-అమెరికా ఉమ్మడి దాడి!మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు!
Guntur Viral News: గుంటూరులో డయల్‌ 100కు వింత ఫిర్యాదు; కజ్జికాయలు పెట్టలేదని మామపై అల్లుడి కంప్లైంట్‌!
గుంటూరులో డయల్‌ 100కు వింత ఫిర్యాదు; కజ్జికాయలు పెట్టలేదని మామపై అల్లుడి కంప్లైంట్‌!
Vikarabad Crime News: 'నాన్న లేకపోతే ఇన్ని సమస్యలా?' అని లెటర్ రాసి సూసైడ్ చేసుకున్న లేడీ కానిస్టేబుల్‌! 
'నాన్న లేకపోతే ఇన్ని సమస్యలా?' అని లెటర్ రాసి సూసైడ్ చేసుకున్న లేడీ కానిస్టేబుల్‌! 
Tamil Nadu Assembly Elections 2026: విడాకుల రచ్చతో ప్రత్యర్థులకు చిక్కిన విజయ్ - ఎలా బయటపడతారు?
విడాకుల రచ్చతో ప్రత్యర్థులకు చిక్కిన విజయ్ - ఎలా బయటపడతారు?
Embed widget