అన్వేషించండి

Crop Damage: నెల్లూరు పంట నష్టం అంచనా 8.5కోట్ల రూపాయలు..

వరుసగా రెండు వాయుగుండాల ప్రభావంతో నెల్లూరు జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. భారీ వర్షాలతోపాటు.. పెన్నా నదికి వచ్చిన వరదనీటి ప్రభావంతో వేలాది ఎకరాల్లో పంట నీటమునిగింది.

వరుసగా రెండు వాయుగుండాల ప్రభావంతో నెల్లూరు జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. భారీ వర్షాలతోపాటు.. పెన్నా నదికి వచ్చిన వరదనీటి ప్రభావంతో వేలాది ఎకరాల్లో పంట నీటమునిగింది. కొన్ని చోట్ల చేతికొచ్చిన పంట నీళ్లపాలు కాగా.. మరికొన్ని ప్రాంతాల్లో అప్పుడే నాటిన వరినారు కొట్టుకునిపోయింది. ఇక ఇతరత్రా చిరు ధాన్యాలు, వాణిజ్య పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నష్టంపై ఇప్పుడిప్పుడే అంచనాలు తయారు చేస్తున్నారు అధికారులు. కేంద్ర బృందం పర్యటనకు రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో రిపోర్ట్ రెడీ చేశారు. మొత్తం పంట నష్టం అంచనా రూ. 8,47,49,000 గా అంచనా వేశారు. 

నెల్లూరు జిల్లాలో దాదాపుగా 10మండలాలు వరద ప్రభావానికి గురయ్యాయి. దాదాపు 40 గ్రామాల్లో ప్రజలు వరదలతో అవస్థలు పడ్డారు. వీరిలో చాలామందిని వరకు సురక్షిత ప్రాంతాలకు తరలించి వరదసాయం అందిస్తోంది ప్రభుత్వం. కుటుంబానికి 2వేల రూపాయల చొప్పున పరిహారం అందించింది. అయితే వ్యవసాయ నష్టం పరిహారం కోసం కేంద్రం సాయం కోరే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం జగన్ వెయ్యి కోట్ల రూపాయలను ఆర్థిక సాయంగా అందించాలని కేంద్రాన్ని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఏరియల్ సర్వే చేపట్టారు. అనంతరం అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి వాస్తవాలను అంచనా వేశారు. 

నివేదికలు రెడీ.. 
క్షేత్ర స్థాయిలో అధికారులు పంట నష్టంపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. చాలా ప్రాంతాల్లో వర్షాలకు ముందే వరికోతలు పూర్తి కావడంతో తీవ్ర నష్టం తప్పింది. అయితే కొన్నిచోట్ల మాత్రం వరిపంటకు నష్టం వాటిల్లింది. అదే సమయంలో వరినారుమడులు పోసుకున్నవారు కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఉల్లిపాయలు, పొగాకు, మినుమ, మిర్చి... అన్ని రకాల పంటలు నాశనం అయ్యాయి. ఉల్లికి తెగుళ్లు సోకాయి, పొగాకు రంగు మారింది. మిరప చెట్లు నేలకొరిగాయి. సచివాలయాల పరిధిలోని గ్రామ వ్యవసాయ సహాయకుల సాయంతో లెక్కలు తేల్చారు అధికారులు. కేంద్రం బృందం వచ్చినప్పుడు నివేదికలు అందించడానికి సిద్ధం చేశారు. 

చేతికొచ్చిన దశలో దెబ్బతిన్న పంటలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని చెబుతున్నారు అధికారులు. నర్సరీ స్థాయిలో దెబ్బతిన్న వాటికి 80 శాతం రాయితీతో విత్తనాలు ఇస్తామంటున్నారు. మొత్తంగా నెల్లూరు జిల్లాలో 111784 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని అంచనా వేశారు. 42,747 మంది రైతులు ఈ వర్షాలకు ఇబ్బంది పడ్డారు, పంట నష్టపోయారు. ఆయా రైతులందరికీ నష్టపరిహారం అందించేందుకు అంచనాలు సిద్ధం చేశారు. పంట నష్టం దాదాపు 8.5కోట్ల రూపాయలుగా తేల్చారు. అయితే పంట నష్టంపై జిల్లా యంత్రాంగం ఇచ్చే నివేదికల్ని పరిశీలించే కేంద్ర బృందం.. దానిపై ఓ అంచనాకు వస్తుంది. కేంద్రంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు నష్టపరిహారం ఇచ్చే దిశగా ఆలోచిస్తోంది. మరోవైపు పశుపోషణపై ఆధారపడిన కుటుంబాలకు కూడా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. 

Read Also: ఈ ఆరు వ్యాధులు సైలెంట్‌గా ప్రాణాలు తీసేస్తాయ్... జాగ్రత్త

Read Also: ఇంట్లో ఇవి ఉంటే నెగిటివ్ ఎనర్జీ... డబ్బును రాకుండా అడ్డుకుంటాయి

Read Also: టమోటా లేని లోటును ఇవి తీర్చేస్తాయ్... వండి చూడండి

Read Also: విమాన ప్రయాణంలో వీటిని తింటే సమస్యలు తప్పవు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

HPV Vaccine India: దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
PM Kisan Yojana: హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
HPV Vaccine: రూ. 10 HPV వ్యాక్సిన్ ఉచితంగా నేటి నుంచి పంపిణీ! వ్యాక్సినేషన్‌కు 14 ఏళ్ల బాలికలకు అవసరమయ్యే పత్రాలివే! 
రూ. 10 HPV వ్యాక్సిన్ ఉచితంగా నేటి నుంచి పంపిణీ! వ్యాక్సినేషన్‌కు 14 ఏళ్ల బాలికలకు అవసరమయ్యే పత్రాలివే! 
Ongole Latest News: రన్నింగ్ ట్రైన్ నుంచి పడిపోయిన 9 ఏళ్ల బాలిక.. రైల్వే సిబ్బంది సాహసం..ఒంగోలులో ఏం జరిగిందంటే?
రన్నింగ్ ట్రైన్ నుంచి పడిపోయిన 9 ఏళ్ల బాలిక.. రైల్వే సిబ్బంది సాహసం..ఒంగోలులో ఏం జరిగిందంటే?

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Kakinada Fire Cracker Explosion: బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ranji Trophy Winner: తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
Kakinada Huge explosion : సామర్లకోట బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు - 10 మంది దుర్మరణం
సామర్లకోట బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు - 10 మంది దుర్మరణం
HPV Vaccine India: దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
ISRAEL-IRAN WAR: ఖమేనీ కార్యాలయంపై ఇజ్రాయెల్‌-అమెరికా ఉమ్మడి దాడి!మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు!
ఖమేనీ కార్యాలయంపై ఇజ్రాయెల్‌-అమెరికా ఉమ్మడి దాడి!మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు!
Guntur Viral News: గుంటూరులో డయల్‌ 100కు వింత ఫిర్యాదు; కజ్జికాయలు పెట్టలేదని మామపై అల్లుడి కంప్లైంట్‌!
గుంటూరులో డయల్‌ 100కు వింత ఫిర్యాదు; కజ్జికాయలు పెట్టలేదని మామపై అల్లుడి కంప్లైంట్‌!
Embed widget