అన్వేషించండి

Minister Kakani: పవన్ సినిమాల్లో హీరో, రాజకీయాల్లో జీరో - నిలకడ లేదు: మంత్రి కాకాణి

మూడు రాజధానులకు సరే అని చెప్పిన నోటితోనే నేడు వికేంద్రీకరణను పవన్ కల్యాణ్ వ్యతిరేకిస్తున్నాడని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు.

Minister Kakani Govardhan Reddy Comments On Pawan Kalyan: పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పొలిటికల్ బ్రోకర్ తరహాలో విన్యాసాలు చేస్తున్నాడని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండి పడ్డారు. చంద్రబాబు స్నేహంతో పవన్ కి కూడా మతిమరుపు రోగం వచ్చినట్టుందని ఎద్దేవా చేశారు. మూడు రాజధానులకు సరే అని చెప్పిన నోటితోనే నేడు వికేంద్రీకరణను పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యతిరేకిస్తున్నాడని చెప్పారు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan)  సినిమాల్లో హీరో కావొచ్చు కానీ, రాజకీయాల్లో జీరో అని విమర్శించారు. ప్యాకేజీల పవన్ గా రాష్ట్ర ప్రజలు ఆయన్ను ఎప్పుడో గుర్తించారని అన్నారు. పవన్ కల్యాణ్‌ను ఒక్క చోట కూడా ప్రజలు గెలిపించలేదని అన్నారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా (Nellore), వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) జిల్లా కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Minister Kakani Govardhan Reddy) విలేకరుల సమావేశం నిర్వహించారు.

నారా వారి రాజ్యం సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్ ని విశాఖ ఎయిర్ పోర్టులోనే పోలీసులు అడ్డుకొన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు అంబేడ్కర్ రాజ్యాంగం అమలులో ఉండబట్టే పవన్ స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారని అన్నారు. చంద్రబాబుకి సుపుత్రుడిపై నమ్మకం లేదని, దత్త పుత్రుడిని అడ్డం పెట్టుకొని లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. 2024 లో కుప్పంలో కూడా చంద్రబాబుకి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. చంద్రబాబు, పవన్ లాలూచీ వల్ల ఒరిగేదేమి లేదని అన్నారు. చంద్రబాబు, పవన్ మధ్య రహస్య ఒప్పందం జగమెరిగిన సత్యం అని అన్నారు.

పవన్ ఏ మాత్రం నిలకడ లేని వాడు. సంక్షేమ సారథి వైఎస్ జగన్ ని విమర్శించే అర్హత పవన్ కి లేదు. జగన్ ప్రభంజనానికి చంద్రబాబు అడ్రస్ గల్లంతు అయింది. రాజకీయ ఓనమాలు రాని నువ్వు గాలికి కొట్టుకుపోతావు. పరిజ్ఞానం లేకుండా మాట్లాడటం హాస్యాస్పదం. పొరపాటు చేస్తే ఎవరినీ విడిచి పెట్టబోం. పవన్ కళ్యాణ్ రాజ్యాంగానికి ఏమైనా అతీతుడా? సీఎం కావాలని పగటికలలు కంటే సరిపోదు. హుందాగా వ్యవహరించి మర్యాద కాపాడుకోవాలి’’ అని కాకాణి గోవర్థన్ రెడ్డి (Minister Kakani Govardhan Reddy) అన్నారు.

రాజమండ్రిలో వైఎస్ఆర్ సీపీ - జనసేన మధ్య ఉద్రిక్తతలు

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మంగళవారం (అక్టోబరు 18) ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వైఎస్ఆర్ సీపీ నేతలు వికేంద్రీకరణకు మద్దతు తెలుపుతూ ఓ సభ ఏర్పాటు చేసుకోగా, అదే సమయంలో అక్కడికి అమరావతి రైతుల మహాపాదయాత్ర చేరింది. వీరికి జనసేన, బీజేపీ మద్దతుగా నిలిచాయి. ఇదే సమయంలో మూడు పార్టీల నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సభలోని కుర్చీలు విసురుకొన్నారు. అనంతరం స్థానిక ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. తాము సభ ఏర్పాటు చేసుకుంటే బీజేపీ, జనసేన నేతలు రాళ్లు, నీళ్ల బాటిళ్లు విసిరారని అన్నారు.

వైఎస్ఆర్ సీపీ, విపక్షాల పోటాపోటీ కార్యక్రమాలు స్థానికంగా రాజకీయ వేడిని సృష్టిస్తున్నాయి. అమరావతి రైతులు మహా పాదయాత్ర రాజమహేంద్రవరంలోని పేపర్ మిల్లు నుంచి 9 గంటలకు ప్రారంభమై దేవీ చౌక్, ఆజాద్ ల మీదుగా సాగుతూ 10 గంటలకు ఆజాద్ చౌక్ వద్దకు చేరింది. అక్కడ అధికార వికేంద్రీకరణకు మద్దతుగా వైఎస్ఆర్ సీపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఇప్పటికే రాజమహేంద్రవరం అంతా అధికార వికేంద్రీకరణకు,  మూడు రాజధానులకు మద్దతుగా నగరం అంతా భారీ హార్డింగ్ లు, ఫ్లెక్సీలు వెలిశాయి. అదేవిధంగా పలుచోట్ల రైతుల మహా పాదయాత్రకు అనుకూలంగా స్వాగతం చెబుతూ టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో పలు చోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget