అన్వేషించండి

Dead Body On Bike: తిరుపతి ఘటన నెల్లూరులో రిపీట్ - బైక్‌పై కొడుకు మృత దేహం తరలింపు

Nellore News: 108 సిబ్బంది నిబంధనలు అంగీకరించవంటూ నిరాకరించడంతో చేసేదేం లేక శవాన్ని బంధువులు బైక్ పై తరలించారు. ఈ సంఘటనతో అక్కడున్నవారు కంటతడి పెట్టారు. 

Nellore Deadbody on Bike:  తిరుపతి రుయా ఆస్పత్రిలో ఇటీవల కొడుకు మృతదేహాన్ని తరలించడానికి తండ్రి పడిన అవస్థ రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. కొడుకు మృతదేహాన్ని భుజానికి ఎత్తుకుని 90 కిలోమీటర్లు బైక్ పై వెళ్లాడు తండ్రి. ఈ దారుణ ఘటన తర్వాత ప్రైవేట్ ఆంబులెన్స్ ల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. సరిగ్గా ఇలాంటి సంఘటనే నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలో జరిగింది. 108 సిబ్బంది నిబంధనలు అంగీకరించవంటూ నిరాకరించడంతో చేసేదేం లేక శవాన్ని బంధువులు బైక్ పై తరలించారు. ఈ సంఘటనతో అక్కడున్నవారు కంటతడి పెట్టారు. 

నెల్లూరు జిల్లా సంగంలో శ్రీరామ్‌ (8), ఈశ్వర్‌ (10) అనే ఇద్దరు పిల్లలు బహిర్భూమికి వెళ్లి కనిగిరి జలాశయం ప్రధాన కాలువలో ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయారు. ఈశ్వర్‌ మృతదేహాన్ని కాలువవద్ద నుంచి నేరుగా ఇంటికి తీసుకెళ్లారు. శ్రీరామ్‌ ను నీటిలో నుంచి బయటకు తీసిన తర్వాత ప్రాణాలున్నాయనే ఆశతో స్థానికులు, బంధువులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే శ్రీరామ్ మృతి చెందినట్లు వెద్యులు తెలిపారు. కొంతసేపటికి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి 108 వాహన సిబ్బంది సహాయం అడిగారు బంధువులు. అయితే నిబంధనల మేరకు శవాలను 108లో తరలించలేమని సిబ్బంది చెప్పారు. దగ్గరలో మహాప్రస్థానం వాహనం అందుబాటులో లేదు, ఆటోవాళ్లు కూడా రాలేమన్నారు. దీంతో బైక్ పైనే ఆ అబ్బాయి మృతదేహాన్ని తరలించారు. 

బుధవారం ఉదయం శ్రీరామ్, ఈశ్వర్, యశ్విత అనే బాలిక ముగ్గురూ కలసి వారి ఇంటికి సమీపంలోనే ఉన్న కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువ వద్దకు వెళ్లారు. యశ్విత గట్టుపై ఉండగా ఇద్దరు పిల్లలు కాలువలోకి దిగారు. అక్కడ బాగా లోతుగా ఉండటంతో నీట మునిగి గల్లంతయ్యారు. గట్టు మీదనే ఉన్న యశ్విత ఇంటికి వెళ్లి పెద్దలకు విషయం చెప్పడంతో వారు వెంటనే వెళ్లి గాలించారు. మొదట శ్రీరామ్ దొరకడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు, అయితే ఆలోపే అతను చనిపోయినట్టు చెప్పారు. ఆ తర్వాత ఈశ్వర్ మృతదేహం బయటపడింది.

Dead Body On Bike: తిరుపతి ఘటన నెల్లూరులో రిపీట్ - బైక్‌పై కొడుకు మృత దేహం తరలింపు

బెంగళూరు నుంచి వచ్చి.. 
శ్రీరామ్ కుటుంబ సభ్యులతో కలసి బెంగళూరులో ఉండేవాడు. అక్కడే చదువుకుంటున్నాడు. శ్రీరామ్ తండ్రి  తండ్రి దారా వెంకటేశ్వర్లు కుటుంబానికి సంగం పెన్నా తీరంలో ప్రభుత్వమిచ్చిన భూమిలో వేరుసెనగ సాగు చేశారు. అందులో కాయలు కోసేందుకు వృద్ధులైన తల్లిదండ్రులకు సాయంగా ఉండేందుకు వెంకటేశ్వర్లు మంగళవారం సంగం గ్రామానికి వచ్చారు. వేసవి సెలవులు కావడంతో శ్రీరామ్ కూడా తండ్రితో కలసి వచ్చాడు. వెంకటేశ్వర్లు పొలానికి వెళ్లగా.. శ్రీరామ్‌ తమ ఇంటికి ఎదురుగా ఉన్న ఈశ్వర్‌తో కలిసి కాలకృత్యాలు తీర్చుకునేందుకు కాల్వ వద్దకు వెళ్లు కన్నుమూశాడు. 


Dead Body On Bike: తిరుపతి ఘటన నెల్లూరులో రిపీట్ - బైక్‌పై కొడుకు మృత దేహం తరలింపు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Why did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABPKadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square Movie Review - టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Embed widget