అన్వేషించండి

Amarnath Pilgrims: అమర్ నాథ్‌ యాత్రకు నెల్లూరు యాత్రికులు, వారి పరిస్థితేంటి? వివరాలు చెప్పిన కలెక్టర్

అమర్ నాథ్ వెళ్లిన నెల్లూరు యాత్రికులంతా క్షేమంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. నెల్లూరు జిల్లానుంచి వివిధ ట్రావెల్ ఏజెన్సీల ద్వారా మొత్తం 78 మంది యాత్రకు వెళ్లారని చెప్పారాయన.

అమర్ నాథ్ వెళ్లిన నెల్లూరు యాత్రికులంతా క్షేమంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. నెల్లూరు జిల్లానుంచి వివిధ ట్రావెల్ ఏజెన్సీల ద్వారా మొత్తం 78 మంది యాత్రకు వెళ్లారని చెప్పారాయన. వారిలో 61 మంది తొలుత అందుబాటులోకి వచ్చారని, ఆ తర్వాత మిగతా 17 మంది ఫోన్ కాంటాక్ట్ లోకి వచ్చారని చెప్పారు. ప్రస్తుతం నెల్లూరు నుంచి వెళ్లిన యాత్రికులంతా మొత్తం 78మంది సురక్షితంగా తిరుగు ప్రయాణంలో ఉన్నారని చెప్పారు కలెక్టర్ చక్రధర్ బాబు. వారందరినీ క్షేమంగా స్వస్థలాలకు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోందని అన్నారు. 

కంట్రోల్ రూమ్ ఏర్పాటు..
రాష్ట్ర ప్రభుత్వ డయల్ 1902 నెంబర్ తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. దీనికి తోడు నెల్లూరు జిల్లాలో కూడా మరో కంట్రోల్ రూమ్ పెట్టారు. టోల్‌ఫ్రీ నంబరు 1077 ని ఈ కంట్రోల్‌ రూమ్ కి కేటాయించారు. ప్రస్తుంత ఈ కంట్రోల్ రూమ్స్ 24 గంటలు పని చేస్తున్నాయని చెప్పారు కలెక్టర్ చక్రధర్ బాబు. జిల్లా నుంచి మొత్తం 82 మంది అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లేందుకు ట్రావెల్స్‌ లో పేర్లు నమోదు చేసుకున్నారని, అయితే అందులో నలుగురు ముందుగానే తమ యాత్ర రద్దు చేసుకున్నారని అన్నారు. మొత్తం 78 మంది యాత్రకు వెళ్లగా అందరూ క్షేమంగా ఉన్నారని, వారి బంధువులెవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. 

యాత్ర తిరిగి ప్రారంభం.. 
వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా మూడు రోజులపాటు అమర్ నాథ్ యాత్రను రద్దు చేశారు అధికారులు. రెస్క్యూ ఆపరేషన్లు పూర్తయిన తర్వాత పరిస్థితి అనుకూలంగా ఉంది అని నిర్థారించుకున్న తర్వాత తిరిగి సోమవారం నుంచి అమర్ నాథ్ యాత్రను పునఃప్రారంభించారు. జమ్మూలోని భగవతి నగర్‌ యాత్రి నివాస్‌ నుంచి యాత్రికులు బేస్ క్యాంప్ కి బయలుదేరారు. మొత్తం 4,020 యాత్రికులు ధైర్యంగా ముందుకు కదిలారు. వీరందర్నీ 110 వాహనాలలో బేస్ క్యాంప్ కి తరలిస్తున్నారు. గట్టి బందోబస్తు మధ్య వీరిని తరలిస్తున్నట్టు సైనిక వర్గాలు తెలిపాయి. సోమవారం బయలుదేరిన వీరంతా.. ఈరోజు అమర్ నాథ్ గుహకు చేరుకుంటారు. అక్కడ మంచు లింగాన్ని దర్శించుకుంటారు.

మూడు రోజుల క్రితం జరిగిన దుర్ఘటనపై అధికారులు వివరణ ఇచ్చారు. యాత్రికులు రాత్రిపూట బస చేసేందుకు లోయ మార్గంలో టెంట్లు వేసుకున్నారు. అయితే ఆ ప్రదేశం సరైనది కాకపోవడం వల్లే ప్రాణ నష్టం అధికంగా జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటికి అధికారులు వివరణ ఇచ్చారు. అలాంటి తప్పు జరగలేదని, ఆప్రాంతం సురక్షితంగా ఉంటుందని అనుకున్న తర్వాతే అక్కడ టెంట్లు వేయించామని చెప్పారు అధికారులు. గతంలో వరదలు వచ్చినప్పుడు నీటి ప్రవాహం ఎటువైపు నుంచి వస్తోందో అంచనా వేసుకుని, దానికి దూరంగా టెంట్లు వేయించామన్నారు. కానీ ఈసారి వరదలు టెంట్లవైపు రావడంతో ప్రాణ నష్టం జరిగింది. చాలామంది గల్లంతయ్యారు. తిరిగి వారందర్నీ క్షేమంగా ఆస్పత్రులకు తరలించారు ప్రస్తుతం అక్కడ వరద తగ్గుముఖం పట్టింది. దీంతో అమర్ నాథ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్‌ నేత బాల్క సుమన్ అరెస్టు
అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్‌ నేత బాల్క సుమన్ అరెస్టు
IMD Weather Alert Telugu States 2026:తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
Forbes 30 Under 30 Asia 2026:ఫోర్బ్స్‌ జాబితాలో ఇద్దరు తెలుగు కుర్రాళ్లు! ప్రయోగాశాలతో లారీ డ్రైవర్ కుమారుడికి ప్రపంచ ఖ్యాతి!
ఫోర్బ్స్‌ జాబితాలో ఇద్దరు తెలుగు కుర్రాళ్లు! ప్రయోగాశాలతో లారీ డ్రైవర్ కుమారుడికి ప్రపంచ ఖ్యాతి!
Breaking News:సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RBI Plastic Notes: ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
Telangana EdCET Results: తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
HYDRAA Operation Mushkin Cheruvu: చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
Indian tourists Vietnam: రన్‌వే, రైలు పట్టాలు - రీల్స్ కేదీ కాదు అనర్హం - భారతీయ పర్యాటకులపై తీవ్ర వ్యతిరేకత - వీడియోలు
రన్‌వే, రైలు పట్టాలు - రీల్స్ కేదీ కాదు అనర్హం - భారతీయ పర్యాటకులపై తీవ్ర వ్యతిరేకత - వీడియోలు
Actor Sathyendra Death: 60 సినిమాల్లో నటించాడు - చనిపోతే చూసేందుకు కుటుంబం కూడా రాలేదు - సత్యేంద్ర దుస్థితి ఇదే!
60 సినిమాల్లో నటించాడు - చనిపోతే చూసేందుకు కుటుంబం కూడా రాలేదు - సత్యేంద్ర దుస్థితి ఇదే!
Regional sentiment gimmicks ahead of GHMC Elections | GHMC ఎన్నికలే టార్గెట్టా? తెలంగాణ సెంటిమెంటు, సెట్లర్ ఓటు, కొత్త రాజకీయ సమీకరణాలు
GHMC ఎన్నికలే టార్గెట్టా? తెలంగాణ సెంటిమెంటు, సెట్లర్ ఓటు, కొత్త రాజకీయ సమీకరణాలు
DK Shivakumar Swearing In Ceremony:యంగ్ టీంతో సిద్ధమవుతున్న కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్! జట్టులో నలుగురు డిప్యూటీ సీఎంలు!
యంగ్ టీంతో సిద్ధమవుతున్న కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్! జట్టులో నలుగురు డిప్యూటీ సీఎంలు!
Tesla Launches Y Premium Variant: టెస్లా మోడల్ వై లైనప్ లో మార్పులు: కొత్త ప్రీమియం వేరియంట్ లాంచ్.. ధర ఏకంగా రూ. 10 లక్షలకు పైగా తగ్గింపు
టెస్లా మోడల్ వై లైనప్ లో మార్పులు: కొత్త ప్రీమియం వేరియంట్ లాంచ్.. ధర ఏకంగా రూ. 10 లక్షలకు పైగా తగ్గింపు
Embed widget