అన్వేషించండి

Amarnath Pilgrims: అమర్ నాథ్‌ యాత్రకు నెల్లూరు యాత్రికులు, వారి పరిస్థితేంటి? వివరాలు చెప్పిన కలెక్టర్

అమర్ నాథ్ వెళ్లిన నెల్లూరు యాత్రికులంతా క్షేమంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. నెల్లూరు జిల్లానుంచి వివిధ ట్రావెల్ ఏజెన్సీల ద్వారా మొత్తం 78 మంది యాత్రకు వెళ్లారని చెప్పారాయన.

అమర్ నాథ్ వెళ్లిన నెల్లూరు యాత్రికులంతా క్షేమంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. నెల్లూరు జిల్లానుంచి వివిధ ట్రావెల్ ఏజెన్సీల ద్వారా మొత్తం 78 మంది యాత్రకు వెళ్లారని చెప్పారాయన. వారిలో 61 మంది తొలుత అందుబాటులోకి వచ్చారని, ఆ తర్వాత మిగతా 17 మంది ఫోన్ కాంటాక్ట్ లోకి వచ్చారని చెప్పారు. ప్రస్తుతం నెల్లూరు నుంచి వెళ్లిన యాత్రికులంతా మొత్తం 78మంది సురక్షితంగా తిరుగు ప్రయాణంలో ఉన్నారని చెప్పారు కలెక్టర్ చక్రధర్ బాబు. వారందరినీ క్షేమంగా స్వస్థలాలకు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోందని అన్నారు. 

కంట్రోల్ రూమ్ ఏర్పాటు..
రాష్ట్ర ప్రభుత్వ డయల్ 1902 నెంబర్ తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. దీనికి తోడు నెల్లూరు జిల్లాలో కూడా మరో కంట్రోల్ రూమ్ పెట్టారు. టోల్‌ఫ్రీ నంబరు 1077 ని ఈ కంట్రోల్‌ రూమ్ కి కేటాయించారు. ప్రస్తుంత ఈ కంట్రోల్ రూమ్స్ 24 గంటలు పని చేస్తున్నాయని చెప్పారు కలెక్టర్ చక్రధర్ బాబు. జిల్లా నుంచి మొత్తం 82 మంది అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లేందుకు ట్రావెల్స్‌ లో పేర్లు నమోదు చేసుకున్నారని, అయితే అందులో నలుగురు ముందుగానే తమ యాత్ర రద్దు చేసుకున్నారని అన్నారు. మొత్తం 78 మంది యాత్రకు వెళ్లగా అందరూ క్షేమంగా ఉన్నారని, వారి బంధువులెవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. 

యాత్ర తిరిగి ప్రారంభం.. 
వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా మూడు రోజులపాటు అమర్ నాథ్ యాత్రను రద్దు చేశారు అధికారులు. రెస్క్యూ ఆపరేషన్లు పూర్తయిన తర్వాత పరిస్థితి అనుకూలంగా ఉంది అని నిర్థారించుకున్న తర్వాత తిరిగి సోమవారం నుంచి అమర్ నాథ్ యాత్రను పునఃప్రారంభించారు. జమ్మూలోని భగవతి నగర్‌ యాత్రి నివాస్‌ నుంచి యాత్రికులు బేస్ క్యాంప్ కి బయలుదేరారు. మొత్తం 4,020 యాత్రికులు ధైర్యంగా ముందుకు కదిలారు. వీరందర్నీ 110 వాహనాలలో బేస్ క్యాంప్ కి తరలిస్తున్నారు. గట్టి బందోబస్తు మధ్య వీరిని తరలిస్తున్నట్టు సైనిక వర్గాలు తెలిపాయి. సోమవారం బయలుదేరిన వీరంతా.. ఈరోజు అమర్ నాథ్ గుహకు చేరుకుంటారు. అక్కడ మంచు లింగాన్ని దర్శించుకుంటారు.

మూడు రోజుల క్రితం జరిగిన దుర్ఘటనపై అధికారులు వివరణ ఇచ్చారు. యాత్రికులు రాత్రిపూట బస చేసేందుకు లోయ మార్గంలో టెంట్లు వేసుకున్నారు. అయితే ఆ ప్రదేశం సరైనది కాకపోవడం వల్లే ప్రాణ నష్టం అధికంగా జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటికి అధికారులు వివరణ ఇచ్చారు. అలాంటి తప్పు జరగలేదని, ఆప్రాంతం సురక్షితంగా ఉంటుందని అనుకున్న తర్వాతే అక్కడ టెంట్లు వేయించామని చెప్పారు అధికారులు. గతంలో వరదలు వచ్చినప్పుడు నీటి ప్రవాహం ఎటువైపు నుంచి వస్తోందో అంచనా వేసుకుని, దానికి దూరంగా టెంట్లు వేయించామన్నారు. కానీ ఈసారి వరదలు టెంట్లవైపు రావడంతో ప్రాణ నష్టం జరిగింది. చాలామంది గల్లంతయ్యారు. తిరిగి వారందర్నీ క్షేమంగా ఆస్పత్రులకు తరలించారు ప్రస్తుతం అక్కడ వరద తగ్గుముఖం పట్టింది. దీంతో అమర్ నాథ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Charter plane crashed: కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
Pawan Kalyan Pithapuram Tour: పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
Sankranti Special Trains: హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
Balakrishna : ఓ వైపు మూవీస్... మరోవైపు యాడ్స్ - బాలయ్యనా మజాకా...
ఓ వైపు మూవీస్... మరోవైపు యాడ్స్ - బాలయ్యనా మజాకా...

వీడియోలు

MI vs RCB Highlights WPL 2026 | ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విక్టరీ
MI vs RCB WPL 2026 Harmanpreet Kaur | తమ ఓటమికి కారణం ఏంటో చెప్పిన కెప్టెన్
Shreyas in place of Tilak Ind vs NZ | తిలక్ స్థానంలో శ్రేయస్
Jay Shah about Rohit Sharma | రోహిత్ పై జై షా ప్రశంసలు
Asian Thalassemia Conclave | తలసేమియా గురించి తెలుసుకోకపోవటమే అసలు సమస్య | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Charter plane crashed: కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
Pawan Kalyan Pithapuram Tour: పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
Sankranti Special Trains: హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
Balakrishna : ఓ వైపు మూవీస్... మరోవైపు యాడ్స్ - బాలయ్యనా మజాకా...
ఓ వైపు మూవీస్... మరోవైపు యాడ్స్ - బాలయ్యనా మజాకా...
Bangladesh: భారత్‌ను విలన్‌గా చూపుతున్న ఆందోళనకారులు - రోజు గడవాలంటే భారత్ దిగుమతులే దిక్కు - బంగ్లాదేశ్ పరిస్థితి ఇదీ !
భారత్‌ను విలన్‌గా చూపుతున్న ఆందోళనకారులు - రోజు గడవాలంటే భారత్ దిగుమతులే దిక్కు - బంగ్లాదేశ్ పరిస్థితి ఇదీ !
The Raja Saab Box Office Collection Day 1: వంద కోట్లు కంటే ఎక్కువ వచ్చాయ్ - ఫస్ట్ డే కలెక్షన్స్ అనౌన్స్ చేసిన 'రాజా సాబ్' నిర్మాత
వంద కోట్లు కంటే ఎక్కువ వచ్చాయ్ - ఫస్ట్ డే కలెక్షన్స్ అనౌన్స్ చేసిన 'రాజా సాబ్' నిర్మాత
Sankranti Rush: సంక్రాంతికి వెళ్లే జనంతో రోడ్లు జామ్‌-  రైల్వేలు, బస్‌లు, ప్రైవేటు వాహనాలు కిటకిట
సంక్రాంతికి వెళ్లే జనంతో రోడ్లు జామ్‌-  రైల్వేలు, బస్‌లు, ప్రైవేటు వాహనాలు కిటకిట
Dhandoraa OTT : ఓటీటీలోకి 'దండోరా' - తెలుగుతో పాటు ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'దండోరా' - తెలుగుతో పాటు ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Embed widget