అన్వేషించండి

Amarnath Pilgrims: అమర్ నాథ్‌ యాత్రకు నెల్లూరు యాత్రికులు, వారి పరిస్థితేంటి? వివరాలు చెప్పిన కలెక్టర్

అమర్ నాథ్ వెళ్లిన నెల్లూరు యాత్రికులంతా క్షేమంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. నెల్లూరు జిల్లానుంచి వివిధ ట్రావెల్ ఏజెన్సీల ద్వారా మొత్తం 78 మంది యాత్రకు వెళ్లారని చెప్పారాయన.

అమర్ నాథ్ వెళ్లిన నెల్లూరు యాత్రికులంతా క్షేమంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. నెల్లూరు జిల్లానుంచి వివిధ ట్రావెల్ ఏజెన్సీల ద్వారా మొత్తం 78 మంది యాత్రకు వెళ్లారని చెప్పారాయన. వారిలో 61 మంది తొలుత అందుబాటులోకి వచ్చారని, ఆ తర్వాత మిగతా 17 మంది ఫోన్ కాంటాక్ట్ లోకి వచ్చారని చెప్పారు. ప్రస్తుతం నెల్లూరు నుంచి వెళ్లిన యాత్రికులంతా మొత్తం 78మంది సురక్షితంగా తిరుగు ప్రయాణంలో ఉన్నారని చెప్పారు కలెక్టర్ చక్రధర్ బాబు. వారందరినీ క్షేమంగా స్వస్థలాలకు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోందని అన్నారు. 

కంట్రోల్ రూమ్ ఏర్పాటు..
రాష్ట్ర ప్రభుత్వ డయల్ 1902 నెంబర్ తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. దీనికి తోడు నెల్లూరు జిల్లాలో కూడా మరో కంట్రోల్ రూమ్ పెట్టారు. టోల్‌ఫ్రీ నంబరు 1077 ని ఈ కంట్రోల్‌ రూమ్ కి కేటాయించారు. ప్రస్తుంత ఈ కంట్రోల్ రూమ్స్ 24 గంటలు పని చేస్తున్నాయని చెప్పారు కలెక్టర్ చక్రధర్ బాబు. జిల్లా నుంచి మొత్తం 82 మంది అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లేందుకు ట్రావెల్స్‌ లో పేర్లు నమోదు చేసుకున్నారని, అయితే అందులో నలుగురు ముందుగానే తమ యాత్ర రద్దు చేసుకున్నారని అన్నారు. మొత్తం 78 మంది యాత్రకు వెళ్లగా అందరూ క్షేమంగా ఉన్నారని, వారి బంధువులెవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. 

యాత్ర తిరిగి ప్రారంభం.. 
వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా మూడు రోజులపాటు అమర్ నాథ్ యాత్రను రద్దు చేశారు అధికారులు. రెస్క్యూ ఆపరేషన్లు పూర్తయిన తర్వాత పరిస్థితి అనుకూలంగా ఉంది అని నిర్థారించుకున్న తర్వాత తిరిగి సోమవారం నుంచి అమర్ నాథ్ యాత్రను పునఃప్రారంభించారు. జమ్మూలోని భగవతి నగర్‌ యాత్రి నివాస్‌ నుంచి యాత్రికులు బేస్ క్యాంప్ కి బయలుదేరారు. మొత్తం 4,020 యాత్రికులు ధైర్యంగా ముందుకు కదిలారు. వీరందర్నీ 110 వాహనాలలో బేస్ క్యాంప్ కి తరలిస్తున్నారు. గట్టి బందోబస్తు మధ్య వీరిని తరలిస్తున్నట్టు సైనిక వర్గాలు తెలిపాయి. సోమవారం బయలుదేరిన వీరంతా.. ఈరోజు అమర్ నాథ్ గుహకు చేరుకుంటారు. అక్కడ మంచు లింగాన్ని దర్శించుకుంటారు.

మూడు రోజుల క్రితం జరిగిన దుర్ఘటనపై అధికారులు వివరణ ఇచ్చారు. యాత్రికులు రాత్రిపూట బస చేసేందుకు లోయ మార్గంలో టెంట్లు వేసుకున్నారు. అయితే ఆ ప్రదేశం సరైనది కాకపోవడం వల్లే ప్రాణ నష్టం అధికంగా జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటికి అధికారులు వివరణ ఇచ్చారు. అలాంటి తప్పు జరగలేదని, ఆప్రాంతం సురక్షితంగా ఉంటుందని అనుకున్న తర్వాతే అక్కడ టెంట్లు వేయించామని చెప్పారు అధికారులు. గతంలో వరదలు వచ్చినప్పుడు నీటి ప్రవాహం ఎటువైపు నుంచి వస్తోందో అంచనా వేసుకుని, దానికి దూరంగా టెంట్లు వేయించామన్నారు. కానీ ఈసారి వరదలు టెంట్లవైపు రావడంతో ప్రాణ నష్టం జరిగింది. చాలామంది గల్లంతయ్యారు. తిరిగి వారందర్నీ క్షేమంగా ఆస్పత్రులకు తరలించారు ప్రస్తుతం అక్కడ వరద తగ్గుముఖం పట్టింది. దీంతో అమర్ నాథ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పర్మిషన్ లేకుండా ర్యాలీలు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు
పర్మిషన్ లేకుండా ర్యాలీలు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: పర్మిషన్ లేకుండా ర్యాలీలు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు
పర్మిషన్ లేకుండా ర్యాలీలు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Embed widget