అన్వేషించండి

Nellore News : ధాన్యం మద్దతు ధర దళారుల జేబుల్లోకి, ప్లాన్ అమలు చేసిన వీఏఏలు!

Nellore News : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి సొంత జిల్లా నెల్లూరులో 25 మంది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్(వీఏఏ)లు సస్పెండ్ అయ్యారు. మొత్తం 63 మందిపై ఆరోపణలు రాగా అందరికీ షోకాజ్ నోటీసులిచ్చారు.

Nellore News : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి సొంత జిల్లా నెల్లూరులో ఏకంగా 25మంది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్(వీఏఏ)లు సస్పెండ్ అయ్యారు. మొత్తం 63 మందిపై ఆరోపణలు రాగా అందరికీ ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులిచ్చారు. తాజాగా 25 మందిని సస్పెండ్ చేయడంతో జిల్లా వ్యాప్తంగా కలకలం రేగింది.  


Nellore News : ధాన్యం మద్దతు ధర దళారుల జేబుల్లోకి, ప్లాన్ అమలు చేసిన వీఏఏలు!

అసలేం జరిగింది..?

ఏపీ ప్రభుత్వం సదుద్దేశంతో రైతుల కోసం తీసుకొచ్చిన ధాన్యం సేకరణ పథకం కొంతమంది వీఏఏల వల్ల అభాసుపాలవుతోంది. సొంత పొలం కలిగిన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలుంటాయి. కౌలు రైతులకు కౌలు రైతుల కార్డులుంటాయి. వీరంతా ఈ క్రాప్ నమోదు చేయించుకుంటే, దాని ప్రకారం రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే) ద్వారా ధాన్యం ప్రభుత్వానికి అమ్ముకోడానికి అవకాశముంటుంది. ప్రైవేటు దళారీలు రేటు తెగ్గోయడం, తరుగు తీసేయడం అంటూ ఇబ్బంది పెడుతుంటారు. కానీ ప్రభుత్వానికి అమ్మితే పుట్టి(850కేజీలు)కి 3500 రూపాయలు తేడా వస్తుంది. అందుకే దళారులు కూడా ప్రభుత్వానికి అమ్మడానికి సిద్ధమయ్యారు. ఈ అమ్మకాలలో వీఏఏలు కీలకం. వారు ఈక్రాప్ నమోదు చేస్తేనే దళారులు ప్రభుత్వానికి ధాన్యం అమ్మగలరు. అక్కడ డబ్బులు చేతులు మారాయి. వాస్తవానికి రైతుల దగ్గర ధాన్యం సేకరించాల్సిన ప్రభుత్వం, దళారుల దగ్గర సేకరించాల్సి వచ్చింది. రైతుల దగ్గర ముందుగానే ధాన్యం కొనుగోలు చేసిన దళారులు, ఆ తర్వాత దాన్ని ప్రభుత్వానికి అమ్మి సొమ్ము చేసుకున్నారు. దీనికోసం పొలాలే కాదు, కాల్వలు, వాగులు, ఇతర బంజరూ భూముల్ని కూడా వరి పండించే పొలాలుగా తప్పుగా ఈక్రాప్ చేశారు వీఏఏలు. అక్కడ వీరు ప్రభుత్వానికి దొరికిపోయారు. 

కావలిలో బయటపడింది

సహజంగా రబీ, ఖరీఫ్ సీజన్లో తమ ప్రాంతంలో ఎంత ధాన్యం ఉత్పత్తి అవుతుందో అధికారులకు తెలుసు. కానీ ఇటీవల ధాన్యం సేకరణ మొదలు పెట్టిన తర్వాత కావలి ఏరియాలో రెట్టింపు ధాన్యం పండినట్టు లెక్కలు తేలాయి. రెట్టింపు పొలం వినియోగంలోకి వచ్చినట్టు లెక్కలు చెబుతున్నాయి. దీంతో గణాంకాల శాఖ అధికారులు కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. తీగ లాగితే డొంక కదిలింది. రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయాల్సిన సందర్భంలో దళారుల దగ్గర పెద్ద మొత్తంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేలా పథకం పక్కదారి పట్టింది. దీనికి మూల కారకులు వీఏఏలు అని తేలింది. కావలి, ఆత్మకూరు డివిజన్ల పరిధిలో మొత్తం 63మందికి షోకాజ్ నోటీసులిచ్చారు ఉన్నతాధికారులు. తప్పు జరిగిందని పక్కాగా తేలిన తర్వాత 25 మందిని సస్పెండ్ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి సొంత జిల్లాలో ఇలా జరగడం సంచలనంగా మారింది. అయితే ఈ తప్పు జరిగే నాటికి కాకాణి వ్యవసాయశాఖ బాధ్యతలు చేపట్టలేదు. ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత ఈ ఇదంతా బయటపడింది. 

ఎఫ్టీఓలు అనుమానాస్పదం

గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది జులై వరకు రెండు సీజన్లలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి పలు అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయని అధికారులు అంటున్నారు. రైతులకు మద్దతు ధర అందకుండా చేయడంతో పాటు దళారులకు పుట్టికి 3500 రూపాయల వరకు ఆదాయం చేకూర్చేలా చూశారని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో మొదటి దశలో రూ. 3 లక్షల కంటే ఎక్కువ ధాన్యం అమ్మిన రైతుల వివరాలను ఉన్నతాధికారులు పరిశీలించారు. అందులో విస్తుబోయే విషయాలు బయటపడ్డాయి. 4,800 ఎఫ్‌.టి.ఓ (ఫోర్స్ ట్రాన్స్ ఫర్ ఆర్డర్)లు పరిశీలించగా.. రూ.34 కోట్ల విలువైన 500 ఎఫ్‌.టి.ఓ. లు తప్పుగా నమోదైనట్టు తేలింది. 11 కోట్ల రూపాయల విలువైన ఎఫ్‌.టి.ఓలు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ప్రభుత్వం వారికి డబ్బులు చెల్లించకుండా హోల్డ్ లో పెట్టింది. ప్రభుత్వానికి ధాన్యం అమ్మిన దళారులు ఈ ఇన్వెస్టిగేషన్ తో లబోదిబోమంటున్నారు. 

Also Read : Nellore Penna Floods : పెండింగ్ లో వరద హామీలు, కష్టాల్లో నెల్లూరు ప్రజలు

టాప్ హెడ్ లైన్స్

Breaking News: లార్డ్స్ వన్డేలో భారత్ ఓటమి.. 2-1 తేడాతో సిరీస్ దక్కించుకున్న ఇంగ్లాండ్
లార్డ్స్ వన్డేలో భారత్ ఓటమి.. 2-1 తేడాతో సిరీస్ దక్కించుకున్న ఇంగ్లాండ్
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
AP Local Body Elections: కూటమిలో జనసేన కుంపటి! వైసీపీ ట్రాప్‌లో పడొద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
కూటమిలో జనసేన కుంపటి! వైసీపీ ట్రాప్‌లో పడొద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
Visakha Road Accident: విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Embed widget