అన్వేషించండి

Nellore News : ధాన్యం మద్దతు ధర దళారుల జేబుల్లోకి, ప్లాన్ అమలు చేసిన వీఏఏలు!

Nellore News : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి సొంత జిల్లా నెల్లూరులో 25 మంది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్(వీఏఏ)లు సస్పెండ్ అయ్యారు. మొత్తం 63 మందిపై ఆరోపణలు రాగా అందరికీ షోకాజ్ నోటీసులిచ్చారు.

Nellore News : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి సొంత జిల్లా నెల్లూరులో ఏకంగా 25మంది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్(వీఏఏ)లు సస్పెండ్ అయ్యారు. మొత్తం 63 మందిపై ఆరోపణలు రాగా అందరికీ ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులిచ్చారు. తాజాగా 25 మందిని సస్పెండ్ చేయడంతో జిల్లా వ్యాప్తంగా కలకలం రేగింది.  


Nellore News : ధాన్యం మద్దతు ధర దళారుల జేబుల్లోకి, ప్లాన్ అమలు చేసిన వీఏఏలు!

అసలేం జరిగింది..?

ఏపీ ప్రభుత్వం సదుద్దేశంతో రైతుల కోసం తీసుకొచ్చిన ధాన్యం సేకరణ పథకం కొంతమంది వీఏఏల వల్ల అభాసుపాలవుతోంది. సొంత పొలం కలిగిన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలుంటాయి. కౌలు రైతులకు కౌలు రైతుల కార్డులుంటాయి. వీరంతా ఈ క్రాప్ నమోదు చేయించుకుంటే, దాని ప్రకారం రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే) ద్వారా ధాన్యం ప్రభుత్వానికి అమ్ముకోడానికి అవకాశముంటుంది. ప్రైవేటు దళారీలు రేటు తెగ్గోయడం, తరుగు తీసేయడం అంటూ ఇబ్బంది పెడుతుంటారు. కానీ ప్రభుత్వానికి అమ్మితే పుట్టి(850కేజీలు)కి 3500 రూపాయలు తేడా వస్తుంది. అందుకే దళారులు కూడా ప్రభుత్వానికి అమ్మడానికి సిద్ధమయ్యారు. ఈ అమ్మకాలలో వీఏఏలు కీలకం. వారు ఈక్రాప్ నమోదు చేస్తేనే దళారులు ప్రభుత్వానికి ధాన్యం అమ్మగలరు. అక్కడ డబ్బులు చేతులు మారాయి. వాస్తవానికి రైతుల దగ్గర ధాన్యం సేకరించాల్సిన ప్రభుత్వం, దళారుల దగ్గర సేకరించాల్సి వచ్చింది. రైతుల దగ్గర ముందుగానే ధాన్యం కొనుగోలు చేసిన దళారులు, ఆ తర్వాత దాన్ని ప్రభుత్వానికి అమ్మి సొమ్ము చేసుకున్నారు. దీనికోసం పొలాలే కాదు, కాల్వలు, వాగులు, ఇతర బంజరూ భూముల్ని కూడా వరి పండించే పొలాలుగా తప్పుగా ఈక్రాప్ చేశారు వీఏఏలు. అక్కడ వీరు ప్రభుత్వానికి దొరికిపోయారు. 

కావలిలో బయటపడింది

సహజంగా రబీ, ఖరీఫ్ సీజన్లో తమ ప్రాంతంలో ఎంత ధాన్యం ఉత్పత్తి అవుతుందో అధికారులకు తెలుసు. కానీ ఇటీవల ధాన్యం సేకరణ మొదలు పెట్టిన తర్వాత కావలి ఏరియాలో రెట్టింపు ధాన్యం పండినట్టు లెక్కలు తేలాయి. రెట్టింపు పొలం వినియోగంలోకి వచ్చినట్టు లెక్కలు చెబుతున్నాయి. దీంతో గణాంకాల శాఖ అధికారులు కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. తీగ లాగితే డొంక కదిలింది. రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయాల్సిన సందర్భంలో దళారుల దగ్గర పెద్ద మొత్తంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేలా పథకం పక్కదారి పట్టింది. దీనికి మూల కారకులు వీఏఏలు అని తేలింది. కావలి, ఆత్మకూరు డివిజన్ల పరిధిలో మొత్తం 63మందికి షోకాజ్ నోటీసులిచ్చారు ఉన్నతాధికారులు. తప్పు జరిగిందని పక్కాగా తేలిన తర్వాత 25 మందిని సస్పెండ్ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి సొంత జిల్లాలో ఇలా జరగడం సంచలనంగా మారింది. అయితే ఈ తప్పు జరిగే నాటికి కాకాణి వ్యవసాయశాఖ బాధ్యతలు చేపట్టలేదు. ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత ఈ ఇదంతా బయటపడింది. 

ఎఫ్టీఓలు అనుమానాస్పదం

గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది జులై వరకు రెండు సీజన్లలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి పలు అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయని అధికారులు అంటున్నారు. రైతులకు మద్దతు ధర అందకుండా చేయడంతో పాటు దళారులకు పుట్టికి 3500 రూపాయల వరకు ఆదాయం చేకూర్చేలా చూశారని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో మొదటి దశలో రూ. 3 లక్షల కంటే ఎక్కువ ధాన్యం అమ్మిన రైతుల వివరాలను ఉన్నతాధికారులు పరిశీలించారు. అందులో విస్తుబోయే విషయాలు బయటపడ్డాయి. 4,800 ఎఫ్‌.టి.ఓ (ఫోర్స్ ట్రాన్స్ ఫర్ ఆర్డర్)లు పరిశీలించగా.. రూ.34 కోట్ల విలువైన 500 ఎఫ్‌.టి.ఓ. లు తప్పుగా నమోదైనట్టు తేలింది. 11 కోట్ల రూపాయల విలువైన ఎఫ్‌.టి.ఓలు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ప్రభుత్వం వారికి డబ్బులు చెల్లించకుండా హోల్డ్ లో పెట్టింది. ప్రభుత్వానికి ధాన్యం అమ్మిన దళారులు ఈ ఇన్వెస్టిగేషన్ తో లబోదిబోమంటున్నారు. 

Also Read : Nellore Penna Floods : పెండింగ్ లో వరద హామీలు, కష్టాల్లో నెల్లూరు ప్రజలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh Slams Jagan: జనం ఛీకొట్టినా జగన్ డ్రామాలు మానడం లేదు- నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసంపై నారా లోకేష్
జనం ఛీకొట్టినా జగన్ డ్రామాలు మానడం లేదు- నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసంపై నారా లోకేష్
Heatwave In AP and Telangana: తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
e- Shram Card 2026: అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రూ.2 లక్షల బీమా.. ఇ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు, దరఖాస్తు విధానం
అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రూ.2 లక్షల బీమా.. ఇ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు, దరఖాస్తు విధానం
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు

వీడియోలు

King Kohli vs Prince Gill IPL 2026 Final | కింగ్ vs ప్రిన్స్ ఎవరిదీ పైచేయి?
Captain vs Coach in RR IPL 2026 | పరాగ్ కామెంట్స్‌పై కోచ్ సంగక్కర ఫైర్
Riyan Parag Consoling Vaibhav Suryavanshi | డగౌట్ లో ఏడ్చేసిన వైభవ్ సూర్యవంశీ
RCB vs GT Final Rain Rules | IPL 2026 ఫైనల్‌కు వర్షం ముప్పు?
RCB vs GT Match Preview IPL 2026 Final | ఈసారి ఐపీఎల్ కప్ ఎవరిది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vaibhav Suryavanshi Records: ఐపీఎల్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత, ఆరెంజ్ క్యాప్ సహా పలు రికార్డులు సొంతం
ఐపీఎల్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత, ఆరెంజ్ క్యాప్ సహా పలు రికార్డులు సొంతం
IPL 2026 Prize Money Details: ఐపీఎల్ విజేత, రన్నరప్ జట్లకు ప్రైజ్ మనీ ఎంత ద‌క్కుతుందంటే..?
ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్: విజేత, రన్నరప్ జట్లకు ప్రైజ్ మనీ ఎంత ద‌క్కుతుందంటే..?
KTR vs Revanth Reddy: రేవంత్ రెడ్డికి దమ్ముంటే 420 హామీల అమలుపై ఛాలెంజ్ స్వీకరించాలి: కేటీఆర్ డిమాండ్
రేవంత్ రెడ్డికి దమ్ముంటే 420 హామీల అమలుపై ఛాలెంజ్ స్వీకరించాలి: కేటీఆర్ డిమాండ్
Nara Lokesh Slams Jagan: జనం ఛీకొట్టినా జగన్ డ్రామాలు మానడం లేదు- నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసంపై నారా లోకేష్
జనం ఛీకొట్టినా జగన్ డ్రామాలు మానడం లేదు- నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసంపై నారా లోకేష్
OTT Movies : గోదారి గట్టుపైన, సరస్వతి వెరీ స్పెషల్ - రెండు ఓటీటీల్లోకి వచ్చేశాయ్
గోదారి గట్టుపైన, సరస్వతి వెరీ స్పెషల్ - రెండు ఓటీటీల్లోకి వచ్చేశాయ్
Gen Z Impact Indian Politics: భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
Balka Suman Remand: బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
IPL 2026 GT vs RCB Grand Final: బ్యాక్ టూ బ్యాక్ టైటిల్ పై ఆర్సీబీ గురి.. ఫైన‌ల్లో జీటీని త‌క్కువ స్కోరుకే ప‌రిమితం.. రాణించిన వాషింగ్ట‌న్, ర‌సిక్
బ్యాక్ టూ బ్యాక్ టైటిల్ పై ఆర్సీబీ గురి.. ఫైన‌ల్లో జీటీని త‌క్కువ స్కోరుకే ప‌రిమితం.. రాణించిన వాషింగ్ట‌న్, ర‌సిక్
Embed widget