అన్వేషించండి

Nara Lokesh : ఏపీలో రాజ్యాంగ విరుద్ధ పాలన - చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు నారా లోకేష్ ఫిర్యాదు !

ఏపీని దక్షిణాది బీహార్‌గా మార్చేశారని నారా లోకేష్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.

 

Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న కక్ష సాధింపు రాజకీయాలు, వ్యవస్థల విధ్వంసం,  ప్రజా కంటక పాలనపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు నారా లోకేష్ ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలతో కలిసి రాజ్ భవన్‌కు వెళ్లిన నారా లోకేష్ గంటకుపైగా రాష్ట్రంలో పరిస్థితుల్ని గవర్నర్‌కు వివరించారు. ఎనిమిది పేజీల సమగ్రమైన లేఖను అందించారు. ఇందులో 29 అంశాల గురించి ప్రస్తావించారు.  చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలపై కూడా కేసులు నమోదు చేస్తున్నారని, ప్రభుత్వ పనితీరును ప్రశ్నించినా కేసులు పెట్టే పరిస్థితి ఏర్పడిందని నారా లోకేష్ గవర్నర్ కు వివరించారు.  వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలపై ఇప్పటి వరకూ పెట్టిన కేసుల జాబితాను కూడా ఈ సందర్భంగా టీడీపీ బృందం గవర్నర్ కు ఇచ్చింది. నారా లోకేష్ తో పాటు గవర్నర్ ను కలసిన వారిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీమంత్రులు కొల్లు రవీంద్ర, పీతల సుజాత, ధూళిపాళ్ల నరేంద్ర, అశోక్ బాబులు ఉన్నారు.

కక్ష సాధింపు రాజకీయాలతో పాలన                      

వైసీపీ సర్కార్ కక్ష సాధింపు రాజకీయాలతో ఏపీలో టెర్రర్ వాతావరణాన్ని సృష్టిస్తోందని.. ప్రజల పక్షాన పోరాడుతున్న టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుపై తలాతోక లేని దొంగ కేసులు పెట్టి ఎన్నికల సన్నాహాల్లో పాల్గొనకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి కుట్రలకు  భయపడేది లేదని తొక్కుకుంటూ వెళ్తామని నారా లోకేష్ హెచ్చరించారు. ఏపీని దక్షిణాది బీహార్ రాష్ట్రంలో మార్చేశారని మండిపడ్డారు. వైసీపీ అరాచకాలపై సాక్ష్యాధారాలతో సహా గవర్నర్‌కు వివరించామన్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసుల వివరాలు.. కుట్రపూరితమని.. వాటి గురించిన పూర్తి సమాచారాన్ని గవర్నర్‌కు ఇచ్చామన్నారు. ఏపీని దక్షిణాది బీహార్‌లాగా మార్చేశారని నారా లోకేష్ విమర్శలు గుప్పించారు.  

తప్పుడు కేసులపై న్యాయపోరాటం చేస్తాం!

17ఎకి 2018లో సవరణ వచ్చింది, చంద్రబాబుపై కేసు విషయంలో పర్మిషన్ తీసుకోవాల్సి ఉండగా తీసుకోలేదని చెప్పాం, వివరాలన్నీ తెప్పించుకుంటామని చెప్పారు. భయం మా బయోడేటాలో లేదు... పోరాటమే, అడ్డొస్తే తొక్కుకుంటా పోతాం. చంద్రబాబు ఇంటీరియమ్ బెయిల్ పై ఉన్నారు, 10వతేదీనుంచి రెగ్యులర్ బెయిల్ పై విచారణ ఉంది, వచ్చే తీర్పులను బట్టి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. ఈ ప్రభుత్వంలో దొంగ కేసులు పెట్టడం అనివార్యం, రాష్టస్థాయి నుంచి గ్రామ కార్యకర్త వరకు కేసులు పెడుతున్నారు, న్యాయపోరాటం చేస్తాం. టిడిపి కార్యకర్తలకు న్యాయసహాయం అందిస్తున్నాం, కార్యకర్తలను కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది, కాపాడుకుంటాం. నేను, అచ్చెన్నాయుడు వ్యక్తిగతంగా చూస్తున్నామని లోకేష్ తెలిపారు. 

రేపు ఎన్నికల కమిషన్ ను కలుస్తాం!

రాష్ట్రంలో ఓటర్ల జాబితా అవతకతవకలపై రేపు టిడిపి బృందం ఎన్నికల కమిషన్ ను కలుస్తుంది, 6లేఖలు ఇస్తాం, తప్పుల తడక ఓటరు లిస్టుపై ఫిర్యాదు చేస్తాం, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. దొంగఓట్లపై మేం పోరాడతాం, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం, డిల్లీకి కూడా వెళ్లి పోరాటం కొనసాగిస్తాం. ముఖ్యమంత్రి ఫోటోతో కూడా దొంగఓటు ఉంది, సిఎం 38కేసుల్లో దొంగ, 10సంవత్సరాల కేసుల్లో బెయిల్ పై తిరుగుతున్న దొంగ, సొంత బాబాయిని లేపేసిన వ్యక్తి జగన్, అవినాష్ రెడ్డిని కాపాడటానికి సిబిఐని ఎపికి రానీయకుండా చేశారు. దొంగనుంచి మంచి పరిపాలన ఎలా ఆశిస్తాం? జగన్ పై 38కేసులు ఉన్నాయి, 11సిబిఐ, 7 ఈడి కేసులు ఉన్నాయి. పదేళ్లుగా బెయిల్ పై తిరుగుతున్నాడు, ఏ తప్పు చేయని చంద్రబాబును 38కేసులున్న వ్యక్తి 53రోజులు జైలులో ఉంచాడు, అందుకే రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని అంటున్నాం. 2019నుంచి రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యంగం అమలవుతోంది.

నాయకులంతా ప్రజల్లోనే ఉన్నాం!

ఎన్ని అడ్డంకులు సృష్టించినా నాయకులందరం ప్రజల్లో ఉన్నాం, బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీపై ఇంటింటికీ తిరుగుతున్నాం, ప్రతిపక్షనేతలపై దాడులను కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. టిడిపి-జనసేన అధికారంలోకి వచ్చాక ఏం చేస్తామో చెబుతున్నాం. జెఎసి మీటింగ్ లో కూడా టిడిపి సూపర్ సిక్స్ పథకాలను జనసేనకు వివరించాం, చాలా బాగుతున్నాయని అన్నారు, పవన్ కొన్ని అదనంగా సూచించారు. వాటిపై జెఎసి మీటింగ్ లో చర్చిస్తున్నాం. రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉంది, రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది, పశ్చిమప్రాంతంలో తాగునీటికి కటకటలాడుతున్నారు, దీనిపై ఉద్యమం చేయాలని నిర్ణయించుకున్నామని లోకేష్ తెలిపారు.
 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget