అన్వేషించండి

Nara Lokesh : ఏపీలో రాజ్యాంగ విరుద్ధ పాలన - చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు నారా లోకేష్ ఫిర్యాదు !

ఏపీని దక్షిణాది బీహార్‌గా మార్చేశారని నారా లోకేష్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.

 

Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న కక్ష సాధింపు రాజకీయాలు, వ్యవస్థల విధ్వంసం,  ప్రజా కంటక పాలనపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు నారా లోకేష్ ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలతో కలిసి రాజ్ భవన్‌కు వెళ్లిన నారా లోకేష్ గంటకుపైగా రాష్ట్రంలో పరిస్థితుల్ని గవర్నర్‌కు వివరించారు. ఎనిమిది పేజీల సమగ్రమైన లేఖను అందించారు. ఇందులో 29 అంశాల గురించి ప్రస్తావించారు.  చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలపై కూడా కేసులు నమోదు చేస్తున్నారని, ప్రభుత్వ పనితీరును ప్రశ్నించినా కేసులు పెట్టే పరిస్థితి ఏర్పడిందని నారా లోకేష్ గవర్నర్ కు వివరించారు.  వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలపై ఇప్పటి వరకూ పెట్టిన కేసుల జాబితాను కూడా ఈ సందర్భంగా టీడీపీ బృందం గవర్నర్ కు ఇచ్చింది. నారా లోకేష్ తో పాటు గవర్నర్ ను కలసిన వారిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీమంత్రులు కొల్లు రవీంద్ర, పీతల సుజాత, ధూళిపాళ్ల నరేంద్ర, అశోక్ బాబులు ఉన్నారు.

కక్ష సాధింపు రాజకీయాలతో పాలన                      

వైసీపీ సర్కార్ కక్ష సాధింపు రాజకీయాలతో ఏపీలో టెర్రర్ వాతావరణాన్ని సృష్టిస్తోందని.. ప్రజల పక్షాన పోరాడుతున్న టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుపై తలాతోక లేని దొంగ కేసులు పెట్టి ఎన్నికల సన్నాహాల్లో పాల్గొనకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి కుట్రలకు  భయపడేది లేదని తొక్కుకుంటూ వెళ్తామని నారా లోకేష్ హెచ్చరించారు. ఏపీని దక్షిణాది బీహార్ రాష్ట్రంలో మార్చేశారని మండిపడ్డారు. వైసీపీ అరాచకాలపై సాక్ష్యాధారాలతో సహా గవర్నర్‌కు వివరించామన్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసుల వివరాలు.. కుట్రపూరితమని.. వాటి గురించిన పూర్తి సమాచారాన్ని గవర్నర్‌కు ఇచ్చామన్నారు. ఏపీని దక్షిణాది బీహార్‌లాగా మార్చేశారని నారా లోకేష్ విమర్శలు గుప్పించారు.  

తప్పుడు కేసులపై న్యాయపోరాటం చేస్తాం!

17ఎకి 2018లో సవరణ వచ్చింది, చంద్రబాబుపై కేసు విషయంలో పర్మిషన్ తీసుకోవాల్సి ఉండగా తీసుకోలేదని చెప్పాం, వివరాలన్నీ తెప్పించుకుంటామని చెప్పారు. భయం మా బయోడేటాలో లేదు... పోరాటమే, అడ్డొస్తే తొక్కుకుంటా పోతాం. చంద్రబాబు ఇంటీరియమ్ బెయిల్ పై ఉన్నారు, 10వతేదీనుంచి రెగ్యులర్ బెయిల్ పై విచారణ ఉంది, వచ్చే తీర్పులను బట్టి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. ఈ ప్రభుత్వంలో దొంగ కేసులు పెట్టడం అనివార్యం, రాష్టస్థాయి నుంచి గ్రామ కార్యకర్త వరకు కేసులు పెడుతున్నారు, న్యాయపోరాటం చేస్తాం. టిడిపి కార్యకర్తలకు న్యాయసహాయం అందిస్తున్నాం, కార్యకర్తలను కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది, కాపాడుకుంటాం. నేను, అచ్చెన్నాయుడు వ్యక్తిగతంగా చూస్తున్నామని లోకేష్ తెలిపారు. 

రేపు ఎన్నికల కమిషన్ ను కలుస్తాం!

రాష్ట్రంలో ఓటర్ల జాబితా అవతకతవకలపై రేపు టిడిపి బృందం ఎన్నికల కమిషన్ ను కలుస్తుంది, 6లేఖలు ఇస్తాం, తప్పుల తడక ఓటరు లిస్టుపై ఫిర్యాదు చేస్తాం, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. దొంగఓట్లపై మేం పోరాడతాం, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం, డిల్లీకి కూడా వెళ్లి పోరాటం కొనసాగిస్తాం. ముఖ్యమంత్రి ఫోటోతో కూడా దొంగఓటు ఉంది, సిఎం 38కేసుల్లో దొంగ, 10సంవత్సరాల కేసుల్లో బెయిల్ పై తిరుగుతున్న దొంగ, సొంత బాబాయిని లేపేసిన వ్యక్తి జగన్, అవినాష్ రెడ్డిని కాపాడటానికి సిబిఐని ఎపికి రానీయకుండా చేశారు. దొంగనుంచి మంచి పరిపాలన ఎలా ఆశిస్తాం? జగన్ పై 38కేసులు ఉన్నాయి, 11సిబిఐ, 7 ఈడి కేసులు ఉన్నాయి. పదేళ్లుగా బెయిల్ పై తిరుగుతున్నాడు, ఏ తప్పు చేయని చంద్రబాబును 38కేసులున్న వ్యక్తి 53రోజులు జైలులో ఉంచాడు, అందుకే రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని అంటున్నాం. 2019నుంచి రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యంగం అమలవుతోంది.

నాయకులంతా ప్రజల్లోనే ఉన్నాం!

ఎన్ని అడ్డంకులు సృష్టించినా నాయకులందరం ప్రజల్లో ఉన్నాం, బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీపై ఇంటింటికీ తిరుగుతున్నాం, ప్రతిపక్షనేతలపై దాడులను కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. టిడిపి-జనసేన అధికారంలోకి వచ్చాక ఏం చేస్తామో చెబుతున్నాం. జెఎసి మీటింగ్ లో కూడా టిడిపి సూపర్ సిక్స్ పథకాలను జనసేనకు వివరించాం, చాలా బాగుతున్నాయని అన్నారు, పవన్ కొన్ని అదనంగా సూచించారు. వాటిపై జెఎసి మీటింగ్ లో చర్చిస్తున్నాం. రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉంది, రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది, పశ్చిమప్రాంతంలో తాగునీటికి కటకటలాడుతున్నారు, దీనిపై ఉద్యమం చేయాలని నిర్ణయించుకున్నామని లోకేష్ తెలిపారు.
 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs nz 2nd odi highlights: రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
Harish Rao: సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
Bullet Bike Prize in Cockfights: కోడి పందేలు.. వరుస విజయాలతో బుల్లెట్‌ బైక్ నెగ్గిన పందెం రాయుళ్లు
కోడి పందేలు.. వరుస విజయాలతో బుల్లెట్‌ బైక్ నెగ్గిన పందెం రాయుళ్లు
Chandrababu Sankranti Celebrations: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు

వీడియోలు

AA 23 Announcement Video Decode | Allu Arjun తో ఏం ప్లాన్ చేశావయ్యా Lokesh Kanagaraj | ABP Desam
Mumbai Indians vs Gujarat Giants WPL 2026 | హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంసం!
Ind vs NZ Shreyas Iyer Records | రికార్డు సృష్టించనున్న శ్రేయస్ అయ్యర్!
Jitesh Sharma Being Dropped from T20 World Cup | వరల్డ్ కప్ జితేష్ సంచలన వ్యాఖ్యలు!
India vs New Zealand 2nd ODI | టీమిండియాలో భారీ మార్పులు ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs nz 2nd odi highlights: రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
Harish Rao: సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
Bullet Bike Prize in Cockfights: కోడి పందేలు.. వరుస విజయాలతో బుల్లెట్‌ బైక్ నెగ్గిన పందెం రాయుళ్లు
కోడి పందేలు.. వరుస విజయాలతో బుల్లెట్‌ బైక్ నెగ్గిన పందెం రాయుళ్లు
Chandrababu Sankranti Celebrations: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
Nagoba Jatara 2026: నాగోబా జాతర సందర్భంగా జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
నాగోబా జాతర సందర్భంగా జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
Hyderabad CP Sajjanar: మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారంపై చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
Harshit Rana: గంభీర్ దత్తపుత్రుడు అంటూ ట్రోలింగ్.. కట్ చేస్తే టీమిండియా సక్సెస్‌ఫుల్ బౌలర్‌గా రికార్డ్
గంభీర్ దత్తపుత్రుడు అంటూ ట్రోలింగ్.. కట్ చేస్తే టీమిండియా సక్సెస్‌ఫుల్ బౌలర్‌గా రికార్డ్
Telangana: జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
Embed widget