అన్వేషించండి

Nara Lokesh: కంటతడి పెట్టిన నారా లోకేశ్ - ప్రజల కోసమే చంద్రబాబు నిరంతర పోరాటం అంటూ భావోద్వేగం

Nara Lokesh: చంద్రబాబు ప్రజల మనిషని, ఆయన వారి సంక్షేమం కోసమే నిరంతరం పోరాడారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో లోకేశ్ కంటతడి పెట్టారు.

టీడీపీ అధినేత ఎలాంటి తప్పు చేయలేదని, ప్రజల సంక్షేమం కోసమే ఆయన నిరంతర పోరాటమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భావోద్వేగానికి గురయ్యారు. టీడీపీ నేతలు, శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశంలో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తల్లి భువనేశ్వరి ఐటీ రిటర్న్స్ చూపి కేసు పెడతామని సీఐడీ బెదిరించిందని, సేవా కార్యక్రమాలు తప్ప, రాజకీయాలు తన తల్లికి తెలియవని అన్నారు. 

మంత్రుల విమర్శలపై ఆగ్రహం

భువనేశ్వరి, బ్రాహ్మణి కలిసి చంద్రబాబును చంపేందుకు కుట్రలు పన్నారంటూ వైసీపీ మంత్రులు చేసిన విమర్శలపై నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నా తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి కలిసి చంద్రబాబుకు భోజనంలో విషం కలుపుతారట. భోజనంలో విషం కలపడం, బాబాయిని చంపేయడం వంటివి జగన్ డీఎన్ఏ' అంటూ లోకేశ్ మండిపడ్డారు.

సీఎం జగన్ పై విమర్శలు

2019లో ఒక్క ఛాన్స్ అంటే ప్రజలు జగన్ ను సీఎంగా చేశారని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ నియంతలా వ్యవహరించారని, రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేశారని మండిపడ్డారు. వేల మంది టీడీపీ నేతలపై కక్ష పూరితంగా కేసులు పెట్టారని, ప్రజా వేదిక కూల్చేశారని అన్నారు. ఇసుక రవాణా, మద్యం విషయాల్లో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. టీడీపీ హయాంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిందని ఇప్పుడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని విమర్శించారు. చంద్రబాబు సీఎంగా కష్టపడి తెచ్చిన పరిశ్రమలను జగన్, వైసీపీ నేతలు రాష్ట్రం నుంచి వెళ్లగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'దోపిడీలో బిజీ'

రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయని, వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని, ప్రాజెక్టులు కాపాడాల్సిన జగన్ దోపిడీలో బిజీగా ఉన్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు. పేదలను దోచుకుంటూ పేదలకు - పెత్తందారులకు మధ్య యుద్ధం అంటూ జగన్ ప్రసంగిస్తున్నారని దుయ్యబట్టారు. విద్యుత్ ఛార్జీల బాదుడుతో ఏడాదికి ప్రజల నుంచి రూ.11 వేల కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. జరగబోయేది పేదలకు - దోపిడీదారులకు మధ్య యుద్ధమని చెప్పారు.

టీడీపీ - జనసేన లేకుంటే

టీడీపీ - జనసేన కలిస్తే వచ్చే ఎన్నికల్లో 160 స్థానాల్లో గెలుపు ఖాయమని నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ 2 పార్టీలు కలిసి పోరాడకుంటే రాష్ట్రాన్ని సీఎం జగన్ ముక్కలు చేసేవాడని అన్నారు. ఏ తప్పూ చేయకున్నా చంద్రబాబును జైల్లో పెట్టారని, డబ్బే సంపాదించాలని భావిస్తే ఆయనకు రాజకీయాలు అవసరం లేదన్నారు. ఉద్యోగాలు కల్పించినందుకు, సంక్షేమం అమలు చేసినందుకు, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరినందుకు, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని అడిగినందుకు ఆయన్ను జైల్లో పెట్టారా.? అని లోకేశ్ నిలదీశారు.

'రాష్ట్రానికి చంద్రబాబు అనేక పరిశ్రమలు తీసుకొచ్చారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించారు. కుటుంబం గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అహర్నిశలు ప్రజల కోసమే పరితపించారు. పేదవారి అభివృద్ధి కోసమే కష్టపడ్డారు.' అని లోకేశ్ పేర్కొన్నారు.

 

 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Kerala Gen Z political Leader: జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
Embed widget