అన్వేషించండి

Nadendla Manohar: సీఎంకి పాలన చేతగాక దిగజారి మాట్లాడుతున్నారు: నాదెండ్ల మనోహర్

Nadendla Manohar: పవన్ కల్యాణ్‌పై సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.

Nadendla Manohar: పవన్ కల్యాణ్‌పై సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. జగన్ ఇంత కంటే దిగజారిపోడు అనుకున్న ప్రతిసారీ మా నమ్మకాన్ని వమ్ము చేస్తూనే ఉన్నాడని అన్నారు. పవన్ పెళ్లిళ్ల విషయంలో అత్యున్నత పదవిలో ఉన్న జగన్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సమస్యలను పరిష్కరిస్తూ ఎలా ముందుకు వెళళ్తామో చెప్పకుండా వైసీపీ ప్రభుత్వ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి పవన్ వ్యక్తి గత జీవితం గురించి మాట్లాడుతున్నారిన విమర్శించారు. జగన్‌కు పాలన చేతగాక, మానసిక స్థితి సరిగాలేక ఫ్రస్టేషన్ తో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. 

వేల కోట్ల అవినీతి
ప్రజాధనంతో నిర్వహించే సభలో రాష్ట్ర భవిష్యత్తుపైనా, యువతకు కల్పించాల్సిన అవకాశాలు, ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల గురించి మాట్లాడాలని హితవుపలికారు. పవన్ సినిమా షూటింగ్‌ల గురించి జగన్ మాట్లాడటం విచిత్రంగా ఉందని, సినిమాల్లో సంపాదించిన డబ్బుతోనే పార్టీ నడిపిస్తున్న గొప్ప నాయకుడు పవన్ అని అన్నారు. జగన్‌లా రూ.వేల కోట్లు అక్రమ ధనం, అవినీతి ధనం పవన్ దగ్గర లేదన్నారు. జగన్ మాదిరి సంతకం చేసి అవినీతి చేయలేరు. టోఫెల్ పరీక్ష పేరుతో ఒప్పందం చేసుకొని రూ.వేల కోట్ల అవినీతి చేశారని ఆరోపించారు. ఒక హద్దు దాటి జగన్ ప్రతిపక్షాలపై చేస్తున్న వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని అన్నారు. తమ పార్టీ నాయకులు ఎవరైనా ఆవేశపడి ఏదైనా అంటే పవన్ వద్దని వారిస్తారని చెప్పారు.

వీర మహిళల ఆధ్వర్యంలో నిరసనలు
మహిళల గురించి జగన్ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని, దీనిపై వీర మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని నాదెండ్ల తెలిపారు. మహిళలే సీఎం జగన్‌కు సమాధానం చెప్పాల్పిన సమయం వచ్చిందన్నారు. మహిళల ఆత్మగౌరవం దిగజార్చేలా మాట్లాడుతున్న ఈ ముఖ్యమంత్రి వారికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన బాటలోనే జిల్లాల్లోని వైసీపీ నేతలు సైతం విపక్ష నాయకులు, మహిళలపై ఇష్టానుసారం విరుచుకుపడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి 5 నెలలే సమయం ఉందని అహంకారంతో పెట్రోగిపోతున్న వైసీపీ నాయకులకు తగిన విధంగా గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

దొంగ లెక్కలు, చీకటి జీఓలు
వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి రాష్ట్ర ప్రజలను దొంగ లెక్కలు, చీకటి జీవోలతో మోసం చేస్తోందని నాదెండ్ల విమర్శించారు. చీకటి జీవోలతో, అర్ధం కాని లెక్కలతోనే పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. మన్యం ప్రాంతంలో 1057 కిలోమీటర్ల మేర రోడ్లు వేశామని, దీంతోనే నక్సల్స్ ప్రభావం తగ్గిందని చెప్పుకొచ్చారని, కానీ వైసీపీ పాలనలో గిరిజన ప్రాంతంలో జరిగింది కేవలం అక్రమ బాక్సైడ్ మైనింగ్ మాత్రమేనని ఆరోపించారు. ఆయా ప్రాంతాల్లో కామ్రేడ్లు ఉండబట్టి కాస్త అయినా వైసీపీ దాష్టీకాలను అడ్డుకట్ట పడిందన్నారు. లేకుంటే మొత్తం కొండలు, గుట్టలు ఖాళీ చేసేవారని మండిపడ్డారు. 

ఆ ధైర్యం జగన్‌కు ఉందా?
సీఎం క్యాంపు కార్యాలయం కోసం రుషికొండను బోడిగుండు చేసి అక్కడ నిర్మాణాలు చేస్తున్నారని విమర్శించారు. రూ.500 కోట్లతో అక్కడ క్యాంపు కార్యాలయం ఏర్పాటు ఎందుకు..? అంత లగ్జరీగా క్యాంపు కార్యాలయ నిర్మాణం దీనికోసమో ప్రజలకు చెప్పాలని, కేవలం సీఎం క్యాంపు కార్యాలయం నిర్మించి, అదే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూ మరో కట్టుకథ చెప్పేందుకు సిద్ధమవుతున్నారని మండిపడ్డారు. విజయదశమి నుంచి విశాఖ కేంద్రంగా అక్కడి నుంచే పరిపాలిస్తామని ముఖ్యమంత్రిని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలంటూ సవాల్ విసిరారు. ఎన్నో వనరులతో కూడిన మన్యం రెండు జిల్లాల నుంచి వైసీపీ పాలనలో 3053 కుటుంబాలు వలస వెళ్లిపోయాయని, రాష్ట్ర మొత్తం మీద 3.31 లక్షల కుటుంబాలు వలస వెళ్లిపోయాయని చెప్పారు. 

‘అమిత్ షాతో లోకేష్ భేటీని స్వాగతిస్తున్నాం’
జనసేన ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ అని నాదెండ్ల అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే మాటకు కట్టుబడి ఉన్నామని అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో నారా లోకేష్ గారి భేటీని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో రాష్ట్ర అంశాలు, రాజకీయ అంశాల గురించి తమ దృష్టికి రాలేదని, కచ్చితంగా రాష్ట్రంలో వైసీపీ ఏతర పక్షాలన్నీ ఉమ్మడిగా ముందుకు వెళ్లాలనేది జనసేన ఆకాంక్ష అన్నారు. జనసేన- తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీల సమావేశాలు విజయదశమి తర్వాత నుంచి పుంజుకుంటాయని అన్నారు. జనసేన పార్టీ తెలంగాణలోనూ పోటీ చేస్తుందని, పొత్తులు, సర్దుబాట్ల విషయంపై పవన్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Forbes 30 Under 30 Asia 2026:ఫోర్బ్స్‌ జాబితాలో ఇద్దరు తెలుగు కుర్రాళ్లు! ప్రయోగాశాలతో లారీ డ్రైవర్ కుమారుడికి ప్రపంచ ఖ్యాతి!
ఫోర్బ్స్‌ జాబితాలో ఇద్దరు తెలుగు కుర్రాళ్లు! ప్రయోగాశాలతో లారీ డ్రైవర్ కుమారుడికి ప్రపంచ ఖ్యాతి!
Mandula Samuel controversial comments : ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలతో కలకలం - కేసులు నమోదు చేయరా అని బీజేపీ ప్రశ్న
ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలతో కలకలం - కేసులు నమోదు చేయరా అని బీజేపీ ప్రశ్న
YS Sharmila Rajya Sabha: ఏపీ కాంగ్రెస్ పై అధిష్టానం ఫోకస్.. కర్ణాటక నుంచి రాజ్యసభకు షర్మిళ!
ఏపీ కాంగ్రెస్ పై అధిష్టానం ఫోకస్.. కర్ణాటక నుంచి రాజ్యసభకు షర్మిళ!
Breaking News: సెక్స్ వర్కర్ల హక్కుల రక్షణకు సుప్రీంకోర్టు చారిత్రాత్మక మార్గదర్శకాలు!
సెక్స్ వర్కర్ల హక్కుల రక్షణకు సుప్రీంకోర్టు చారిత్రాత్మక మార్గదర్శకాలు!

వీడియోలు

RR vs GT IPL 2026 Preview | RR vs GT ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూ
Archer Comments on Vaibhav Suryavanshi | వైభవ్ సూర్యవంశీ పై జోఫ్రా ఆర్చర్ కామెంట్స్
Bhuvneshwar Kumar Comments on Virat Kohli | విరాట్ పై భువి ఫన్నీ కామెంట్స్
Ashwin Angry Comments on SRH Defeat | SRH ప్లేయర్స్‌ పై అశ్విన్ తీవ్ర ఆగ్రహం
Ambati Rayudu Comments on Yashasvi Jaiswal | యశస్వి జైస్వాల్‌ కు రాయుడు సలహా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 GT In Final: ఆర్సీబీ వ‌ర్సెస్ గుజ‌రాత్, ఫైన‌ల్ కు పోరుకు సిద్ధం.. క్వాలిఫ‌య‌ర్ 2లో రాయ‌ల్స్ పై జీటీ గ్రాండ్ విక్ట‌రీ.. గిల్ సెంచ‌రీ, సుద‌ర్శ‌న్ ఫిఫ్టీ
ఆర్సీబీ వ‌ర్సెస్ గుజ‌రాత్, ఫైన‌ల్ కు పోరుకు సిద్ధం.. క్వాలిఫ‌య‌ర్ 2లో రాయ‌ల్స్ పై జీటీ గ్రాండ్ విక్ట‌రీ.. గిల్ సెంచ‌రీ, సుద‌ర్శ‌న్ ఫిఫ్టీ
Telangana Employee Dues: తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!
తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!
IMAX Hyderabad Return: 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?
12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?
Supreme Court Guidelines: సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
Beer for Kidney Stones : బీర్ తాగితే కిడ్నీలో స్టోన్స్ బయటకి వచ్చేస్తాయా? ఇది ఎంతవరకు నిజం?
బీర్ తాగితే కిడ్నీలో స్టోన్స్ బయటకి వచ్చేస్తాయా? ఇది ఎంతవరకు నిజం?
Vaibhav Suryavanshi: చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
Vaginal Health : యోని ఆరోగ్యాన్ని కాపాడే డ్రింక్స్ ఇవే.. మహిళలు రెగ్యులర్‌గా తీసుకుంటే మంచిది
యోని ఆరోగ్యాన్ని కాపాడే డ్రింక్స్ ఇవే.. మహిళలు రెగ్యులర్‌గా తీసుకుంటే మంచిది
Embed widget