అన్వేషించండి

AP Local Elections : పరిషత్ ఓట్ల లెక్కింపుపై కొనసాగుతున్న సస్పెన్స్..! వచ్చే నెల 4న హైకోర్టు విచారణ..!

సింగిల్ జడ్జి ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. తదుపరి విచారణ వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది.


మండల, జిల్లా పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. తదుపరి విచారణను హైకోర్టు వచ్చే నెల నాలుగో తేదీకి వాయిదా వేసింది. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌తో ఉత్సాహంగా ఉన్న వైసీపీ... ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌంటింగ్ కూడా నిర్వహిస్తే ఎదురు ఉండదని అనుకుంటోంది. కానీ .. ఆ ఎన్నికల నిర్వహణపై వివాదాలు ఉండటంతో కోర్టు చిక్కులు దాటాల్సి వస్తోంది.  ఎస్‌ఈసీ నీలం సహాని  సుప్రీంకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా ఎన్నికలు నిర్వహించారని.. హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం ఎన్నికల నోటిఫికేషన్‌ను కొట్టి వేసింది. నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై ఏపీ ఎస్‌ఈసీ హైకోర్టులో అప్పీల్ చేసుకుంది.  సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై డివిజన్‌ బెంచ్‌ స్టే విధించింది. తుది తీర్పు వచ్చేవరకు ఓట్ల లెక్కింపు చేపట్టొద్దని స్పష్టం చేసింది. 
 
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు అనేక వివాదాల మధ్య జరిగాయి. ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. మొదట కరోనా కారణంగా ఎస్‌ఈసీ వాయిదా వేసినప్పుడు ఏపీ ప్రభుత్వం.. వాయిదాకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ సమయంలో.. సుప్రీంకోర్టు వాయిదాను సమర్థించి..  మళ్లీ ఎన్నికలు పెట్టే ముందు నాలుగు వారాల ముందు కోడ్ అమలు చేయాలని ఆదేశించింది. అయితే.. నిమ్మగడ్డ పదవీ కాలంలో ఎంపీటీసీ, జడ్పిటీసీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాలేదు. ప్రభుత్వ ఒత్తిడి తెచ్చినా ఆయన.. తన పదవీ కాలం ముగిసిపోతూండటంతో సాధ్యం కాదని నిర్వహించలేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తర్వాత పదవి చేపట్టిన నీలం సహాని .. మొదటి రోజే నోటిఫికేషన్ జారీ చేశారు.  
   
 సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ పెట్టనందుకు .. ఏప్రిల్ ఒకటో తేదీన కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఇచ్చిన నోటిఫికేషన్‌ను సింగిల్ జడ్జి నిలుపుదల చేశారు. దానిపై హుటాహుటిన డివిజన్ బెంచ్‌లో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన ప్రభుత్వం...పరిషత్ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని.. అయితే కౌంటింగ్ మాత్రం జరపొద్దని హైకోర్టు డివిజనల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఆ సమయంలోనే సింగిల్ జడ్జి వద్దకే వెళ్లి పిటిషన్ పరిష్కరించుకోవాలని డివిజన్ బెంచ్ సలహా ఇచ్చింది.  సింగిల్ జడ్జి   ధర్మాసనం నోటిఫికేషన్ చెల్లదని తీర్పు చెప్పింది. దీంతో ప్రభుత్వం మళ్లీ డివిజన్ బెంచ్‌కు వెళ్లింది. డివిజన్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చింది. సమగ్ర విచారణ జరపాల్సి ఉందని చెప్పింది. ఆ తరవాత మళ్లీ ఎన్నికలు నిర్వహించాలా.. కౌంటింగ్‌కు అనుమతివ్వాలా.. నిర్ణయం తీసుకోనున్నారు. 
  
ఒక వేళ డివిజన్ బెంచ్ కూడా సింగిల్ జడ్జి తీర్పును సమర్థిస్తే.. బంధనల ప్రకారం.. నాలుగు వారాల సమయం ఇచ్చి.. ఆ తర్వాత ఎన్నికలు జరపాల్సి ఉంటుంది.అక్కడ ఎలాంటి ఫలితం వస్తుందన్నదానిపైనా మండల.. జిల్లా పరిషత్ ఎన్నికల భవితవ్యం ఆధారపడి ఉంటుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Embed widget