అన్వేషించండి

AP Local Elections : పరిషత్ ఓట్ల లెక్కింపుపై కొనసాగుతున్న సస్పెన్స్..! వచ్చే నెల 4న హైకోర్టు విచారణ..!

సింగిల్ జడ్జి ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. తదుపరి విచారణ వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది.


మండల, జిల్లా పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. తదుపరి విచారణను హైకోర్టు వచ్చే నెల నాలుగో తేదీకి వాయిదా వేసింది. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌తో ఉత్సాహంగా ఉన్న వైసీపీ... ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌంటింగ్ కూడా నిర్వహిస్తే ఎదురు ఉండదని అనుకుంటోంది. కానీ .. ఆ ఎన్నికల నిర్వహణపై వివాదాలు ఉండటంతో కోర్టు చిక్కులు దాటాల్సి వస్తోంది.  ఎస్‌ఈసీ నీలం సహాని  సుప్రీంకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా ఎన్నికలు నిర్వహించారని.. హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం ఎన్నికల నోటిఫికేషన్‌ను కొట్టి వేసింది. నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై ఏపీ ఎస్‌ఈసీ హైకోర్టులో అప్పీల్ చేసుకుంది.  సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై డివిజన్‌ బెంచ్‌ స్టే విధించింది. తుది తీర్పు వచ్చేవరకు ఓట్ల లెక్కింపు చేపట్టొద్దని స్పష్టం చేసింది. 
 
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు అనేక వివాదాల మధ్య జరిగాయి. ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. మొదట కరోనా కారణంగా ఎస్‌ఈసీ వాయిదా వేసినప్పుడు ఏపీ ప్రభుత్వం.. వాయిదాకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ సమయంలో.. సుప్రీంకోర్టు వాయిదాను సమర్థించి..  మళ్లీ ఎన్నికలు పెట్టే ముందు నాలుగు వారాల ముందు కోడ్ అమలు చేయాలని ఆదేశించింది. అయితే.. నిమ్మగడ్డ పదవీ కాలంలో ఎంపీటీసీ, జడ్పిటీసీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాలేదు. ప్రభుత్వ ఒత్తిడి తెచ్చినా ఆయన.. తన పదవీ కాలం ముగిసిపోతూండటంతో సాధ్యం కాదని నిర్వహించలేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తర్వాత పదవి చేపట్టిన నీలం సహాని .. మొదటి రోజే నోటిఫికేషన్ జారీ చేశారు.  
   
 సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ పెట్టనందుకు .. ఏప్రిల్ ఒకటో తేదీన కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఇచ్చిన నోటిఫికేషన్‌ను సింగిల్ జడ్జి నిలుపుదల చేశారు. దానిపై హుటాహుటిన డివిజన్ బెంచ్‌లో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన ప్రభుత్వం...పరిషత్ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని.. అయితే కౌంటింగ్ మాత్రం జరపొద్దని హైకోర్టు డివిజనల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఆ సమయంలోనే సింగిల్ జడ్జి వద్దకే వెళ్లి పిటిషన్ పరిష్కరించుకోవాలని డివిజన్ బెంచ్ సలహా ఇచ్చింది.  సింగిల్ జడ్జి   ధర్మాసనం నోటిఫికేషన్ చెల్లదని తీర్పు చెప్పింది. దీంతో ప్రభుత్వం మళ్లీ డివిజన్ బెంచ్‌కు వెళ్లింది. డివిజన్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చింది. సమగ్ర విచారణ జరపాల్సి ఉందని చెప్పింది. ఆ తరవాత మళ్లీ ఎన్నికలు నిర్వహించాలా.. కౌంటింగ్‌కు అనుమతివ్వాలా.. నిర్ణయం తీసుకోనున్నారు. 
  
ఒక వేళ డివిజన్ బెంచ్ కూడా సింగిల్ జడ్జి తీర్పును సమర్థిస్తే.. బంధనల ప్రకారం.. నాలుగు వారాల సమయం ఇచ్చి.. ఆ తర్వాత ఎన్నికలు జరపాల్సి ఉంటుంది.అక్కడ ఎలాంటి ఫలితం వస్తుందన్నదానిపైనా మండల.. జిల్లా పరిషత్ ఎన్నికల భవితవ్యం ఆధారపడి ఉంటుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP PNG Subsidy: ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్
ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్
Tadipatri Crime News: బీర్ బాటిల్‌తో పోలీసులపై నిందితుడు దాడి- కాల్పులు జరిపి అరెస్ట్ చేసిన తాడిపత్రి పోలీసులు
బీర్ బాటిల్‌తో పోలీసులపై నిందితుడు దాడి- కాల్పులు జరిపి అరెస్ట్ చేసిన తాడిపత్రి పోలీసులు
Drone Crashes: అల్లూరి జిల్లాలో కూలిన డ్రోన్.. యుద్ధం వేళ గిరిజన ప్రాంతాల్లో కలకలం!
అల్లూరి జిల్లాలో కూలిన డ్రోన్.. యుద్ధం వేళ గిరిజన ప్రాంతాల్లో కలకలం!
Tirupati Crime News: ఆకలితో పాల కోసం ఏడ్చిన పాపను చంపిన తల్లి.. గుడ్ న్యూస్ అంటూ భర్తకు ఫోన్! తిరుపతిలో దారుణం
పాల కోసం ఏడ్చిన పాపను చంపిన తల్లి.. గుడ్ న్యూస్ అంటూ భర్తకు ఫోన్! తిరుపతిలో దారుణం

వీడియోలు

Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam
Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam
Ben Duckett Out of IPL 2026 | ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP PNG Subsidy: ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్
ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్
US Iran War: ఇరాన్‌పై దాడులకు అమెరికా మరో 10 రోజులు బ్రేక్.. డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ ఏంటీ?
ఇరాన్‌పై దాడులకు అమెరికా మరో 10 రోజులు బ్రేక్.. డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ ఏంటీ?
Amaravati Politics: అమరావతికి రాజ్యాంగ రక్షణ- ఏపీ రాజకీయాల్లో చారిత్రక మలుపు - వైసీపీ విధానమేంటి?
అమరావతికి రాజ్యాంగ రక్షణ- ఏపీ రాజకీయాల్లో చారిత్రక మలుపు - వైసీపీ విధానమేంటి?
Hyderabad Traffic Diversions: నేడు హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు, అటువైపు వెళ్లొద్దు..!
నేడు హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు, అటువైపు వెళ్లొద్దు..!
Kaattan Series OTT : కొండపై తెగి పడిన తల ఎవరిది? - ఓటీటీలో విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... తెలుగులోనూ చూసెయ్యండి
కొండపై తెగి పడిన తల ఎవరిది? - ఓటీటీలో విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... తెలుగులోనూ చూసెయ్యండి
Maharashtra Minister Video: ట్రాన్స్‌‌జెండర్‌తో మహరాష్ట్ర మంత్రి వీడియో వైరల్.. రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్! మార్ఫింగ్ అని వివరణ
ట్రాన్స్‌‌జెండర్‌తో మహరాష్ట్ర మంత్రి వీడియో వైరల్.. రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్! మార్ఫింగ్ అని వివరణ
Watermelon Storage Tips : పుచ్చకాయను కట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టొచ్చా? అలా తింటే మంచిదేనా?
పుచ్చకాయను కట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టొచ్చా? అలా తింటే మంచిదేనా?
Tadipatri Crime News: బీర్ బాటిల్‌తో పోలీసులపై నిందితుడు దాడి- కాల్పులు జరిపి అరెస్ట్ చేసిన తాడిపత్రి పోలీసులు
బీర్ బాటిల్‌తో పోలీసులపై నిందితుడు దాడి- కాల్పులు జరిపి అరెస్ట్ చేసిన తాడిపత్రి పోలీసులు
Embed widget