అన్వేషించండి

RRR Vs YSRCP : గెలిపించిన రాయలసీమకు అన్యాయం చేయవద్దు.. ప్రాజెక్టుల్ని పూర్తి చేయాలని జగన్‌కు రఘురామ సూచన

ఏకపక్ష విజయం అందించిన రాయలసీమకు నీటి కష్టాలు తీర్చే విషయంలో జగన్ నిర్లక్ష్యంగా ఉన్నారని రఘురామ అభిప్రాయపడ్డారు.సంక్షేమ కోసం రూ. లక్ష కోట్లు ఖర్చు పెట్టినా ప్రాజెక్టు కోసం కొంత కూడా ఖర్చు చేయలేదన్నారు.


పరుగు పందెంలో ఒక్కరే పాల్గొని ఫస్ట్ ప్రైజ్ వచ్చినట్లుగా  తమ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెలబ్రేషన్స్ ఉన్నాయని రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. పలు అంశాలపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నికల ఫలితాలపై తాను పెద్దగా మాట్లాడదల్చుకోలేదన్నారు. కానీ ఆచంట ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న రంగనాథరాజు నియోజకవర్గంలో జడ్పిటీసీ, ఎంపీటీసీ స్థానాలు అత్యధికం తెలుగుదేశం - జనసేన గెలుచుకున్నాయని...  ఆయన తీరుపై చాలా ఆరోపణలు ఉన్నాయని తాను ముందే చెప్పానన్నారు. చివరికి ఆయన దత్తత తీసుకున్న గ్రామంలోనూ జనసేన గెలిచిందని గుర్తు చేశారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఆచంట విషయంలో జగన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. Also Read : అబద్ధాన్ని నిజం చేసి.. ముఖ్యమంత్రిని దింపేయాలని చూస్తున్నారు

ఇక రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాల కారణంగా ప్రజలకు అన్యాయం జరుగుతోందన్నారు.. రాయలసీమ మొత్తం వైసీపీకే ఓట్లు వేసి గెలిపించారని అయితే అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల తర్వాత సీమకు నీళ్లు అందించే అత్యంత కీలకమైన ప్రాజెక్టులన్నీ ఎక్కడవక్కడ నిలిచిపోయాయన్నారు. నోటు కొట్టు - ఓటు పట్టు విధానం ద్వారా ఎన్నిసార్లు ఎన్నికల్లో గెలిచినా ప్రజలకు మంచి చేయకపోతే సీఎంగా ఉండి ఏం ప్రయోజనం అని ఆయన ప్రశ్నించారు. పలు ప్రాజెక్టుల వివరాలను వెల్లడించిన ఆయన పనులేమీ జరగడం లేదన్నారు. రూ. లక్ష కోట్లకుపైగా సంక్షేమం కోసం పంచామని చెబుతున్నారు కానీ ఈ ప్రాక్టులు పూర్తి చేసి ఉంటే పొలాలకు నీరు వచ్చేదన్నారు. Also Read : డ్రగ్స్ కేసుల చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయాలు ! వైట్ చాలెంజ్‌లో గెలుపెవరిది?

ఇక ఏపీలో విదేశీ నిధులతో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి వచ్చిన నిధులను దారి మళ్లించడంపై రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పించారు. ఇలా చేయడం వల్ల ఇక విదేశీ నిధులు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. అలాగే స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పేరుతో సేకరించిన నిధుల విషయంలో కాగ్ మరోసారి వివరాలు కోరిందని.. గతంలో ఈ అంశంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని చెప్పామన్నారు. Also Read : కేసీఆర్‌ గుడిని అమ్మేస్తున్న భక్తుడు ! దేవుడు కరుణించలేదా? పూజారి కనికరించ లేదా?

ఇక విజయవాడకు తరలిస్తూంజగా గుజరాత్‌లో పట్టుబడిన డ్రగ్స్ అంశంపైనా రఘురామకృష్ణరాజు స్పందించారు. తొమ్మిది వేల కోట్ల విలువైన డ్రగ్స్ అంటున్నారని.. అది మార్కెట్ కావొచ్చన్నారు.  అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా జరుగుతోందంటే చిన్న విషయం కాదన్నారు. ఈ విషయంపై లోతుగా దర్యాప్తు జరపాల్సి ఉందన్నారు. గుట్కాను బ్యాన్ చేసినా యధావిధిగా అమ్ముతున్నారని అలా కాకుండా డ్రగ్స్ గురించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలన్నారు. Also Read : గుజరాత్ లో రూ.9వేల కోట్ల హెరాయిన్ పట్టివేత.. ఆ ముఠాకు విజయవాడతో సంబంధాలు

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kakinada Fireworks Explosion: వేట్లపాలెం ఘటనలో నలుగురు అధికారులపై వేటు! మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, పక్కా ఇళ్లు హామీ
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం ఘటనలో నలుగురు అధికారులపై వేటు! మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, పక్కా ఇళ్లు హామీ
UTS మొబైల్ యాప్‌లో ట్రైన్ టికెట్ తీసుకుంటున్నారా.. యాప్ మూసేస్తున్న రైల్వే.. వాలెట్ లోని డబ్బులు ఏమవుతాయి..?
UTS మొబైల్ యాప్‌లో ట్రైన్ టికెట్ తీసుకుంటున్నారా.. యాప్ మూసేస్తున్న రైల్వే.. వాలెట్ లోని డబ్బులు ఏమవుతాయి..?
AP CM Chandrababu: వేట్లపాలెంలో బాణసంచా పేలుడు స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
వేట్లపాలెంలో బాణసంచా పేలుడు స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Ranji Trophy Winner: తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
Kakinada Fire Cracker Explosion: బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
Embed widget