అన్వేషించండి

Kottu Satyanarayana: అమరావతి కూడా మాకు ముఖ్యమే - రాజధానిపై ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు

Kottu Satyanarayana: రాజధానిపై మంత్రి కొట్టు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి కూడా తమకు ముఖ్యమేనని వ్యాఖ్యానించారు.

Kottu Satyanarayana: రాజధాని అమరావతి ఇష్యూ ఏపీ రాజకీయాల్లో చర్చకు వస్తూనే ఉంటుంది. రాజధాని వేదికగా రాజకీయం నడుస్తూనే ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో రాజధాని అంశం మరోసారి తెరపైకి వస్తోంది. వచ్చే ఎన్నికల్లో రాజధాని వ్యవహారం కూడా కీలకంగా మారనుంది. దీంతో అమరావతిపై రాజకీయ నేతలు ఎప్పుడూ ఏదోక కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. దసరా నుంచి సీఎం జగన్ అమరావతిని విడిచిపెట్టి విశాఖ నుంచి పరిపాలన కొనసాగించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. రుషికొండపై సీఎం క్యాంపు ఆఫీస్‌తో పాటు ఇల్లు కూడా దాదాపు పూర్తయింది.

దసరా నుంచి తాను విశాఖ నుంచే పాలన కొనసాగించనున్నట్లు ఇటీవల జగన్ స్వయంగా ప్రకటించారు. దీంతో రాజధాని అమరావతి ఎపిసోడ్ మరోసారి తెరపైకి రాగా.. మంత్రులు, వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ క్రమంలో అమరావతి వ్యవహారంపై మంత్రి కొట్టు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వానికి అమరావతి కూడా ముఖ్యమేనని అన్నారు. శాసన రాజధానిగా అమరావతి ఉంటుందని, అమరావతికి జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. అమరావతికి ఇంపార్టెన్స్ ఇస్తూనే మిగతా ప్రాంతాలను కూడా అభివృద్ది చేయాలనేదే వైసీపీ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. అన్ని ప్రాంతాలను తాము సరిసమానంగా చూస్తున్నామని కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు.

మంగళవారం సచివాలయంలో కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా తమ ప్రభుత్వం అని ప్రాంతాలను అభివృద్ది చేయాలని చూస్తోందని, ఇది ఎన్నికల్లో కీలక అంశంగా మారుతుందని అన్నారు.  అమరావతి ముద్దు, మిగతా ప్రాంతాలు వద్దు అంటాయా అనేది ప్రతిపక్ష పార్టీలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వకూడదనే ఆలోచనతో మూడు రాజధానులను సీఎం జగన్ తెచ్చారని అన్నారు. అమరావతిపై సీఎం జగన్‌కు ఎలాంటి కోపం లేదని, అమరావతిలోనే ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటున్నారని గుర్తు చేశారు. ప్రతిపక్ష పార్టీల నేతలు అమరావతి ఒక్కటే రాజధాని అంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని సూచించారు.  అమరావతిపై జగన్‌కు అభిమానం ఉందని, అందుకే శాసన రాజధానిగా చేయాలని భావించారని కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. 

అయితే మొన్నటివరకు అమరావతికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన మంత్రులు, వైసీపీ నేతలు.. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొత్త పల్లవి అందుకోవడం చర్చనీయాంశంగా మారింది. 23వ తేదీన జగన్ విశాఖ వెళ్లనుండగా.. 24వ తేదీన కొత్త ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇటీవల రుషికొండపై నిర్మించిన క్యాంపు ఆఫీస్,  ఇంటిని అధికారులు పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. జగన్ సెక్యూరిటీ కోసం రుషికొండ సమీపంలో ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఇంట్లో ఇంటీరియల్ పనులు జరుగుతున్నాయి. ఈ పనులను కూడా అధికారులు పరిశీలించారు. 23వ తేదీలోపు పనులన్నీ పూర్తై గృహప్రవేశానికి రెడీ కానుంది. విజయదశమి మంచి రోజు కావడంతో  ఆ రోజున జగన్ ఇంట్లోకి అడుగుపెట్టనున్నారు. కానీ విశాఖ నుంచి జగన్ పాలన చేయడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అమరావతి రాజధానిగా ఉండగా.. విశాఖను రాజధానిగా మార్చాలని జగన్ చూస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?

వీడియోలు

The RajaSaab Trailer 2.O Reaction | Prabhas తో తాత దెయ్యం చెడుగుడు ఆడేసుకుంది | ABP Desam
KTR No Respect to CM Revanth Reddy | సభానాయకుడు వచ్చినా KTR నిలబడకపోవటంపై సోషల్ మీడియాలో చర్చ | ABP Desam
BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Araku Special Trains: అరకు వెళ్ళడానికి సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌ వేసిన రైల్వేశాఖ; టైమింగ్స్ ఇవే
అరకు వెళ్ళడానికి సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌ వేసిన రైల్వేశాఖ; టైమింగ్స్ ఇవే
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
Peddi Movie : రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
Embed widget