అన్వేషించండి

Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు

AP Assembly: ఏపీ అసెంబ్లీలో జీరో అవర్‌పై వాదోపవాదాలు జరిగాయి. ఇది డ్రైవర్ లేని కారులా తయారైందని ఎమ్మెల్యే కూన రవికుమార్ అసహనం వ్యక్తం చేయగా.. సమస్యలు తాను రాసుకుంటున్నట్లు మంత్రి అచ్చెన్న తెలిపారు.

Minister Atchennaidu Replies To MLA On Zero Hour: ఏపీ అసెంబ్లీలో శనివారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జీరో అవర్‌పై (Zero Hour) శాసనసభలో వాదోపవాదాలు జరిగాయి. జీరో అవర్ డ్రైవర్ లేని కారులా తయారైందని టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ (Kuna Ravikumar) అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు  ప్రస్తావిస్తోన్న సమస్యలను మంత్రులెవరు రాసుకుంటున్నారో తెలియడం లేదని ఆరోపించారు. దీనిపై స్పందించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) మంత్రులు సమస్యలు రాసుకుంటున్నారని.. నిండు సభలో అసత్యాలు మాట్లాడకూడదని చెప్పారు. ఈ క్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchennaidu) స్పందించారు. సమస్యలను తాను రాసుకుంటున్నానని తెలిపారు. అవి పరిష్కరించిన తర్వాత సభ్యులకు సమాచారం ఇస్తామని అన్నారు. దీనిపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు వద్దని స్పష్టం చేశారు. కాగా, కూన రవికుమార్ ఆఖరి వరుసలో కూర్చోవడం వల్లే ముందు జరిగేది తెలియడం లేదని స్పీకర్ పేర్కొన్నారు.

'జగన్ కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టారు'

మరోవైపు, కూటమి ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించారు. టిడ్కో ఇళ్లపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం గతంలో 7 లక్షల ఇళ్లు కేటాయించిందని తెలిపారు. 5 లక్షల ఇళ్లకు పాలనామోదం లేకుండా ఇచ్చారని చెప్పారు. జగన్ దుర్మార్గంగా 2.3 లక్షల టిడ్కో ఇళ్లను వద్దని రద్దు చేశారని అన్నారు. 'వైసీపీ ప్రభుత్వం రాగానే కాంట్రాక్టర్లకు బిల్లులు నిలిపేశారు. కాంట్రాక్టర్‌గా తనకు రావాల్సిన బకాయే రూ.87 కోట్లుగా ఉంది. నాలాంటి వ్యక్తులు పదిసార్లు ఆత్మహత్య చేసుకోవాలి. నాకు గుండె ధైర్యం ఎక్కువ కాబట్టి ఆ పని చేయలేదు. కాంట్రాక్టర్లను జగన్ చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. బిల్లులు చెల్లించకపోయినా గుత్తేదారులు పనిచేశారు.' అని పేర్కొన్నారు. అటు, టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సైతం అప్పటి వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. వైసీపీ హయాంలో నిర్మాణాలను గాలికొదిలేసి పేదలను ఇబ్బంది పెట్టారని విమర్శించారు. పేదవాళ్లు కట్టిన డిపాజిట్లు తిరిగి ఇవ్వలేదని.. ఇళ్ల నిర్మాణాలు లేవని.. డిపాజిట్లు తిరిగి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోషల్ మీడియా ట్రోల్స్‌పై..

సోషల్ మీడియాలో ట్రోలర్స్‌పైనా టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రస్తావించారు. రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని సోషల్ మీడియాలో ట్రోల్ చేసి వేధించిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రస్తుత ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కోరారు. ఈ మేరకు జీరో అవర్‌లో స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో భవానీ అప్పట్లో మాట్లాడిన మాటల్నే ట్రోల్ చేశారని.. గత స్పీకర్‌కు విజ్ఞప్తి చేసినా స్పందించలేదన్నారు. ఇదే సమయంలో గత ఐదేళ్లలో దిశ చట్టం పేరిట జరిగిన దుర్వినియోగంపైనా విచారణ జరిపించాలని కోరారు.

మరోవైపు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సైతం సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారికి కఠిన శిక్ష పడేలా చట్టాలని సవరించాలని కోరారు. అధికారంలో ఉండి కూడా సోషల్ మీడియా పోస్టుల వల్ల ఇబ్బంది పడుతున్నామని అన్నారు. అన్ని పార్టీల నేతలనూ సోషల్ మీడియా సైకోలు ఇబ్బంది పెడుతున్నారని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు.

Also Read: Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Breaking News:హైదరాబాద్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా- 19వేల పోలీస్‌ ఉద్యోగాలతో నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ !
హైదరాబాద్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా- 19వేల పోలీస్‌ ఉద్యోగాలతో నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ !
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Auqib Nabi Selection: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
Eesha Rebba : గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
Embed widget