అన్వేషించండి

BJP Vishnu : రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నెంబర్ వన్ - వైసీపీ సర్కార్‌పై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు ఫైర్ !

BJP Hindupuram :హిందూపురంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ధర్నా నిర్వహించారు. పేదలకు వ్యతిరేకంగా ప్రభుత్వం పాలన చేస్తోందని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు.


BJP Vishnu Hindupur :   దేశంలోనే రైతులు ఆత్మహత్య చేసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం ఉందని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు ప్రభుత్వంపై మండిపడ్డారు.  రాయలసీమలోని అనంతపురం కర్నూల్ లలో పెద్ద ఎత్తున రైతులు ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారని అన్నారు. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందన్నారు.  ~అన్ని రకాల పన్నులు ప్రతి సంవత్సరం ప్రజలపై భారం మోపిన ఏకైక ప్రభుత్వంగా చరిత్రలో వైకాపా నిలిచిపోతోందని మండిపడ్డారు.  పట్టణాల్లో కనీస వసతులు సౌకర్యాలు కల్పించడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని విమర్శిచారు. హిందూపురం పట్టణంలో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.                                                            

 పట్టణంలో  పన్నులు వసూల్లు చేస్తున్నారు , కానీ అభివృద్ధి మాత్రం చేయడం లేదని మండిపడ్డారు.  విద్యుత్ బిల్లులు , ఆర్టీసీ చార్జీలు ఇంటి పన్నులు , ఇసుక ధరలు , చివరకు మధ్యం ధరలు ఇలా అన్ని పెంచడమే తప్ప ఏమీ చేయలేదని విమర్శించారు.  పేదల ఆర్థిక స్థితి రోజురోజుకు దిగజారుతోంది . మధ్య తరగతి కుటుంబాలు బతకలేని స్థితికి చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఏపీలో కేంద్రప్రభుత్వ పథకాలన్నీ పేర్లు మార్చుకోవడం తప్ప వైసిపి ప్రభుత్వం చేసింది మాత్రం సున్నా అని.. కేంద్ర నిధఉలను సైతం దుర్వినియోగం చేశారన్నారు.  
 
పది రోజులుగా సత్యసాయి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా బీజేపీ నేతలు ఆందోళనలు చేస్తూనే కనిపిస్తున్నారు.  ప్రతి రోజూ ఓ ప్రజాసమస్యపై ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇళ్లు ఇవ్వలేకపోవడం, నిరుద్యోగ సమస్య, విద్యుత్ చార్జీల పెంపు వంటి అంశాలపై  వీరు దూకుడుగా వ్యవహరిస్తున్నారు.  ఇప్పటి వరకూ విపక్ష నేతలెవరూ ఈ అంశాలపై పోరు సాగించకపోవడంతో.. బీజేపీ నేతలకు ప్రజల మద్దతు లభిస్తోంది.   రాష్ట్ర పార్టీ తరపున ఎక్కువగా వాయిస్ వినిపిస్తూ.. బిజీగా ఉండే ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పుడు  ఫోకస్ అంతా పూర్తిగా సత్యసాయి జిల్లాపై పెట్టారు.  పార్టీని.. పార్టీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేస్తున్నారు. అందర్నీ ఉత్సాహంగా రోడ్లపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.  ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం బయటకు కనిపిస్తున్న సరైన సమయంలో.. విష్ణువర్ధన్ రెడ్డి ఉద్యమం ప్రారంభించడంతో.. బీజేపీకి ఊపు వస్తోంది. పెద్ద ఎత్తున వీరికి ఎక్కడిక్కకడ స్థానిక ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. 
  
హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో  విద్యుత్ చార్జీల పెంపు, మున్సిపాలిటిల్లో పేదలపై పన్నుల పెంపు, నిరుద్యోగుల ఉద్యోగుల కల్పనలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా తీవ్ర ఉద్యమం ప్రారంభించారు.  విష్ణువర్ధన్ రెడ్డి వ్యూహాత్మకంగా ఉద్యమం చేస్తున్నారు.  ఇతర పార్టీల నేతలు టిక్కెట్ల హడావుడిలో ఉన్నారు. కానీ బీజేపీ లో ఎవర్ని నిలబెట్టినా అందరూ కలిసి పని చేస్తారు. అందుకే విష్ణువర్ధన్ రెడ్డి ... పార్లమెంట్ నియోజకవర్గం మొత్తంలో బీజేపీని బలోపేతం చేయడానికి రంగంలోకి దిగారు.  ప్రజల్ని మొబిలైజ్ చేయడంలో మంచి ఫలితాలు సాధిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget