అన్వేషించండి

Rains: ప్రజలు అటు వైపు రావొద్దు - భారీ వర్షాలతో పోలీస్ విజ్ఞప్తి

Mangalagiri News: ఏపీలో భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మంగళగిరి కాజా టోల్ ప్లాజా వద్ద హైవేపై 3 అడుగుల మేర నీరు చేరగా.. ప్రజలు బయటకు రావొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Mangalagiri Police Request To People: వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో శుక్రవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా, మన్యం, అల్లూరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలోని (Vijayawada) ప్రధాన రహదారులన్నీ నీట మునిగాయి. అటు, మంగళగిరి (Mangalagiri) కాజా టోల్ గేట్ వద్ద జాతీయ రహదారి చెరువును తలపిస్తోంది. హైవేపై 3 అడుగుల మేర వరద పోటెత్తుతుండగా.. ప్రజలు బయటకు రావొద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. కార్లు సైతం కొట్టుకుపోయే పరిస్థితి ఉందని.. అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావొద్దని స్పష్టం చేశారు. అటు, భారీ వానలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. వీరులపాడులో అత్యధికంగా 21 సెం.మీ, కంచికచర్ల 20.3, ఇబ్రహీంపట్నం 15.3, నందిగామ 13.8, విజయవాడ 13.5, గంపలగూడెం 13.1, చందర్లపాడు 11, జగ్గయ్యపేట, విసన్నపేటలో 8.3 సెం.మీల వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. ఆదివారం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

భారీ వర్షాలతో విజయవాడ, గుంటూరు నగరాల్లోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. విజయవాడలోని విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్‌లో రహదారులు జలమయం కాగా.. వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలు చోట్ల మోకాళ్ల లోతు నీరు చేరి ప్రజల బాధ వర్ణనాతీతం. విజయవాడ బస్టాండ్ పరిసరాలు నీట మునగ్గా బస్సుల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. విజయవాడలోని దుర్గగుడి ఫ్లైఓవర్‌ను తాత్కాలికంగా మూసేశారు. గడిచిన 24 గంటల్లో మచిలీపట్నం 19 సెం.మీ, విజయవాడ 18, గుడివాడ 17, కైకలూరు 15, నర్సాపురం 14, అమరావతి 13, మంగళగిరి 11, నందిగామ, భీమవరం 10, పాలకొల్లు, తెనాలిలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

వర్షాలతో తీవ్ర విషాదం

భారీ వర్షాలతో విజయవాడలోని మొగల్రాజపురంలో కొండ చరియలు విరిగి పడి నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు.. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. అటు, గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడు సమీపంలోని వాగులో ఓ కారు కొట్టుకుపోగా.. ఈ ప్రమాదంలో ఒక టీచర్‌తో పాటు మరో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. పాఠశాలకు సెలవు ప్రకటించడంతో ఇద్దరు పిల్లలను టీచర్ తీసుకుని వస్తుండగా ఈ ఘటన జరిగింది. స్థానికుల సాయంతో కారుతో పాటు మృతదేహాలను వెలికితీశారు.

అప్రమత్తమైన ప్రభుత్వం

భారీ వర్షాలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు సీఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయ చర్యలకు జిల్లాకు రూ.3 కోట్ల చొప్పున తక్షణం విడుదల చేయాలని ఆదేశించారు. అధికారులు సమన్వయంతో ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్ధేశించారు. తుపాను తీరం దాటే సమయంలో 55 నుంచి 65 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలపగా.. స్పష్టమైన అంచనాలతో సన్నద్ధంగా ఉండాలని అన్నారు. నష్టం తగ్గించేలా అధికారుల పని తీరు ఉండాలని స్పష్టం చేశారు. 'పట్టణ ప్రాంతాల్లో నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో అధికారులు తక్షణ చర్యలకు దిగాలి. ప్రొక్లెయినర్లు పెట్టి నీటి ప్రవాహాలకు ఉన్న అడ్డంకులను తొలగించి నీరు బయటకు వెళ్లేలా చూడాలి. ఓపెన్ డ్రైన్స్‌లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఇలాంటి ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేయాలి. అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలి.' అని పేర్కొన్నారు.

Also Read: Vijayawada Rains: కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి, ఒక్కో ఫ్యామిలీకి రూ.5 లక్షల చొప్పున పరిహారం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desamసింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్న అదితి రావు, సిద్దార్థ - ఫొటోలు వైరల్ట్రాఫిక్ వాలంటీర్లుగా గౌరవంగా బతుకుతామంటున్న ట్రాన్స్‌జెండర్స్‌వేలంలో రూ.32 కోట్ల ధర పలికిన ఐన్‌స్టీన్‌ లెటర్‌, అందులో ఏముందో తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్
Hyderabad News: లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
Nipah virus: కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్:
కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్
Embed widget