అన్వేషించండి

Pawan Kalyan : దావోస్ వెళ్లి ఫొటోలు దిగివస్తే పెట్టుబడులురావు, సీఎం జగన్ పై పవన్ సెటైర్లు

Pawan Kalyan : దావోస్ వెళ్లి ఫొటోలు దిగి వస్తే పెట్టుబడులు రావని పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎన్ని పెట్టుబడులు వచ్చే చెప్పగలరా? అని పవన్ సవాల్ చేశారు.

Pawan Kalyan : అప్పులు తెచ్చి అభివృద్ధి చేస్తామంటే రాష్ట్రంగా ఆర్థికంగా ఎప్పుడు నిలదొక్కుకుంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.  మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఐటీ విభాగం సమావేశంలో పవన్ పాల్గొన్నారు. జనసేన అధికారంలోకి వస్తే రాష్ట్రంలోకి ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సమావేశంలో పవన్‌ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ప్రజలను బలహీనపరిచేలా చేయకూదన్నారు.  

ఏపీకి ఐటీ పరిశ్రమలు 

ఐటీ రంగం అంటే హైదరాబాద్‌, బెంగళూరు సిటీలు గుర్తొస్తాయని పవన్ అన్నారు. ఏపీకి ఐటీ పరిశ్రమలు రావాల్సిఉందని, జనసేన అధికారంలోకి వస్తే ఐటీ పరిశ్రమలు తీసుకురావడంపై దృష్టిపెడతామన్నారు. రాయలసీమలో పర్యటించినప్పుడు అక్కడి యువత బెంగళూరుకు వెళ్లిపోతున్నారని తెలిసిందన్నారు. అక్కడి యువత ఏపీలో ఐటీ రంగాన్ని ఎందుకు అభివృద్ధి చేయడంలేదని ప్రశ్నించారని పవన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తే మిగతా రాష్ట్రాల్లో కన్నా ఎక్కువ స్థాయిలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. 

సీఎం జగన్ కు సవాల్ 

"ఐటీ పాలసీ అంటే ఎన్నికల సమయంలో ఓట్ల కోసం మభ్యపెట్టడం కాదు. దావోస్‌ వెళ్లి ఫొటోలు దిగి వస్తే పెట్టుబడులురావు. సీఎంకి జనసేన తరఫున సవాల్ చేస్తున్నాం. జగన్‌ సీఎం అయిన తర్వాత రాష్ట్రానికి ఎంత పెట్టుబడులు వచ్చాయో చెప్పగలరా? రాష్ట్రంలో ఎంత మందికి ఉపాధి కల్పించారు? ఏదో అద్భుతం చేసేద్దామని నేను పార్టీ పెట్టలేదు. అనుభవం లేకుండా వస్తే వైసీపీ ప్రభుత్వంలాగా ఉంటుంది. పదవి ఎప్పుడూ వెతుక్కుంటూ రావాలి కానీ పదవి వెంట పడకూడదు. పదవి అనేది మన ప్రయాణంలో భాగంగా ఉండాలి అంతే. స్థాయి, స్థోమత ఉంటే ప్రజలు ఆ అవకాశం కల్పిస్తారు." పవన్‌ కల్యాణ్‌ 

వైసీపీకి అధికారమే పరమావధి

సీఎం జగన్ అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి రాష్ట్రాన్ని అప్పులమయం చేస్తున్నారని పవన్ ఆరోపించారు. వైసీపీ నేతలకు అధికారమే పరమావధని అందుకు ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారని మండిపడ్డారు. జగన్ నోటికి వచ్చిన హామీలు ఇచ్చి ఓట్లు‌ వేయించుకున్నారని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇసుక విషయాలలో మోసం చేశారన్నారు. సంక్షేమ పథకాలకు జనసేన వ్యతిరేకం కాదని, అయితే సంక్షేమ పథకాలు ప్రజలకు ఊతమిస్తే సరిపోతుందన్నారు. భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బలమైన లక్ష్యంతో జనసేన ముందుకు‌ వెళ్తుందని పవన్ అన్నారు. 

అలా అయితే జనసేనలోకి రావొద్దు

ఫ్రీడమ్ ఫర్ మిడ్ నైట్ పుస్తకాన్ని చదివాక దేశం కోసం ఏదైనా చేయాలన్న ఆలోచన వచ్చిందని పవన్ కల్యాణ్ అన్నారు. తాను పార్టీ పెడతానని ఎప్పుడూ అనుకోలేదన్నారు. రాబోయే తరాలకు బాధ్యత తెలియజేయడానికి జనసేన పెట్టానన్నారు. ఒక్క ఎన్నిక కోసమే అయితే ఎవరూ జనసేనలోకి రావొద్దని పవన్ అన్నారు. కోట్లాది మందికి నిర్దేశం‌‌ చేయడమే జనసేన లక్ష్యమన్నారు. 

Also Read : Pawan Kalyan Yatra : అక్టోబర్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కల్యాణ్ టూర్

Also Read : Vijayawada TDP MP : బెజవాడ బరిలో నిలిచేదెవరు? టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కొత్త పేరు!

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget