అన్వేషించండి

Madanapalle Update : ఆజ్ఞాతంలోకి వైసీపీ నేతలు - జల్లెడ పడుతున్న పోలీసులు - మదనపల్లిలో టెన్షన్ టెన్షన్

YSRCP : మదనపల్లికి చెందిన వైసీపీ ముఖ్యనేతలంతా ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. భూదందాలపై ప్రజలు విస్తృతంగా ఫిర్యాదులు చేస్తూండటం.. సీఐడీ రంగంలోకి దిగడంతో ఫోన్లు స్విచ్చాఫ్ చేసి వెళ్లిపోతన్నారు.

Madanapalle YSRCP :  మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో  ఫైళ్లు తగలబెట్టిన వ్యవహారం అక్కడి వైసీపీ నేతలకు పెను సమస్యగా మారింది. ఉద్దేశపూర్వకంగా ఫైళ్లు తగులబెట్టారని దీని వెనుక పెద్ద దందా ఉందని సీఐడీ అధికారులు గుర్తించారు. రెవిన్యూ అధికారులు కూడా అక్కడే ఉండి ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. కొన్ని  వందల మంది వచ్చి ఫిర్యాదులు చేయడంతో.. మొత్తం వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలని అధికారులు డిసైడయ్యారు. 

రైస్ మిల్లు మాధవరెడ్డి దొరికితే కీలక విషయాలు వెలుగులోకి               

ముందుగా ఫైళ్లను తగులబెట్టిన అంశంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన రైస్‌మిల్లు మాధవరెడ్డి అనే నేతపై అనుమానం రావడంతో వారింట్లో సోదాలు చేశారు. కొన్ని కీలక ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు. అనుమానిత అధికారుల కాల్ లిస్టులో మాధవరరెడ్డి పేరు ఎక్కువగా ఉండటంతో ఆయనను ప్రశ్నించేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే విషయం తెలిసి మాధవరెడ్డి పరారయ్యారు. ఆయన ఢిల్లీలో కొంత మంది  సంరక్షణలో ఉన్నట్లుగా ప్రచారం  జరుగుతోంది. 

సీఐడీ అదుపులో మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి                                       

ఇక  మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇంట్లోనూ సోదాలు చేశారు. బాబ్ ఖాన్ అనే మరో వైసీపీ నేత ఇంట్లో సోదాలు చేయడానికి వెళ్లిన సమయంలో ఆయన ఇంటి తాళాలు వేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యుల సాయంతో ఆయన కూడా తప్పించుకుని వెళ్లిపోయారు. వీరే కాదు.. పోలీసులు అరెస్టు చేస్తారని.. తమ ఇళ్లలోనూ సోదాలు చేస్తారన్న భయంతో చాలా మంది  వైసీపీ నేతలు మదనపల్లి నుంచి వెళ్లిపోయారు. ఫోన్లు కూడా స్విచ్చాఫ్ చేసుకున్నారు. 

మదనపల్లిలో వందల సంఖ్యలో  భూ దందాల బాధితులు                                             

వైసీపీ హయాంలో మదనపల్లిలో పెద్ద ఎత్తున భూదందాలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. అసైన్డ్ ల్యాండ్స్ ను లబ్దిదారుల నుంచి బెదిరించి లాక్కున్నారని.. వాటిని ఫ్రీహోల్డ్ చేసుకుని రిజిస్ట్రేషన్లు చేసుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అందుకే బాధితుల కోసం ప్రత్యేకంగా అధికారులు ఫిర్యాదులు స్వీకరించారు. రెండు రోజుల  పాటు కొన్ని వందల మంది భూబాధితులు దరఖాస్తులు స్వీకరించారు. తమ భూములు లాక్కున్నారని వారంతా ఫిర్యాదులు చేశారు. వాటిపై విచారణకు ప్రత్యేకమైన ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తోంది. 

భూములకు సంబంధించిన లావాదేవీలను తెలియకుండా చేయడానికే  వాటికి సంబంధించిన ఫైల్స్ ను తగులబెట్టారని ప్రాథమికంగా నిర్ణయించడంతో.. అసలు ఆ ఫైల్స్.. లావాదేవీలు...భూమార్పిడి వ్యవహారాలను వెలుగులోకి తేవాలని ప్రత్యేక బృందం ప్రయత్నాలు చేస్తోంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?
విజయసాయిరెడ్డి భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?
SIR Enumeration Uncollectable Votes: తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న SIR ప్రక్షాళన - లక్షల్లో ఓట్ల గల్లంతు - వాళ్లంతా ఏమయ్యారు?
తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న SIR ప్రక్షాళన - లక్షల్లో ఓట్ల గల్లంతు - వాళ్లంతా ఏమయ్యారు?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: పర్మిషన్ లేకుండా ర్యాలీలు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు
పర్మిషన్ లేకుండా ర్యాలీలు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Embed widget