అన్వేషించండి

Andhra News : సత్తెనపల్లి వైసీపీలో చేరికలు - మాజీ ఎమ్మెల్యే యర్రం కుటుంబానికి కండువా కప్పిన సీఎం జగన్ !

సత్తెనపల్లిలో ఇతర పార్టీల నేతలు వైసీపీలో చేరారు. సీఎం జగన్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Andhra News : పల్నాడు జిల్లా సత్తెనపల్లి మాజీఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి వైఎస్ఆర్‌సీపీలో చేరారు.  వెంకటేశ్వర రెడ్డితో పాటు ఆ పార్టీలో ఆయన కుమారుడు నితిన్‌ రెడ్డి, సత్తెనపల్లి బీజేపీ కన్వీనర్‌ పక్కాల సూరిబాబు కూడా వైసీపీలో చేరారు.  సత్తెనపల్లి నుంచి యర్రం వెంకటేశ్వర రెడ్డి 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయనను వైసీపీలో చేర్చడంలో  ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుతో పాటు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కీలక పాత్ర పోషించారు. గత ఎన్నికల్లో యర్రం వెంకటేశ్వరరెడ్డి జనసేన పార్టీ నుంచి బరిలో నిలిచారు. ఆ తర్వాత ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కొంత కాలంగా సైలెంట్ గా ఉంటున్నారు. ఇప్పుడు వైసీపీలో చేర్చుకున్నారు.  యర్రం వెంకటేశ్వర రెడ్డి ఎలాంటి మచ్చ  లేని వ్యక్తి అని ఈ సందర్భంగా అంబటి రాంబాబు, లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు. ఆయన పార్టీలో చేరడం వల్ల పార్టీకి మరింత బలం చేకూరుతుందని చెప్పారు. ఆయన సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటామని అన్నారు.

ఎంపీ లావు కృష్ణదేవరాయులు ఇటీవలి కాలంలో పార్టీకి దూరంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అయనకు సరైన ప్రోటోకాల్ ఇవ్వడం లేదన్న కారణంగా అసంతృప్తికి గురయ్యారని చెబుతున్నారు.  అయితే యర్రం వెంకటేశ్వరరెడ్డిని పార్టీలో చేర్చుకునే విషయంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. సీఎం దగ్గరకు వెళ్లిన బృందంలో ఆయన కూడా ఉన్నారు.  నర్సరావుపేట ఎంపీగా ఉన్న లావు కృష్ణదేవరాయులుకు తన నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటించడానికి కూడా పెద్దగా అవకాశం లేకుండా పోయిందన్న అసంతృప్తి ఉంది. ఇటీవల చిలుకలూరిపేటలో జరిగిన సభలో.. సీఎం జగన్ కు నేరుగా తన అసంతృప్తిని తెలియచేశారు. ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చినట్లుగా చెబుతున్నారు.                   

సత్తెనపల్లిలో పార్టీ పరిస్థితిపై వైఎస్ఆర్‌సీపీలో భిన్నమైన చర్చలు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని చిట్టా విజయభాస్కర్ రెడ్డి అనే ఇప్పటికే ప్రకటించారు.  మంత్రి అంబటికి వ్యతిరేకంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు వైసీపీ నేత చిట్టా విజయ భాస్కర్‌రెడ్డి.  సత్తెనపల్లి సీటుకోసం యుద్ధం చేస్తానని ప్రకటించారు. ఆయనకు చెక్ పెట్టడానికే కొత్తగా యర్రం వెంకటేశ్వరరెడ్డిని పార్టీలోకి తీసుకున్నారన్న అభిప్రాయం వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది.          


అంబటి రాంబాబు స్థానికేతరుడు. ఆయన రేపల్లె ప్రాంతానికి చెందినవారు. అక్కడే ఓ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్ పార్టీ పెట్టిన తర్వాత వైసీపీ లీడర్ గా ఆయన కాపు సామాజికవర్గం బలంగా ఉన్న సత్తెనపల్లిని ఎంచుకున్నారు. మొదటి సారి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. రెండో సారి పోటీ చేసి భారీ తేడాతో గెలుపొందారు. అయితే నియోజకవర్గంలో బలమైన వైసీపీ నేతల నుంచి ఎప్పటికప్పుడు అసంతృప్తిని ఎదుర్కొంటూనే ఉన్నారు.                             

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
Kailasagir iTrishul: కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో
కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget