అన్వేషించండి

TTD Controversy : టీటీడీలో రాజకీయ జోక్యం వల్లనే వివాదాలు - జవాబుదారీతనం ఎలా వస్తుంది ?

Laddu Issue : తిరుమల లడ్డూ ప్రసాదంలో జరిగిన అతి పెద్ద తప్పిదంతో ఇప్పుడు టీటీడీ వ్యవహారాలపై విస్తృత చర్చ జరుగుతోంది. టీటీడీలో రాజకీయ జోక్యం పెరిగిపోవడం వల్లనే సమస్యలు వస్తున్నాయి.

TTD: తిరుమల తిరుపతి దేవస్థానాలకు ప్రత్యేకమైన వ్యవస్థ ఉంది. పేరుకు స్వతంత్ర బోర్డు ఉంటుంది కానీ.. ప్రభుత్వ కనుసన్నల్లోనే ఉంటుంది. టీటీడీ బోర్డుకు రాజకీయనాయకుల్నే  చైర్మన్లుగా నియమిస్తున్నారు. సభ్యలుగా రాజకీయ నేతలు, వ్యాపారులు,  పారిశ్రామిక వేత్తలు ఉంటున్నారు. వీరే టీటీడీని నడిపిస్తారు. ఈవోగా ఐఏఎస్ అధికారి ఉన్నప్పటికీ కీలకమైన నిర్ణయాలు రాజకీయ పరంగానే  సాగుతాయి. ఎందుకంటే ప్రభుత్వం ఆగ్రహిస్తే ఈవో పదవి ఉండదు. అందుకే ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీ నేతలు చైర్మన్లుగా. సభ్యులుగా ఉంటారు. ఈవో వారు చెప్పింది చేస్తారు. ఇక్కడే అక్రమాలకు బీజం పడుతోంది. 

గత ఐదేళ్ల కాలంలో అర్హత లేకపోయినా ఈవోగా ధర్మారెడ్డి 

తిరుమల తిరుపతి దేవస్థానం అంటే.. వేల కోట్ల బడ్జెట్ మాత్రమే కాదు.. కోట్లాది మంది హిందువుల మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత ఉన్న సంస్థ. ఈ సంస్థకు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చైర్మన్ గా వైవీ సబ్బారెడ్డి నాలుగేళ్ల పాటు ఉన్నారు. అలాగే రక్షణ శాఖలో పని చేస్తూ.. డిప్యూటేషన్ మీద ఏపీకి వచ్చిన ధర్మారెడ్డి పూర్తిగా ఐదేళ్ల కాలం అనేక సార్లు తన డిప్యూటేషన్  పొడిగించుకుంటూ తిరుమలలోనే కొనసాగారు చివరికి ఆయనకు ఈవో పోస్టింగ్ ఇచ్చారు. సహజంగానే సీనియర్ ఐఏఎస్‌లకు మాత్రమే ఈవో పోస్టింగ్ ఇస్తారు. అర్హత లేకపోయినా పదవి ఇచ్చారని కొంత మంది కోర్టుల్లోనూ పిటిషన్లు వేశారు. ధర్మారెడ్డి వ్యవహారశైలి... ఆయన టీటీడీలో పాతుకు పోవడంపై అనేక విమర్శలు వచ్చాయ. చివరిలో భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ ను చేశారు. ఆయన పైనా అనేక ఆరోపణలు వచ్చాయి. మొత్తంగా ఐదేళ్ల పాటు టీటీడీ వివాదాల మయంగా మారింది.   

బూందీగా ప్రారంభమైన తిరుపతి లడ్డూ చరిత్ర తెలుసా? మొదట్లో 8 నాణేలకే అమ్మకం!

రివర్స్ టెండర్ల పద్దతితో ఇష్టం వచ్చిన వారికి టెండర్లు ఇచ్చారన్న ఆరోపణలు

శ్రీవారి లడ్డూ ప్రసాదం ఉత్కృష్టమైనది.  భౌగోళిక గుర్తింపు ఉన్న వంటకం. ఆ లడ్డూ పవిత్రత కాపాడటానికి అత్యంత నాణ్యమైన సరుకుల్నే కొనుగోలు చేయాలి. ఇది రోజువారీ అన్న క్యాంటీన్లు లేదా మధ్యాహ్న భోజనానికి సంబంధించిన టెండర్లు కాదు. అతి తక్కువకు ఇస్తామని టెండర్లు వేస్తే.. ఎలా ఇస్తారో ఆలోచించకుండా టెండర్లు ఇవ్వడం అనేది దుర్మార్గమైన విషయం. స్వచ్చమైన ఆవు నెయ్యి రూ. వెయ్యి వరకూ అవతుందని డెయిరీ నిపుణులు చెబుతారు. మరి టీటీడీ పెద్దలకు ఎందుకు తెలియలేదో కానీ.  మూడు వందలకు.. నాలుగు వందలకు ఇస్తామని చెప్పగానే టెండర్లు ఇచ్చేశారు. క్క లీటర్‌కు వంద.. రెండు వందలు నష్టం చేసుకుని వేల లీటర్లు ఏ కంపెనీ మాత్రం సరఫరా చేస్తుంది.  అత్యంత నాసిరకం.. కల్తీ నెయ్యిని సరఫరా చేసి దొరికిపోయారు. ఇది చిన్న విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసింది. 

Also Read: లడ్డూ సహా శ్రీవారికి నివేదించే ప్రసాదాలు ఇవే - శుక్రవారం చాలా ప్రత్యేకం!

రాజకీయ జోక్యం వల్లనే ఈ తరహా టెండర్లు - రివర్స్ టెండర్లు

టీటీడీలో గతంలో పని చేసిన పాలక మండళ్లు.. ఇలా రోజువారీ కొనుగోళ్లు..క్వాలిటీ అంశంలో జోక్యం చేుకోవు. అధికారులే అత్యంత జాగ్రత్తగా ఉంటారు. కానీ గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుని ప్రతి టెండర్ ఎవరికి దక్కాలో డిసైడ్ చేసుకుని ఆ మేరకు టెండర్లు..రివర్స్ టెండర్ల ప్రక్రియ నిర్వహించేవారన్న ఆరోపణలు వచ్చాయి. అందులో భాగంగాేన సామర్థ్యం లేని కంపెనీలు టెండర్లలో పాల్గొని తక్కువ ధరకు సరఫరా చేస్తామని ముందుకు వచ్చినా అంగీకరించారని అంటున్నారు. ఈ కంపెనీలకు టెండర్లు దక్కడం వెనుక కీలక పరిణామాలు ఉన్నాయని.. దర్యాప్తులో అన్నీ బయటకు వస్తాయని అంటున్నారు. 

టీటీడీ లాంటి ఆలయాలను నిర్వహించడం ఆషామాషీ కాదు. స్వార్థ పరుల చేతుల్లో పడితే అనేక సమస్యలు వస్తాయి. దేవుడండే భయం,  భక్తి ఉన్న వారు అయితేనే  సక్రమంగా నిర్వహించగలరని.. అలాంటి అధ్యాత్మక వాదులకే పాలక మండలిలో చోటు కల్పిస్తేనే పరిస్థితులు మెరుగుపడుతాయన్న వాదన వినిపిస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
LPG Gas Cylinders: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం! శిల్పకళా వైభవం, రహస్యాలు, కల్యాణోత్సవం వివారాలివే!
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం! శిల్పకళా వైభవం, రహస్యాలు, కల్యాణోత్సవం వివారాలివే!

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
Kerala Assembly Elections 2026: కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
Telangana Politics: బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
Rajendra Prasad : మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
MG Comet నుంచి Gloster వరకు - రూ.60 వేల నుంచి రూ.4 లక్షల వరకు స్పెషల్‌ డిస్కౌంట్స్‌
MG Comet నుంచి Gloster వరకు - రూ.60 వేల నుంచి రూ.4 లక్షల వరకు స్పెషల్‌ డిస్కౌంట్స్‌
Velugumatla Issue: వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
Embed widget