Nandyala News: నంద్యాల జిల్లా అవుకు జలాశయంలో బోటు బోల్తా- ఇద్దరు మృతి- మరికొందరు గల్లంతు
Nandyala News: విహారయాత్ర విషాదం నింపింది. నంద్యాల జిల్లాలో కొందరు పర్యాటకులు ప్రమాదంలో చిక్కుకున్నారు.

Nandyala News: నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. విషాద యాత్ర కాస్త విషాదంలో ముగిసింది. అవుకు జలాశయంలో పడవ బోల్తా పడి 12 మంది గల్లంతయ్యారు. ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా వారి కోసం గాలిస్తున్నారు
కోవెలకుంట్లలో కానిస్టేబుల్గా పని చేస్తున్నా రసూల్ తన కుటుంబంతో కలిసి బోటింగ్కు వచ్చారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో రసూల్ కుమార్తె మృతి చెందింది. బోటులో పరిమితికి మించి కూర్చోవడం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. .
ప్రమాదం సంగతి తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. రెస్క్యూ టీంలను రప్పించి గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. గజ ఈతగాళ్లను కూడా రంగంలోకి దింపారు. రెండేళ్ల క్రితమే ఇక్కడ బోటు షికారు ప్రారంభించారు.
Before You Go
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
ట్రెండింగ్ వార్తలు





















