Kurnool Crime News: కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం- ఆస్పరి మండలంలో ఈతకు వెళ్లి ఆరుగురు చిన్నారులు మృతి
Kurnool Crime News: ఈతకు వెళ్లిన చిన్నారులు ఆరుగురు మృతి చెందిన దుర్ఘటన కర్నూలుజిల్లా ఆస్పరిలో జరిగింది. ఇది స్థానికంగా తీవ్ర విషాదం నింపింది

Kurnool Crime News: కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. సరదాగా ఈతకు వెళ్లిన చిన్నారులు విగతజీవిలపై తిరిగివచ్చారు. ఆస్పరి మండలం చిగిలిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుంటలో ఈతకు వెళ్లి మృతి చెందిన చిన్నారుల పేర్లు శశి కుమార్, సాయి, కిరణ్, భీమ, వీరేద్ర, మహబూబ్. స్థానికుల ఆ ప్రాంతంలో గాలించి చిన్నారుల మృతదేహాలను వెలికి తీశారు. ఆ మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. వారిని ఓదార్చడం అక్కడి వారి వల్ల కాలేదు.
చిన్నారుల మృత్యువాత గురించి తెలుసుకున్నా స్థానిక ఎమ్మెల్యే విరూపాక్షి ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు.
ట్రెండింగ్ వార్తలు





















