అన్వేషించండి

పుస్తకాలు ఇవ్వండి- మెస్‌ఛార్జీలు పెంచండి- ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా

కర్నూలు జిల్లాలో ఎస్ఎఫ్ఐ చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసింది. సకాలంలో పాఠ్య పుస్తకాలు అందించాలని కోరింది.  

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో ఎస్‌ఎఫ్‌ఐ చోలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్రంలోని 3, 4, 5వ తరగతుల విలీనాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు. పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంతోపాటు పాఠ్య పుస్తకాలను సకాలంలో అందించాలని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు నెలకు 2500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు విద్యా వతి దీవెనల పథకం అమలు చేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో ఉన్న బైజూస్ ఒప్పందాన్ని రద్దు చేయాలన్నారు. 

బడులు ప్రారంభమై నెలలు గడుస్తున్నా పుస్తకాలు లేవు

కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎదుట భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నేతలు ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. 2022-2023 విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కల్పించలేదని అన్నారు. దీని వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు అందక విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారన్నారు.

మెస్ ఛార్జీలను పెంచాలని డిమాండ్.. 

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా 3,4,5 తరగతుల విలీనాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు నాయకులు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులను విలీనం చేయడం ద్వారా విద్యకు దూరమవుతున్నారని విద్యార్థి సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇటువంటి చర్యలను మానుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి వసతి గృహాల విద్యార్థులకు ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు. గతంలో ఉండే చార్జీల వల్ల హాస్టల్‌లో ఉండి  చదువుకుంటున్న విద్యార్థులకు అనుకున్న స్థాయిలో అందుబాటులో లేక తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నారన్నారు. అందుకే మెస్ ఛార్జీలను పెంచి విద్యార్థులకు మెరుగైన వసతి గృహ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

జీవోల మార్పుల వల్ల గందరగోళ వాతావరణం...

గత కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల జీవోలను అమలు చేసి కొన్ని రోజులు గడవకు ముందే దాన్ని మార్చి 128వ జీవోను ప్రవేశ పెట్టడం మంచి పద్ధతి కాదన్నారు. ఇలాంటి జీవోల ద్వారా ఉపాధ్యాయులకు గందరగోళ వాతావరణం నెలకొందని విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం బైజుస్ అనే సంస్థ ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరారు. ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కూడా పాఠ్య పుస్తకాలను అందించాలని వారు డిమాండ్ చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Vijayawada- Visakha High Speed Rail: విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
UTS మొబైల్ యాప్‌లో ట్రైన్ టికెట్ తీసుకుంటున్నారా.. యాప్ మూసేస్తున్న రైల్వే.. వాలెట్ లోని డబ్బులు ఏమవుతాయి..?
UTS మొబైల్ యాప్‌లో ట్రైన్ టికెట్ తీసుకుంటున్నారా.. యాప్ మూసేస్తున్న రైల్వే.. వాలెట్ లోని డబ్బులు ఏమవుతాయి..?

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay one chance please: ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
Iran Israel War: ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Christian controversy in AP Legislative Council: శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
Ustaad Bhagat Singh: వారం ముందుకు పవన్ 'ఉస్తాద్'... బ్యాగ్రౌండ్‌కు తమన్ బదులు డిఎస్పీ?
వారం ముందుకు పవన్ 'ఉస్తాద్'... బ్యాగ్రౌండ్‌కు తమన్ బదులు డిఎస్పీ?
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Embed widget