అన్వేషించండి

పుస్తకాలు ఇవ్వండి- మెస్‌ఛార్జీలు పెంచండి- ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా

కర్నూలు జిల్లాలో ఎస్ఎఫ్ఐ చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసింది. సకాలంలో పాఠ్య పుస్తకాలు అందించాలని కోరింది.  

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో ఎస్‌ఎఫ్‌ఐ చోలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్రంలోని 3, 4, 5వ తరగతుల విలీనాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు. పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంతోపాటు పాఠ్య పుస్తకాలను సకాలంలో అందించాలని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు నెలకు 2500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు విద్యా వతి దీవెనల పథకం అమలు చేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో ఉన్న బైజూస్ ఒప్పందాన్ని రద్దు చేయాలన్నారు. 

బడులు ప్రారంభమై నెలలు గడుస్తున్నా పుస్తకాలు లేవు

కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎదుట భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నేతలు ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. 2022-2023 విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కల్పించలేదని అన్నారు. దీని వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు అందక విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారన్నారు.

మెస్ ఛార్జీలను పెంచాలని డిమాండ్.. 

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా 3,4,5 తరగతుల విలీనాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు నాయకులు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులను విలీనం చేయడం ద్వారా విద్యకు దూరమవుతున్నారని విద్యార్థి సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇటువంటి చర్యలను మానుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి వసతి గృహాల విద్యార్థులకు ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు. గతంలో ఉండే చార్జీల వల్ల హాస్టల్‌లో ఉండి  చదువుకుంటున్న విద్యార్థులకు అనుకున్న స్థాయిలో అందుబాటులో లేక తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నారన్నారు. అందుకే మెస్ ఛార్జీలను పెంచి విద్యార్థులకు మెరుగైన వసతి గృహ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

జీవోల మార్పుల వల్ల గందరగోళ వాతావరణం...

గత కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల జీవోలను అమలు చేసి కొన్ని రోజులు గడవకు ముందే దాన్ని మార్చి 128వ జీవోను ప్రవేశ పెట్టడం మంచి పద్ధతి కాదన్నారు. ఇలాంటి జీవోల ద్వారా ఉపాధ్యాయులకు గందరగోళ వాతావరణం నెలకొందని విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం బైజుస్ అనే సంస్థ ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరారు. ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కూడా పాఠ్య పుస్తకాలను అందించాలని వారు డిమాండ్ చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Future City: రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం -  కాని మాస్టర్ ప్లానేది?
రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం - కాని మాస్టర్ ప్లానేది?
Andhra Pradesh News: మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
Secunderabad- Tirupati Vande Bharat Express: తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
IBOMMA Ravi Custudy: ఐబొమ్మ రవి సంపాదన వంద కోట్లపైనే - కస్టడీలో కీలక వివరాలు రాబట్టిన పోలీసులు
ఐబొమ్మ రవి సంపాదన వంద కోట్లపైనే - కస్టడీలో కీలక వివరాలు రాబట్టిన పోలీసులు
Advertisement

వీడియోలు

Tamilnadu Deputy CM Udhayanidhi Stalin Full Speech | ABP Southern Rising Summit 2025 లో ఉదయనిధి స్టాలిన్ పూర్తి ప్రసంగం | ABP Desam
Tamil Nadu Deputy CM Udhayanidhi Stalin Dravidian Algorithm ABP Southern Rising Summit 2025 | ద్రవిడయన్ ఆల్గారిథంపై మాట్లాడిన డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్
Tamil Nadu Deputy CM Udhayanidhi Stalin Speech | ABP Southern Rising Summit 2025 లో తమిళనాడు గవర్నర్ పై డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఫైర్  | ABP Desam
ABP Director Dhruba Mukherjee Speech | ABP Southern Rising Summit 2025 లో ప్రారంభోపన్యాసం చేసిన ఏబీపీ న్యూస్ డైరెక్టర్ ధ్రుబ ముఖర్జీ | ABP Desam
ABP Southern Rising Summit 2025 Begins | ప్రారంభమైన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025 | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Future City: రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం -  కాని మాస్టర్ ప్లానేది?
రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం - కాని మాస్టర్ ప్లానేది?
Andhra Pradesh News: మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
Secunderabad- Tirupati Vande Bharat Express: తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
IBOMMA Ravi Custudy: ఐబొమ్మ రవి సంపాదన వంద కోట్లపైనే - కస్టడీలో కీలక వివరాలు రాబట్టిన పోలీసులు
ఐబొమ్మ రవి సంపాదన వంద కోట్లపైనే - కస్టడీలో కీలక వివరాలు రాబట్టిన పోలీసులు
ABP Southern Rising Summit 2025: చెన్నైలో ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్.. కీలక అంశాలపై మాట్లాడనున్న దక్షిణాది ప్రముఖులు
చెన్నైలో ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్.. కీలక అంశాలపై మాట్లాడనున్న దక్షిణాది ప్రముఖులు
Kokapet land auction: కోకాపేటలో ఎకరం 137 కోట్లు - రికార్డు స్థాయి ధర పలికిన మరో వేలం
కోకాపేటలో ఎకరం 137 కోట్లు - రికార్డు స్థాయి ధర పలికిన మరో వేలం
Dharmendra : బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర అంత్యక్రియలు పూర్తి - అభిమానుల కన్నీటి వీడ్కోలు
బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర అంత్యక్రియలు పూర్తి - అభిమానుల కన్నీటి వీడ్కోలు
Pawan Kalyan: నాడు ఆలయానికి ఇచ్చిన మాట నేడు నెరవేర్చిన పవన్ - జగన్నాథపురం గుడి దశ తిరిగినట్లే  !
నాడు ఆలయానికి ఇచ్చిన మాట నేడు నెరవేర్చిన పవన్ - జగన్నాథపురం గుడి దశ తిరిగినట్లే !
Embed widget