అన్వేషించండి

పుస్తకాలు ఇవ్వండి- మెస్‌ఛార్జీలు పెంచండి- ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా

కర్నూలు జిల్లాలో ఎస్ఎఫ్ఐ చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసింది. సకాలంలో పాఠ్య పుస్తకాలు అందించాలని కోరింది.  

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో ఎస్‌ఎఫ్‌ఐ చోలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్రంలోని 3, 4, 5వ తరగతుల విలీనాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు. పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంతోపాటు పాఠ్య పుస్తకాలను సకాలంలో అందించాలని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు నెలకు 2500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు విద్యా వతి దీవెనల పథకం అమలు చేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో ఉన్న బైజూస్ ఒప్పందాన్ని రద్దు చేయాలన్నారు. 

బడులు ప్రారంభమై నెలలు గడుస్తున్నా పుస్తకాలు లేవు

కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎదుట భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నేతలు ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. 2022-2023 విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కల్పించలేదని అన్నారు. దీని వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు అందక విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారన్నారు.

మెస్ ఛార్జీలను పెంచాలని డిమాండ్.. 

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా 3,4,5 తరగతుల విలీనాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు నాయకులు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులను విలీనం చేయడం ద్వారా విద్యకు దూరమవుతున్నారని విద్యార్థి సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇటువంటి చర్యలను మానుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి వసతి గృహాల విద్యార్థులకు ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు. గతంలో ఉండే చార్జీల వల్ల హాస్టల్‌లో ఉండి  చదువుకుంటున్న విద్యార్థులకు అనుకున్న స్థాయిలో అందుబాటులో లేక తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నారన్నారు. అందుకే మెస్ ఛార్జీలను పెంచి విద్యార్థులకు మెరుగైన వసతి గృహ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

జీవోల మార్పుల వల్ల గందరగోళ వాతావరణం...

గత కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల జీవోలను అమలు చేసి కొన్ని రోజులు గడవకు ముందే దాన్ని మార్చి 128వ జీవోను ప్రవేశ పెట్టడం మంచి పద్ధతి కాదన్నారు. ఇలాంటి జీవోల ద్వారా ఉపాధ్యాయులకు గందరగోళ వాతావరణం నెలకొందని విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం బైజుస్ అనే సంస్థ ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరారు. ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కూడా పాఠ్య పుస్తకాలను అందించాలని వారు డిమాండ్ చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Gas Cylinder Blast: సత్యసాయి జిల్లాలో ఘోరం.. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురి మృతి, అసలేం జరిగింది?
సత్యసాయి జిల్లాలో ఘోరం.. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురి మృతి, అసలేం జరిగింది?
AP Inter Results 2026: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు బుధవారం విడుదల! నేరుగా వాట్సాప్‌లో రిజల్ట్స్‌!
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు బుధవారం విడుదల! నేరుగా వాట్సాప్‌లో రిజల్ట్స్‌!
MLA Qualifications: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఉండాల్సిన అర్హతలు ఇవే! రాజ్యాంగ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఉండాల్సిన అర్హతలు ఇవే! రాజ్యాంగ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
Viral News: 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వెళ్లిన బాలుడు.. అటు నుంచి రైలెక్కి రాయచూర్‌‌కు.. విషయం తెలిసిన పేరెంట్స్ షాక్
100 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వెళ్లిన బాలుడు.. అటు నుంచి రైలెక్కి రాయచూర్‌‌కు.. విషయం తెలిసిన పేరెంట్స్ షాక్

వీడియోలు

Ruturaj Angry with CSK Fielding vs KKR | ఫీల్డింగ్‌పై CSK కెప్టెన్ సీరియస్ వార్నింగ్
Noor Ahmad CSK vs KKR IPL 2026 | చెపాక్‌లో నూర్ అహ్మద్ సునామీ
Virat Kohli Injured in IPL 2026 ? | కాలికి కట్టుతో విరాట్.. టెన్షన్ లో ఫ్యాన్స్
Praful Hinge Huge Craze in Social Media | ఒకే మ్యాచ్‌తో ప్రఫుల్‌కు ఫుల్ క్రేజ్‌
IPL 2026 CSK vs KKR Highlights | చెన్నైపై వ‌రుస‌గా రెండో విజ‌యం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RCB VS LSG Result Update: టాప్ లేపిన ఆర్సీబీ.. నాలుగో విజ‌యంతో స‌త్తా.. ఆకట్టుకున్న కోహ్లీ, భువీ, .. ల‌క్నో చిత్తు
టాప్ లేపిన ఆర్సీబీ.. నాలుగో విజ‌యంతో స‌త్తా.. ఆకట్టుకున్న కోహ్లీ, భువీ, .. ల‌క్నో చిత్తు
Delimitation Bill 2026: డీలిమిటేషన్‌తో పాకిస్తాన్‌కు చెక్! పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణకు అడుగులు!
డీలిమిటేషన్‌తో పాకిస్తాన్‌కు చెక్! పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణకు అడుగులు!
Raghurama on Amaravati: అమరావతిని చంద్రబాబు దేవతల రాజధాని అనడం మానేయాలి - డిప్యూటీ స్పీకర్ రఘురామ కీలక వ్యాఖ్యలు
అమరావతిని చంద్రబాబు దేవతల రాజధాని అనడం మానేయాలి - డిప్యూటీ స్పీకర్ రఘురామ కీలక వ్యాఖ్యలు
Ration shops: రేషన్ తీసుకోలేదని కంగారు పడుతున్నారా ..నో టెన్షన్ - 30వ తేదీ వరకూ తీసుకోవచ్చు!
రేషన్ తీసుకోలేదని కంగారు పడుతున్నారా ..నో టెన్షన్ - 30వ తేదీ వరకూ తీసుకోవచ్చు!
AP high Court: ఆకివీడు రామాలయంపై హైకోర్టు కీలక ఆదేశాలు - స్వయంగా వాదనలు వినిపించిన రఘురామ
ఆకివీడు రామాలయంపై హైకోర్టు కీలక ఆదేశాలు - స్వయంగా వాదనలు వినిపించిన రఘురామ
TDP Son Rise: మరో తరానికి టీడీపీ బాధ్యతలు - నారా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు వెనుక చంద్రబాబు వ్యూహం !
మరో తరానికి టీడీపీ బాధ్యతలు - నారా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు వెనుక చంద్రబాబు వ్యూహం !
Peddi Postponed: జూన్‌కు వాయిదా పడిన పెద్ది... అఫీషియల్‌గా చెప్పిన రామ్ చరణ్ టీం
జూన్‌కు వాయిదా పడిన పెద్ది... అఫీషియల్‌గా చెప్పిన రామ్ చరణ్ టీం
Gas Cylinder Blast: సత్యసాయి జిల్లాలో ఘోరం.. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురి మృతి, అసలేం జరిగింది?
సత్యసాయి జిల్లాలో ఘోరం.. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురి మృతి, అసలేం జరిగింది?
Embed widget