అన్వేషించండి

పుస్తకాలు ఇవ్వండి- మెస్‌ఛార్జీలు పెంచండి- ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా

కర్నూలు జిల్లాలో ఎస్ఎఫ్ఐ చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసింది. సకాలంలో పాఠ్య పుస్తకాలు అందించాలని కోరింది.  

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో ఎస్‌ఎఫ్‌ఐ చోలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్రంలోని 3, 4, 5వ తరగతుల విలీనాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు. పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంతోపాటు పాఠ్య పుస్తకాలను సకాలంలో అందించాలని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు నెలకు 2500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు విద్యా వతి దీవెనల పథకం అమలు చేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో ఉన్న బైజూస్ ఒప్పందాన్ని రద్దు చేయాలన్నారు. 

బడులు ప్రారంభమై నెలలు గడుస్తున్నా పుస్తకాలు లేవు

కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎదుట భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నేతలు ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. 2022-2023 విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కల్పించలేదని అన్నారు. దీని వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు అందక విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారన్నారు.

మెస్ ఛార్జీలను పెంచాలని డిమాండ్.. 

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా 3,4,5 తరగతుల విలీనాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు నాయకులు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులను విలీనం చేయడం ద్వారా విద్యకు దూరమవుతున్నారని విద్యార్థి సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇటువంటి చర్యలను మానుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి వసతి గృహాల విద్యార్థులకు ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు. గతంలో ఉండే చార్జీల వల్ల హాస్టల్‌లో ఉండి  చదువుకుంటున్న విద్యార్థులకు అనుకున్న స్థాయిలో అందుబాటులో లేక తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నారన్నారు. అందుకే మెస్ ఛార్జీలను పెంచి విద్యార్థులకు మెరుగైన వసతి గృహ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

జీవోల మార్పుల వల్ల గందరగోళ వాతావరణం...

గత కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల జీవోలను అమలు చేసి కొన్ని రోజులు గడవకు ముందే దాన్ని మార్చి 128వ జీవోను ప్రవేశ పెట్టడం మంచి పద్ధతి కాదన్నారు. ఇలాంటి జీవోల ద్వారా ఉపాధ్యాయులకు గందరగోళ వాతావరణం నెలకొందని విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం బైజుస్ అనే సంస్థ ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరారు. ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కూడా పాఠ్య పుస్తకాలను అందించాలని వారు డిమాండ్ చేశారు.

టాప్ హెడ్ లైన్స్

ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
YS Jagan On DSC 2025:
"డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వమే అంగీకరించింది, అందుకే సీబీఐ విచారణ చేయాలి" వైఎస్‌ జగన్ డిమాండ్ 

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget