అన్వేషించండి

Kurnool MP Sanjeev Kumar : జగన్‌కు షాకివ్వనున్న మరో ఎంపీ - టీడీపీలో చేరే యోచనలో కర్నూలు సంజీవ్ కుమార్ !

Kurnool MP : కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ టీడీపీలో చేరే అవకాశం ఉంది. ఆయనకు టిక్కెట్‌ ఇచ్చేది లేదని సీఎం జగన్ తేల్చేశారు.

Kurnool MP Sanjeev Kumar is likely to join TDP : వైఎస్ఆర్‌సీపీకి కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది. ఆయన ఈ విషయాన్ని  విజయవాడలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో కర్నూలు నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిపై విజయం సాధించారు. ఈ సారి టిక్కెట్ల కసరత్తులో సీఎం జగన్ అసలు ఆయన పేరును పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఆలూరు నుంచి అసెంబ్లీ టిక్కెట్ నిరాకరించబోతున్న మంత్రి గుమ్మనూరు జయరాంను కర్నూలు పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని సీఎం జగన్ సూచిస్తున్నారు. తన గురించి పట్టించుకోకపోతూండటం.. కనీసం అసెంబ్లీ టిక్కెట్ అయినా  కేటాయించేందుకు ఆసక్తి చూపించకపోవడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకపోతూండటంతో టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.                      

బీసీ సామాజిక వర్గానికి చెందిన సంజీవ్‌ కుమార్ ఇటీవల టీడీపీ నేతలతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది.    కర్నూలు నగరంలో ప్రముఖ డాక్టర్‌‌గా సంజీవ్‌ కుమార్‌ గుర్తింపు పొందారు. ఎంపీగా గెలిచిన తర్వాత పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవడం, ఢిల్లీలో ఒకరిద్దరు ఎంపీలు మినహా మిగిలిన వారంతా సొంతంగా పనిచేసే అవకాశాలు లేకపోవడంపై ఆయన అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.  ఈసారి ఎంపీగా కాకుండా.. ఎమ్మిగనూరు నుంచి ఎమ్మెల్యే బరిలో నిలిచేందుకు అవకాశం ఇస్తారని సంజీవ్ కుమార్ అనుకున్నారు. కానీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే సూచన మేరకు మాచాని వెంకటేష్ అనే నేతకు టిక్కెట్ కేటాయించారు.  తన సామాజిక వర్గానికి చెందిన వారు ఎమ్మిగనూరులో మెజారిటీ ఓటర్లుగా ఉన్నారని చాన్సివ్వాలని కోరినా హైకమాండ్ పట్ిటంచుకోలేదు.  

సంజీవ్ కుమార్ కు కొంత కాలంగా కర్నూలు వైసీపీ నేతలతోనూ సరిపడటం లేదు.   పలు నియోజకవర్గాల్లో వైసీపీలో అంతర్గత విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, నామినేటెడ్‌ పదవులు పొందినవారు.. ఇలా కొందరు నేతల మధ్య సఖ్యత లేకపోవడం.. కొన్ని సందర్భాల్లో ఆ విభేదాలు బహిర్గతం అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో పార్టీ మారాలని సంజీవ్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీలో ఆయనకు టిక్కెట్ దక్కుతుందా లేదా అన్నదనిపై స్పష్టత లేదు. సర్వేలను బట్టి టిక్కెట్ కేటాయిస్తామని టీడీపీ హైకమాండ్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గతంలో కర్నూలు నుంచి వైసీపీ తరపున గెలిచిన బుట్టా రేణుక కూడా టీడీపీలో చేరి మళ్లీ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. రాజకీయంగా ఆమె పూర్తిగా ప్రాధాన్యత కోల్పోయారు.                

రాజకీయ పార్టీలు టిక్కెట్ల కసరత్తులో వేగం పెంచడంతో చాన్స్ రాని వాళ్లు ఇతర పార్టీలను చూసుకుంటున్నారు. విజయవాడ ఎంపీ టిక్కెట్ ఈ సారి కేశినేని నానికి ఇవ్వడం లేదని స్పష్టత ఇవ్వడంతో ఆయన వైసీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనిపై క్లారిటీ కోసం ఆయన సీఎం జగన్ ను కలిశారు.            

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Rains Alert: ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Devansh Birthday:శ్రీవారి సన్నిధిలో చంద్రబాబు ఫ్యామిలీ! దేవాన్ష్ పుట్టిన రోజున తిరుమలలో అన్నదాన కార్యక్రమం! స్వయంగా వడ్డించిన సీఎం!
శ్రీవారి సన్నిధిలో చంద్రబాబు ఫ్యామిలీ! దేవాన్ష్ పుట్టిన రోజున తిరుమలలో అన్నదాన కార్యక్రమం! స్వయంగా వడ్డించిన సీఎం!
Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన! రెండు రోజులు బీభత్సం! పిడుగులతో జనం బెంబేలు!
ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన! రెండు రోజులు బీభత్సం! పిడుగులతో జనం బెంబేలు!

వీడియోలు

MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam
Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Strait of Hormuz: హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
Embed widget