అన్వేషించండి

Kurnool News: కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు - ఇద్దరు దోషులకు ఉరిశిక్ష, ఒకరికి యావజ్జీవం

Kurnool News: జంట హత్యల కేసులో ఇద్దరికి ఉరి శిక్ష, మరొకరికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మహిళలపై నేరాలు చేసే వారికి ఈ కేసులో పడిన శిక్షలు భయం కలిగించాలని జిల్లా ఎస్పీ వ్యాఖ్యానించారు.

Kurnool District News: కర్నూలు జిల్లా 4వ పట్టణ పోలీసు స్టేషన్ లో నమోదైన కేసులో ముద్దాయిలకు కర్నూలు జిల్లా నాలుగో అదనపు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. జంట హత్యల కేసులో ఇద్దరికి ఉరి శిక్ష, మరొకరికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మహిళలపై నేరాలు చేసే వారికి ఈ కేసులో పడిన శిక్షలు భయం కలిగించాలని జిల్లా ఎస్పీ వ్యాఖ్యానించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కర్నూలు ఎస్పీ జి. కృష్ణకాంత్ వివరించారు.

డీజీపీ కెవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలతో మహిళలకు సంబంధించిన కేసులలో త్వరితగతిన కేసు ట్రయల్స్ పూర్తి చేసి శిక్షలు పడేవిధంగా చర్యలు చేపట్టామని అన్నారు. ‘‘కర్నూలు జిల్లా కల్లూరు మండలం, చెన్నమ్మ సర్కిల్ లో గత సంవత్సరం జంట హత్యల కేసులు నమోదయ్యాయి. వధువును, ఆమె తల్లిని దారుణంగా హత్య చేసి, వధువు తండ్రిపై హత్యాయత్నం చేశారు. గత ఏడాది  తెలంగాణ, వనపర్తి జిల్లాకు చెందిన రుక్మిణికి కర్నూలుకు చెందిన శ్రవణ్ తో వివాహం జరిగింది.

వివాహం అయిన 3 రోజుల తరువాత వధువు రుక్మిణీ తల్లిదండ్రులు అయిన వెంకటేష్, రమాదేవి.. పెళ్ళి కుమారుడైన శ్రవణ్, అతని తల్లిదండ్రులు వర ప్రసాద్, కృష్ణవేణిలతో శ్రవణ్ కుమార్ నపుంసకుడని గొడవపడ్డారు. ఈ విషయంపై ముద్దాయిలు వీరి కుటుంబం పరువు పోతుందని పెళ్ళికూతురు, ఆమె తల్లితండ్రులను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. దీంతో కర్నూలు టౌన్ చింతలముని నగర్ లోని ఇంటి వద్ద కత్తులతో పొడవగా వధువు రుక్మిణి, ఆమె తల్లి రమాదేవి అక్కడికక్కడే చనిపోయారు. వధువు తండ్రి వెంకటేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. 


Kurnool News: కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు - ఇద్దరు దోషులకు ఉరిశిక్ష, ఒకరికి యావజ్జీవం

గాయపడిన వధువు తండ్రి వెంకటేష్ ఫిర్యాదు మేరకు, కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ లో Cr.No.62/2023 U/s 498 (A), 302, 307 R/w 34 IPC గా కేసు నమోదు చేశారు. తీవ్ర రక్త స్రావ గాయాలతో ఉన్న పెళ్ళి కూతురు తండ్రి వెంకటేష్ ని కర్నూలు 4 వ పట్టణ పోలీసులు హాస్పిటల్ తీసుకువెళ్ళి మెరుగైన వైద్యం అందించారు. ముద్దాయిలైన శ్రవణ్ కుమార్, వరప్రసాద్, కృష్ణవేణిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ముద్దాయిలను జైల్లోనే పెట్టి ట్రయల్ పూర్తి చేయడం జరిగింది. 

ఈ కేసులో 90 రోజులలో విచారణ పూర్తి చేసి, చార్జ్ షీట్ ను కర్నూలు డీఎస్పీ విజయశేఖర్, కర్నూలు నాలుగో పట్టణ సీఐ పి. శంకరయ్యను జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ కేసును నాలుగో జిల్లా అదనపు కోర్టు జడ్జి విచారణ పూర్తి చేసి ఫిబ్రవరి 21న తీర్పు ఇచ్చారు.  

శిక్షలు ఇవీ..
న్యాయమూర్తి వెల్లడించిన తీర్పు ప్రకారం ముద్దాయి A-1 శ్రవణ్ కుమార్, A-2 వరప్రసాద్ అలియాస్ ప్రసాద్ కు ఉరి శిక్ష వేశారు. A-3 కృష్ణవేణికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. మహిళలపై నేరాలకు పాల్పడేవారికి ఈ కేసు గుణపాఠంగా, కనువిప్పు కలిగేలా చేసిందని జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ తెలిపారు. ఈ కేసును 10 నెలల్లోనే దర్యాప్తు, ట్రయల్ పూర్తి చేయించి, సాక్షులను, సాక్ష్యా ధారాలను ఎప్పటికప్పుడూ హాజరు పరచిన పోలీసు అధికారులను, ఈ కేసు వాదించిన పబ్లిక్ ప్యాసిక్యూటర్ వై. ప్రకాష్ రెడ్డిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh Slams Jagan: జనం ఛీకొట్టినా జగన్ డ్రామాలు మానడం లేదు- నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసంపై నారా లోకేష్
జనం ఛీకొట్టినా జగన్ డ్రామాలు మానడం లేదు- నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసంపై నారా లోకేష్
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Breaking News: కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
IMD Weather Alert Telugu States 2026:తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!

వీడియోలు

King Kohli vs Prince Gill IPL 2026 Final | కింగ్ vs ప్రిన్స్ ఎవరిదీ పైచేయి?
Captain vs Coach in RR IPL 2026 | పరాగ్ కామెంట్స్‌పై కోచ్ సంగక్కర ఫైర్
Riyan Parag Consoling Vaibhav Suryavanshi | డగౌట్ లో ఏడ్చేసిన వైభవ్ సూర్యవంశీ
RCB vs GT Final Rain Rules | IPL 2026 ఫైనల్‌కు వర్షం ముప్పు?
RCB vs GT Match Preview IPL 2026 Final | ఈసారి ఐపీఎల్ కప్ ఎవరిది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JEE Advanced 2026 Result: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
Mega DSC Scam allegations AP: డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
LPG Cylinder Prices Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
Blast Zone Collection : బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
Gujarat Titans Bus Caught on Fire: ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
Suriya : సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
Pawan Kalyan Telangana meeting June 2: టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
Indiramma Housing Scheme: లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Embed widget