అన్వేషించండి

Tungabhadra Dam Gate: కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు - కర్నూలు జిల్లా తీర ప్రజలకు కలెక్టర్ అలర్ట్

Tungabhadra Dam Gate Break | తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకుపోవడంతో దాదాపు లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆ నీటితో కర్నూలు జిల్లాలో తీర ప్రాంత ప్రజలకు ముప్పు పొంచి ఉంది.

Kurnool Collector alerts MROs over Karnataka's Tungabhadra Dam Gate Washed Away | కర్నూలు: నీటి ప్రవాహం అధికం కావడం, టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల తుంగభద్ర డ్యామ్ 19 వ గేటు కొట్టుకుపోయింది. దానివల్ల 90 వేల క్యూసెక్కుల నుంచి లక్ష క్యూసెక్కుల నీళ్లు విడుదలయ్యాయి. దిగువకు భారీగా నీళ్లు విడుదల కావడంతో మంత్రాలయం, కౌతాళం, సి. బెళగల్, కోసిగి, నందవరం, తహసీల్దార్లు జాగ్రత్తగా ఉండాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ఆదేశించారు.

ఎస్పీ, సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, జలవనరుల శాఖ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు, తహసీల్దార్లతో కలెక్టర్ ఆదివారం  టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ.. శనివారం రాత్రి తుంగభద్ర డ్యాం 19 వ గేటు కొట్టుకుపోయింది. దాంతో డ్యాం నుంచి నీళ్లు విడుదల కావడంతో మంత్రాలయం, కౌతాళం, కోసిగి, నందవరం తహసీల్దార్లను నేటి ఉదయమే అప్రమత్తం చేసినట్లు చెప్పారు. దండోరా వేయడం, మైక్ ద్వారా ప్రకటన చేయడం ద్వారా ప్రజలకు నీటి విడుదల విషయాన్ని ప్రజలకు చెప్పి, నది కాలువలోకి దిగనివ్వకుండా, చేపలు పట్టడానికి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈరోజు ఉదయం మరో 90 వేల క్యూసెక్కుల నీటి విడుదలతో మంత్రాలయం, నందవరం, కౌతాళం, కోసిగి తహసీల్దార్లు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ వారిని అప్రమత్తం చేశారు. అలాగే సి.బెళగల్ తహసీల్దార్ కూడా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. రాత్రికి ఏపీ బార్డర్లోకి నీళ్లు వస్తాయని, రేపు (సోమవారం) ఉదయం మంత్రాలయం, రేపు సాయంత్రానికి సుంకేసుల చేరుతుందన్నారు. రాత్రి వదలిన 40 వేల క్యూసెక్కుల నీరు మేలిగనూరు క్రాస్ అయిందని, దాంతో వీఆర్వో, వీఆర్ఏలు, పంచాయతీ సెక్రెటరీ లను ఉంచి ప్రజలు నదిలోకి, కాలువల్లోకి దిగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కొన్నిచోట్ల నీటి ప్రవాహం చూసి చేపలు పట్టడానికి వెళ్తారని, వారికి సైతం సూచనలు చేయాలన్నారు. ఎప్పటికప్పుడూ నీటి ప్రవాహ పరిస్థితిపై పర్యవేక్షణ చేయాలని తహశీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు.

ఎమ్మార్వోలు ఎస్డీఆర్ఎఫ్ టీంలను సిద్ధంగా ఉంచుకోవాలని, టీమ్స్ వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్పీ జి.బిందు మాధవ్ ను ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, మత్స్య శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆధోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మను అలర్ట్ చేశారు. లైసెన్స్డ్ ఫిషర్ మెన్ ను లైఫ్ జాకెట్లు, పుట్టీలతో సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా  ఫిషరీస్ అధికారిని ఆదేశించారు. ఆధోని సబ్ కలెక్టర్, మంత్రాలయం, కౌతాళం, నందవరం,  కోసిగి తహశీల్దార్లతో కలెక్టర్ మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశామని, తగినంత సిబ్బందితో పర్యవేక్షణ చేస్తున్నామని సబ్ కలెక్టర్, తహసీల్దార్లు కలెక్టర్ కు వివరించారు. ఇరిగేషన్ ఎస్ఈ రెడ్డి శేఖర్ రెడ్డి ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉందని తెలిపారు. ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Also Read: Divvela Madhuri: దువ్వాడ వాణి ఆరోపణలు బాధించాయి, నా చావుకు ఆమెనే కారణం- రోడ్డు ప్రమాదంపై మాధురి కామెంట్స్

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
YSRCP DSC Protests: ఏపీలో డీఎస్సీ సెగ!అక్రమాలు జరిగాయని  వైఎస్‌ఆర్‌సీపీ నిరసనలు! తాడిపత్రిసహా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత!
ఏపీలో డీఎస్సీ సెగ!అక్రమాలు జరిగాయని  వైఎస్‌ఆర్‌సీపీ నిరసనలు! తాడిపత్రిసహా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget