అన్వేషించండి

Jagananna Thodu: వడ్డీలేని రుణంతో చిరు వ్యాపారుల ముఖాల్లో చిరునవ్వు, నగదు జమ కార్యక్రమంలో సీఎం జగన్

Jagananna Thodu: వడ్డీలేని రుణ సాయంతో చిరు వ్యాపారుల ముఖాల్లో చిరునవ్వు వెల్లివిరుస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.

Jagananna Thodu: వడ్డీలేని రుణ సాయంతో చిరు వ్యాపారుల ముఖాల్లో చిరునవ్వు వెల్లివిరుస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. జగనన్న తోడు పథకంలో భాగంగా నేడు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగనన్న తోడు నిధులను విడుదల చేశారు. 5,10,412 మంది లబ్ధిదారులకు రూ. 560.73 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. చిరు వ్యాపారులకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పుకొచ్చారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ. 10 వేలు అందివ్వడంతో పాటు దానిపై వడ్డీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందే వారిలో దాదాపు 85 శాతం మంది మహిళలో ఉన్నారని వెల్లడించారు. సంక్షేమ పథకాల విషయంలో దేశం మొత్తం సంఖ్య కంటే.. ఏపీలో సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎక్కువగా ఉండటం ఒక అరుదైన ఘటన అని పేర్కొన్నారు. 

వరుసగా నాలుగో ఏడాదిలోనూ నిధుల విడుదల

అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా నాలుగో ఏడాదిలోనూ జగనన్న తోడు నిధులు ఇచ్చామని పేర్కొన్నారు. ' దేశంలో ఎక్కడా ఇన్ని లక్షలమందికి ఈ రకంగా మంచి చేయడం లేదు. ఇన్ని లక్షలమంది చిరువ్యాపారులకు ఎక్కడా ఇంత మేలు జరడం లేదు. దేశం మొత్తం ఇస్తున్న రుణాలు కంటే ఆంధ్ర రాష్ట్రంలో లబ్ధిదారుల సంఖ్య అంతకన్నా ఎక్కువ ఉంది. ఈ పథకాన్ని పగడ్బందీగా నడుపుతున్న బ్యాంకర్లు, సచివాలయాల వ్యవస్థ, మెప్మా తదితర శాఖలకు అభినందనలు. పేదవాడికి మంచి జరిగేలా చేసే యజ్ఞం సత్ఫలితాలను ఇస్తోంది. ఇంతవరకూ 15.87 లక్షలమంది చిరు వ్యాపారులకు మంచి జరిగింది. హస్త కళాకారులకూ ఈ పథకం ద్వారా మేలు జరిగింది. ఈ విడతలో 5,10,412 మందిలో 4.54 లక్షల మంది సకాలంలో రుణాలు చెల్లించి, మళ్లీ రూ.10 వేలు, ఆపైన రుణాలుగా అందుకుంటున్నారు. సకాలానికి కట్టిన వారికి ఇచ్చే రుణాలు రూ.10 వేల నుంచి రూ.13వేల వరకూ పెంచాం. ఇంతవరకూ 15.87 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ. 2,955.79 కోట్ల రుణాలు ఇచ్చాం. వీరిలో తిరిగి చెల్లించి.. మళ్లీ మళ్లీ రుణాలు పొందిన వారు దాదాపుగా 13.29 లక్షల మంది ఉన్నారు. ఇప్పటివరకూ వీరి తరఫున ప్రభుత్వం చెల్లించిన వడ్డీ రూ.74.69 కోట్లు' అని ముఖ్యమంత్రి తెలిపారు.

ఎక్కువ మంది లబ్ధిదారులు మహిళలే

'చిరు వ్యాపారులు సమాజ సేవ చేస్తున్నారు. ఒకరి మీద ఆధారపడకుండా.. వారు జీవనోపాధిని వారు చూసుకుంటున్నారు. అవకాశం వస్తే మరో ఒకరిద్దరికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. అందుకనే వారికి తోడుగా నిలబడాలన్న ఆలోచన వచ్చింది. చేతివృత్తుల వారికీ పథకం వర్తిస్తోంది. రూ. 10వేల రుణంతో ఈ కార్యక్రమం మొదలైతే, క్రమం తప్పకుండా చెల్లించేవారికి మరుసటి ఏడాది వేయి పెంచమని, ఆ తర్వాత ఏడాది మరో వేయి పెంచమని, రూ.13వేల వరకూ ఇవ్వమని చెప్పాం. పాదయాత్రలో స్వయంగా నేను కళ్లారా చూశారు. చిరు వ్యాపారుల కష్టాలు చూశాను. వేయి రూపాయలు రోజుకు రుణం ఇస్తే.. వంద కట్‌ చేసుకుని, సాయంత్రానికి మళ్లీ వేయి రూపాయలు తీసుకునే పరిస్థితులు ఉండేవి. అలాంటి వారికి వ్యాపారాలు చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉండేది. పెట్టుబడి వారికి పుట్టేది కాదు. రూ. 10ల వడ్డీకి కూడా రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉండేవి. ఈ పరిస్థితులన్నీ మార్చాలన్న ఉద్దేశంతో జగనన్న తోడు పథకం పుట్టింది. జగనన్న తోడు ద్వారా లబ్ధిపొందిన వారిలో 80శాతం అక్క చెల్లెమ్మలే. లబ్ధిదారుల్లో 80 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన వారే ఉన్నారు. సామాజికంగా అట్టడుగున్న ఉన్న వారికి ఈ పథకం ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. ఎవరికైనా ఈ పథకం వర్తించని పరిస్థితి ఉంటే.. వెంటనే సచివాలయ వ్యవస్థను సంప్రదించండి. అక్కడున్న సిబ్బంది మీకు తోడుగా నిలుస్తారు. వాలంటీర్లను కోరినా.. వారు దరఖాస్తు చేయడంలో మీకు తోడుగా నిలుస్తారు. ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదు, ప్రతి ఒక్కరికీ మంచి జరగాలనే ప్రభుత్వం తపన పడుతోంది' అని వ్యాఖ్యానించారు.

టాప్ హెడ్ లైన్స్

Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
Thalliki Vandanam Cybercrime: తల్లికి వందనం పథకంలో సైబర్ మోసం.. 28 మంది అకౌంట్లలో నగదు మాయం, ట్విస్ట్ ఏంటంటే
తల్లికి వందనం పథకంలో సైబర్ మోసం.. 28 మంది అకౌంట్లలో నగదు మాయం, ట్విస్ట్ ఏంటంటే
Kadapa Crime News: యువతి విషయంలో వివాదం.. యువకుడిని హత్య చేసిన ఇద్దరు మైనర్లు.. కడప జిల్లా మైదుకూరులో దారుణం
యువతి విషయంలో వివాదం.. యువకుడిని హత్య చేసిన ఇద్దరు మైనర్లు.. కడప జిల్లా మైదుకూరులో దారుణం

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Police Complaint OTT : నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
CPR Full Form in Telugu: సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Gade Saikrishna Case: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
Embed widget