అన్వేషించండి

Kurnool News: కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

Kappatralla Uranium Digging | యురేనియం లభ్యత, పరిశోధన కోసం బోర్ల తవ్వకాల ప్రక్రియను ఆపివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

Andhra Pradesh News | కర్నూలు జిల్లా కప్పట్రాళ్లలో యురేనియం లభ్యత కోసం శోధించడానికి  చేపట్టిన తవ్వకాలను ఆపేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఇక మీదట ఈ అంశంపై ఎలాంటి ప్రక్రియ కొనసాగకూడదని  అధికారులకు ముఖ్యమంత్రి చెప్పినట్టు  కర్నూలు జిల్లా అధికారులు తెలిపారు. ప్రజలు ఎలాంటి  భయాందోళనలు చెందవద్దని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా స్పష్టత ఇచ్చారు.

 అసలేంటి వివాదం 

 కర్నూలు జిల్లా లోని కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్ లో  అత్యంత నాణ్యత గల యురేనియం ఉన్నట్టు కేంద్రం కనుగొనడంతో  ఆ ప్రాంతంలో యురేనియం తవ్వకాల కోసం రంగం సిద్ధం చేసింది. కోరుట్ల మయ్య మల గా పేరు పొందిన  ఈ అడవిలోని 468. 25 హెక్టార్ల విస్తీర్ణంలో  యరేనియం ఉన్నట్టు గుర్తించారు. అయితే దీనిపై  స్థానిక గ్రామాల ప్రజలకు  అవగాహన కల్పించే ప్రయత్నం మాత్రం చేయలేదు. ప్రధానంగా 13 గ్రామాలు మొత్తం కలిపి 25 గ్రామాల వరకు  యురేనియం తవ్వకాల వల్ల  దెబ్బతింటాయి అనేది  ప్రాథమిక అంచనా. అలాగే పర్యావరణం, నీరు, భూమి 50 కిలోమీటర్ల పరిధిలో కాలుష్యం బారిన పడతాయి అనేది  పర్యావరణ వేత్తల ఆందోళన. అకస్మాత్తుగా  వారం రోజుల క్రితం  యురేనియం భూమి అడుగున ఎంత లోతున ఉందో పరీక్షించడానికి 68 బోర్లను తవ్వే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. దీనితో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ  కప్పట్రాళ్ల సహా  ఆయా గ్రామాల ప్రజలు రోడ్డుపైకి వచ్చి కర్నూలు బళ్ళారి రహదారిని దిబ్బంధం చేశారు.

పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తత కు లోను కావడంతో కొన్ని రోజులుగా  అక్కడ ప్రజలతో అధికారులు,అధికార పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నారు. ప్రాణాలైనా ఇస్తాం కానీ  తమ ఊళ్లను వదిలి వెళ్ళేది లేదని కప్పట్రాళ్ల సహా  13 గ్రామాల ప్రజలు పోరాటం చేయడంతో  అక్కడ ఆ బోర్ల తవ్వకాలను నిలిపివేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

 తాత్కాలిక ఊరటేనా?

 అయితే యురేనియం తవ్వకాలు అనేది  కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం. కప్పట్రాళ్ల అడవిలోని యురేనియం చాలా శుద్ధమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల విద్యుత్, మెడికల్, డిఫెన్స్ రంగాల్లో  చాలా ప్రయోజనాలు ఉంటాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో  కేంద్రం  ఈ ప్రాంతంలో యురేనియం తవ్వకాల పిలిపివేతను  పూర్తిగా నిలిపివేస్తుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

టాప్ హెడ్ లైన్స్

YS Jagan On DSC: ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
AP Rains: ఏపీలో వర్ష బీభత్సానికి కొట్టుకుపోయిన వంతెన.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్!
ఏపీలో వర్ష బీభత్సానికి కొట్టుకుపోయిన వంతెన.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్!
Telangana News: తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. దసరా నుంచి చేయూత కొత్త పింఛన్లు పంపిణీకి నిర్ణయం
తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. దసరా నుంచి చేయూత కొత్త పింఛన్లు పంపిణీకి నిర్ణయం
Gannavaram MLA Yarlagadda: డబ్బులిస్తేనే పోలీసులు పనిచేస్తారా?.. కేసరపల్లి ఘటనపై ఎమ్మెల్యే యార్లగడ్డ ఫైర్
డబ్బులిస్తేనే పోలీసులు పనిచేస్తారా?.. కేసరపల్లి ఘటనపై ఎమ్మెల్యే యార్లగడ్డ ఫైర్

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan On DSC: ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
AP Rains: ఏపీలో వర్ష బీభత్సానికి కొట్టుకుపోయిన వంతెన.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్!
ఏపీలో వర్ష బీభత్సానికి కొట్టుకుపోయిన వంతెన.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్!
Telangana News: తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. దసరా నుంచి చేయూత కొత్త పింఛన్లు పంపిణీకి నిర్ణయం
తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. దసరా నుంచి చేయూత కొత్త పింఛన్లు పంపిణీకి నిర్ణయం
Gannavaram MLA Yarlagadda: డబ్బులిస్తేనే పోలీసులు పనిచేస్తారా?.. కేసరపల్లి ఘటనపై ఎమ్మెల్యే యార్లగడ్డ ఫైర్
డబ్బులిస్తేనే పోలీసులు పనిచేస్తారా?.. కేసరపల్లి ఘటనపై ఎమ్మెల్యే యార్లగడ్డ ఫైర్
BRICS Summit 2026: ఏడేళ్ల తర్వాత భారత్‌కు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, నేడు మోదీతో కీలక భేటీ
బ్రిక్స్ సమ్మిట్ 2026.. ఏడేళ్ల తర్వాత భారత్‌కు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, నేడు మోదీతో కీలక భేటీ
Shobha Shetty: రాఘవేంద్ర స్వామి సన్నిధిలో శోభా శెట్టి... మంత్రాలయంలో స్వామి దర్శనం
రాఘవేంద్ర స్వామి సన్నిధిలో శోభా శెట్టి... మంత్రాలయంలో స్వామి దర్శనం
Rithu Chowdary: తనూజ వెబ్ సిరీస్‌పై రీతూ చౌదరి కామెంట్స్... కళ్యాణ్ పాటపై ఏమన్నారంటే?
తనూజ వెబ్ సిరీస్‌పై రీతూ చౌదరి కామెంట్స్... కళ్యాణ్ పాటపై ఏమన్నారంటే?
Avengers End Game Advance Bookings : విశ్వాన్ని కాపాడే సూపర్ హీరోస్ - సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి అవెంజర్స్ ఎండ్ గేమ్... అడ్వాన్స్ బుకింగ్స్ షురూ
విశ్వాన్ని కాపాడే సూపర్ హీరోస్ - సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి అవెంజర్స్ ఎండ్ గేమ్... అడ్వాన్స్ బుకింగ్స్ షురూ
Embed widget