అన్వేషించండి

Kurnool News: కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

Kappatralla Uranium Digging | యురేనియం లభ్యత, పరిశోధన కోసం బోర్ల తవ్వకాల ప్రక్రియను ఆపివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

Andhra Pradesh News | కర్నూలు జిల్లా కప్పట్రాళ్లలో యురేనియం లభ్యత కోసం శోధించడానికి  చేపట్టిన తవ్వకాలను ఆపేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఇక మీదట ఈ అంశంపై ఎలాంటి ప్రక్రియ కొనసాగకూడదని  అధికారులకు ముఖ్యమంత్రి చెప్పినట్టు  కర్నూలు జిల్లా అధికారులు తెలిపారు. ప్రజలు ఎలాంటి  భయాందోళనలు చెందవద్దని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా స్పష్టత ఇచ్చారు.

 అసలేంటి వివాదం 

 కర్నూలు జిల్లా లోని కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్ లో  అత్యంత నాణ్యత గల యురేనియం ఉన్నట్టు కేంద్రం కనుగొనడంతో  ఆ ప్రాంతంలో యురేనియం తవ్వకాల కోసం రంగం సిద్ధం చేసింది. కోరుట్ల మయ్య మల గా పేరు పొందిన  ఈ అడవిలోని 468. 25 హెక్టార్ల విస్తీర్ణంలో  యరేనియం ఉన్నట్టు గుర్తించారు. అయితే దీనిపై  స్థానిక గ్రామాల ప్రజలకు  అవగాహన కల్పించే ప్రయత్నం మాత్రం చేయలేదు. ప్రధానంగా 13 గ్రామాలు మొత్తం కలిపి 25 గ్రామాల వరకు  యురేనియం తవ్వకాల వల్ల  దెబ్బతింటాయి అనేది  ప్రాథమిక అంచనా. అలాగే పర్యావరణం, నీరు, భూమి 50 కిలోమీటర్ల పరిధిలో కాలుష్యం బారిన పడతాయి అనేది  పర్యావరణ వేత్తల ఆందోళన. అకస్మాత్తుగా  వారం రోజుల క్రితం  యురేనియం భూమి అడుగున ఎంత లోతున ఉందో పరీక్షించడానికి 68 బోర్లను తవ్వే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. దీనితో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ  కప్పట్రాళ్ల సహా  ఆయా గ్రామాల ప్రజలు రోడ్డుపైకి వచ్చి కర్నూలు బళ్ళారి రహదారిని దిబ్బంధం చేశారు.

పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తత కు లోను కావడంతో కొన్ని రోజులుగా  అక్కడ ప్రజలతో అధికారులు,అధికార పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నారు. ప్రాణాలైనా ఇస్తాం కానీ  తమ ఊళ్లను వదిలి వెళ్ళేది లేదని కప్పట్రాళ్ల సహా  13 గ్రామాల ప్రజలు పోరాటం చేయడంతో  అక్కడ ఆ బోర్ల తవ్వకాలను నిలిపివేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

 తాత్కాలిక ఊరటేనా?

 అయితే యురేనియం తవ్వకాలు అనేది  కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం. కప్పట్రాళ్ల అడవిలోని యురేనియం చాలా శుద్ధమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల విద్యుత్, మెడికల్, డిఫెన్స్ రంగాల్లో  చాలా ప్రయోజనాలు ఉంటాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో  కేంద్రం  ఈ ప్రాంతంలో యురేనియం తవ్వకాల పిలిపివేతను  పూర్తిగా నిలిపివేస్తుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam News: వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam News: వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Embed widget