By: ABP Desam | Updated at : 17 Oct 2022 01:20 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సాక్షులకు ప్రాణ హాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్న సీబీఐ... నిందితుల్లో ఒకరైన గంగిరెడ్డి బెయిల్ రద్దు కోసం న్యాయపోరాటం చేస్తోంది. ఈ సందర్భంగా సంచలన ఆరోపణలు చేసింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుల్లో ఒకరైన ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టను ఆశ్రయించింది కేంద్ర దర్యాప్తు సంస్థ. విచారణ కీలక దశలో ఉన్న టైంలో గంగిరెడ్డి బెయిల్ను రద్దు చేయాలని రిక్వస్ట్ చేసింది. ఈ టైంలో గంగిరెడ్డి బెయిల్పై బయట ఉంటే... సాక్షుల ప్రాణాలకు ముప్పు ఉంటుందని వాదించింది. సాక్షులను రక్షించుకోవాలంటే మాత్రం కచ్చితంగా ఆయన బెయిల్ రద్దు చేయాలని కోర్టును వేడుకుంది.
గంగిరెడ్డి బెయిల్ రద్దు కోసం వాదించిన సందర్భంగా కేంద్ర దర్యాప్తు సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితులు, పోలీసులు కుమ్మక్కయ్యారని సంచలన కామెంట్స్ చేసింది. వీళ్లిద్దరు ఒక్కటై దర్యాప్తును ముందుకు జరక్కుండా చూస్తున్నారని ఆరోపించింది. వీటన్నంటినీ పరిగణలోకి తీసుకొని గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోర్టుకు ప్రాధేయ పడింది.
సీబీఐ వాదనలు విన్న సుప్రీంకోర్టు... గంగిరెడ్డికి నోటీసులు ఇచ్చింది. నెలరోజుల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. తదుపరి విచారణ నవంబరు 14కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
Breaking News Live Telugu Updates: యశోద హాస్పిటల్లో కేసీఆర్ను పరామర్శించిన చిన్న జీయర్ స్వామి
Chandra Babu Comments on Tickets: తెలంగాణ ఫలితాలతో చంద్రబాబు అలర్ట్ -అలాంటి వారికి డోర్స్ క్లోజ్
Anantapur Police Supended: ఇద్దరు సీఐలపై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ చేసిన డీఐజీ
APPMB: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 170 టీచింగ్ పోస్టులు, వాక్ఇన్ తేదీలు ఇలా
APPSC Group-1: ఏపీపీఎస్సీ 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా
Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క
Look Back 2023: భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్లో క్రేజీ సిక్సర్!
2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?
Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం
/body>