అన్వేషించండి

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే

Anantapur Road Accident | అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 8కి పెరిగింది. మంత్రి సవిత, జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.

అనంతపురం: కూలికి వెళ్ళందే పూట గడవని కూలీలు. రోజు లాగానే చేతిలో సద్ది పట్టుకొని కూలి పని కోసం సొంత ఊరికి నుంచి మరో ఊరికి ఆటోలో వెళ్లారు. అరటి తోటలో తమ కూలి పని ముగించుకుని తిరిగి ఆటోలో తమ సొంతూరు కి బయలుదేరారు కూలీలు. అంతలోనే బస్సు రూపంలో మృత్యువు ఆ కూలీలను కబలించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా మరో ఐదు మంది అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గార్లదిన్నె మండలం తలగసిన పల్లె సమీపంలో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి క్రాస్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఆటో అటుగా వస్తున్న లారీని బస్సు ఓవర్ టేక్ చేసే సమయంలో పక్కనే ఉన్న ఆటోను ఢీ కొట్టింది. దీంతో కూలి పని చేసి ఇంటికెళ్లి అలసట తీర్చుకోవాల్సిన కూలీలు శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. 

క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి సవిత, కలెక్టర్, ఎస్పీ

గార్లదిన్నె మండలం తలగాసిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై బస్సు ఆటో ఢీకొన్న ప్రమాద ఘటన చాలా బాధాకరమని మంత్రి సవిత విచారణ వ్యక్తం చేశారు.రాత్రి అనంతపురం నగరంలోని కిమ్స్ సవేరా ఆస్పత్రిలో గార్లదిన్నె మండలం తలగాసిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై బస్సు - ఆటో ఢీకొన్న ప్రమాద ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితుల కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. అనంతరం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని మార్చురీలో మృతదేహాలను మంత్రి పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సు లారీని ఓవర్టేక్ చేస్తూ ఆటోని ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో 8 మంది చనిపోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాదంలో చనిపోయిన ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లు తెలిపారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అప్రమత్తమై బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని, ప్రభుత్వం తరఫున ఆసుపత్రిలో ఐదు మందికి చికిత్స అందిస్తున్నామన్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకూడదని, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఆదేశాలిచ్చామన్నారు. ప్రమాదంలో ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడం బాధాకరం అన్నారు. క్షతగాత్రులకు ప్రభుత్వం తరఫున మెరుగైన చికిత్స అందిస్తున్నారు. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.

 మృతులు అందరికీ ఒకే గ్రామం కావడంతో తీవ్ర విషాదం 

ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందారు వారంతా పుట్లూరు మండలం ఎల్లుట్ల  గ్రామానికి చెందిన వారు కావటం ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అల్ముకున్నాయి. మృతులు అందరూ కూడా కూడా ఆ ఇంటికి పెద్దదిక్కుగా ఉన్నవారే వీరిలో భార్య భర్తలు కూడా ఉన్నారు. కూలి పనులకు వెళ్ళొస్తామని చెప్పి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారా అంటూ గ్రామంలో ఆర్తనాదాలు మిన్నంటాయి. మృతి చెందిన వారు రామాంజి నమ్మ, బాల పెద్దయ్య, నాగమ్మ, నాగన్న, జయరాం, కొండమ్మ, ఈశ్వరయ్య, డి నాగమ్మ. వీరిలో ఇద్దరు ప్రమాదం జరిగిన సంఘటన స్థలంలోనే మృతి చెందగా మిగిలిన ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఐదు మంది ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

 దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి 

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాద ఘటనలో 8 మంది మృతి చెందడం పై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే అమృతల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రి వద్దకు వెళ్లి వారి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని జిల్లా అధికారులకు మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. 

 ప్రమాదాలు అక్కడే ఎక్కువ ఎందుకు అవుతున్నాయి : 

బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రమాదాలు తరచూ జరుగుతూ ఉంటాయి అలా తరచూ ప్రమాదాలు జరిగే పాయింట్లు పోలీసులు గుర్తించి బ్లాక్ పాయింట్లుగా గుర్తిస్తారు. అక్కడ ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరిక బోర్డులు కూడా ప్రయాణికులకు కనిపించే విధంగా పెడతారు. అయినప్పటికీ గార్లదిన్నె మండలం తలకాశి పల్లె సమీపంలో ప్రమాదకరంగా మలుపు ఉందని ఇక్కడ నెల రోజుల కిందట ఒక ఐచర్ వాహనంలో కూలీలు వెళుతుండగా వెనకనుంచి ప్రైవేటు బస్సు ఢీకొని 13 మంది కూలీలు గాయపడ్డారు. ఈ ప్రమాదం సంఘటన స్థలం సమీపంలోనే గతంలో ఒక ఆయిల్ ట్యాంకర్ ఆర్టీసీ బస్సు కూడా ఢీకొన్నాయి. ఇలాంటి మలుపుల్లో జాతీయ రహదారి పక్కన సర్వీస్ రోడ్డు సరిగా లేకపోవడం మలుపులో వంతెనలు నిర్మించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాణాలు కోల్పోతున్నారని విమర్శ కూడా ఉంది. ఇలాంటి బ్లాక్ స్పాట్స్ పై ప్రభుత్వం ప్రత్యేక చొరవచూపి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని వాహన చోదకులు జాతీయ రహదారి సమీప గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు.

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Chandra Babu About Mega DSC 2025: మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Embed widget