అన్వేషించండి

AP News: అనంతపురంలో 63 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి - అనంత వెంకటరామిరెడ్డి

Anantapur News | ప్రకృతితో దగా పడ్డ రైతులు సీఎం చంద్రబాబు చేతుల్లోనూ దగా పడ్డారని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కోరారు.

Anantha Venkatarami Reddy | అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రైతాంగం ప్రకృతి చేతిలోనే కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల్లోనూ దగా పడ్డారని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. గతంలో వ్యవసాయం దండగ అని చెప్పిన చంద్రబాబు, ఆ తర్వాత తాను మారిన మనిషిని అని ప్రకటించుకున్నారని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు మారలేదని, రైతాంగాన్ని ఆదుకునే విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు.

వ్యవసాయాన్ని వదిలి పెట్టాల్సి వస్తోంది
టమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నాలుగు నెలల నుంచి రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికే వ్యవసాయం క్రమంగా తగ్గుతోందని, చంద్రబాబు నిర్వాకం వల్ల వ్యవసాయాన్ని వదిలిపెట్టే పరిస్థితి దాపురిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో పంటలు సాగు చేసిన ఉమ్మడి అనంతపురం జిల్లా రైతాంగం పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని తెలిపారు. ఖరీఫ్‌లో సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో పంటలన్నీ దెబ్బతిన్నాయన్నారు. ముంగారులో వేసిన రైతులు మాత్రమే పంటలను నిలుపుకున్నారని.. జూలైలో అసలు పంటలు వేయలేని పరిస్థితి వచ్చిందన్నారు. ఇలాంటి నేపథ్యంలోనే అనంతపురం జిల్లాలో 7 మండలాలు, సత్యసాయి జిల్లాలో 10 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకోవడం భావ్యం కాదన్నారు. తక్షణం ఉమ్మడి అనంతలోని 63 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలన్నారు. కరువు మండలాలుగా ప్రకటించడం వల్ల ఇన్‌పుట్‌ సబ్సిడీతో పాటు ఇతరత్రా ప్రయోజనాలు చేకూరుతాయన్నారు.

కేంద్ర బృందం కూడా పర్యటించి రైతులకు ఆర్థికంగా ఆదుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. కరువు మండలాల ప్రకటన విషయంలో ప్రభుత్వం తీసుకున్న ప్రామాణికాలు రైతులను దెబ్బతీసే విధంగా ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది జూలైతో పాటు ఆగస్టు 20వ తేదీ వరకు ఎక్కడా వర్షాలు కురవలేదన్నారు. ఆగస్టు చివర్లో వర్షాలు పడ్డాయని చెప్పారు. మొత్తంగా ఖరీఫ్‌ సీజన్‌ నాలుగు మాసాలు కలుపుకుని 35 శాతం అధిక వర్షపాతం నమోదైందని అన్నారు. ఇలాంటి తరుణంలో కేవలం 17 మండలాల్లో మాత్రమే కరువు ఉందని ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి కూడా ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించలేదని అన్నారు. ప్రభుత్వ చర్యల కారణంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 46 మండలాల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొందన్నారు.

Also Read: Andhra Pradesh: పులివెందుల ఎమ్మెల్యేను ఫేక్ జగన్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? టీడీపీ పోస్ట్ వైరల్

అనంత ప్రతినిధులు చొరవ తీసుకోవాలి

ఉమ్మడి అనంతకు చెందిన ముగ్గురు మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుని అన్ని మండలాలు కరువు మండలాలుగా ప్రకటన చేయించి రైతాంగాన్ని ఆదుకోవాలని అనంత వెంకటరామిరెడ్డి కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు పూర్తయిందని, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలను తెలుసుకోవాలన్నారు. చివరకు పశుగ్రాసం కూడా దక్కేలా లేదని తెలిపారు. సమస్యలపై ప్రతిపక్షాలు మాట్లాడితే విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. జిల్లాలో వేరుశనగ పంట మాత్రమే కాకుండా ఆముదం, పత్తి, మిర్చి ఇతరత్రా పంటలతో పాటు ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రజాప్రతినిధులంతా పునరాలోచన చేసుకుని రైతాంగాన్ని ఆదుకునేలా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలన్నారు.

Also Read: TDP: ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget