అన్వేషించండి

AP News: అనంతపురంలో 63 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి - అనంత వెంకటరామిరెడ్డి

Anantapur News | ప్రకృతితో దగా పడ్డ రైతులు సీఎం చంద్రబాబు చేతుల్లోనూ దగా పడ్డారని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కోరారు.

Anantha Venkatarami Reddy | అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రైతాంగం ప్రకృతి చేతిలోనే కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల్లోనూ దగా పడ్డారని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. గతంలో వ్యవసాయం దండగ అని చెప్పిన చంద్రబాబు, ఆ తర్వాత తాను మారిన మనిషిని అని ప్రకటించుకున్నారని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు మారలేదని, రైతాంగాన్ని ఆదుకునే విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు.

వ్యవసాయాన్ని వదిలి పెట్టాల్సి వస్తోంది
టమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నాలుగు నెలల నుంచి రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికే వ్యవసాయం క్రమంగా తగ్గుతోందని, చంద్రబాబు నిర్వాకం వల్ల వ్యవసాయాన్ని వదిలిపెట్టే పరిస్థితి దాపురిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో పంటలు సాగు చేసిన ఉమ్మడి అనంతపురం జిల్లా రైతాంగం పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని తెలిపారు. ఖరీఫ్‌లో సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో పంటలన్నీ దెబ్బతిన్నాయన్నారు. ముంగారులో వేసిన రైతులు మాత్రమే పంటలను నిలుపుకున్నారని.. జూలైలో అసలు పంటలు వేయలేని పరిస్థితి వచ్చిందన్నారు. ఇలాంటి నేపథ్యంలోనే అనంతపురం జిల్లాలో 7 మండలాలు, సత్యసాయి జిల్లాలో 10 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకోవడం భావ్యం కాదన్నారు. తక్షణం ఉమ్మడి అనంతలోని 63 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలన్నారు. కరువు మండలాలుగా ప్రకటించడం వల్ల ఇన్‌పుట్‌ సబ్సిడీతో పాటు ఇతరత్రా ప్రయోజనాలు చేకూరుతాయన్నారు.

కేంద్ర బృందం కూడా పర్యటించి రైతులకు ఆర్థికంగా ఆదుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. కరువు మండలాల ప్రకటన విషయంలో ప్రభుత్వం తీసుకున్న ప్రామాణికాలు రైతులను దెబ్బతీసే విధంగా ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది జూలైతో పాటు ఆగస్టు 20వ తేదీ వరకు ఎక్కడా వర్షాలు కురవలేదన్నారు. ఆగస్టు చివర్లో వర్షాలు పడ్డాయని చెప్పారు. మొత్తంగా ఖరీఫ్‌ సీజన్‌ నాలుగు మాసాలు కలుపుకుని 35 శాతం అధిక వర్షపాతం నమోదైందని అన్నారు. ఇలాంటి తరుణంలో కేవలం 17 మండలాల్లో మాత్రమే కరువు ఉందని ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి కూడా ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించలేదని అన్నారు. ప్రభుత్వ చర్యల కారణంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 46 మండలాల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొందన్నారు.

Also Read: Andhra Pradesh: పులివెందుల ఎమ్మెల్యేను ఫేక్ జగన్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? టీడీపీ పోస్ట్ వైరల్

అనంత ప్రతినిధులు చొరవ తీసుకోవాలి

ఉమ్మడి అనంతకు చెందిన ముగ్గురు మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుని అన్ని మండలాలు కరువు మండలాలుగా ప్రకటన చేయించి రైతాంగాన్ని ఆదుకోవాలని అనంత వెంకటరామిరెడ్డి కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు పూర్తయిందని, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలను తెలుసుకోవాలన్నారు. చివరకు పశుగ్రాసం కూడా దక్కేలా లేదని తెలిపారు. సమస్యలపై ప్రతిపక్షాలు మాట్లాడితే విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. జిల్లాలో వేరుశనగ పంట మాత్రమే కాకుండా ఆముదం, పత్తి, మిర్చి ఇతరత్రా పంటలతో పాటు ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రజాప్రతినిధులంతా పునరాలోచన చేసుకుని రైతాంగాన్ని ఆదుకునేలా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలన్నారు.

Also Read: TDP: ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Vijaya Sai Reddy New Political Party: కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Embed widget