అన్వేషించండి

Anantapuram: ప్రకృతి ప్రకోపానికి బలైన అనంత రైతులు

అనంతపురం జిల్లా రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.ప్రకృతి ప్రకోపానికి అనంత రైతులు బలైపోతున్నారు.

అనంతపురం రైతుల కష్టాలు వర్ణనాతీతం. ప్రకృతి ప్రకోపానికి బలైపోతున్నాడు. జిల్లాలో ఏ రైతు కూడా సంతోషంగా లేడు. వేరుశనగతో మొదలపెడితే...పప్పుశనగ, మిరప, పత్తి, ఉద్యానపంటలు ఇలా ఏ రైతును తీసుకున్న వారి బాధలు వింటే చలించిపోక తప్పదు. అధికారులు మాత్రం అంతా బాగుంది అన్నరిపోర్టులు ప్రభుత్వానికి పంపడంతోనే రైతులను తీవ్రంగా నాశనం చేస్తున్నారు. వేరుశనగ పంటను తీసుకొంటే నాలుగ లక్షల హెక్టార్లకుపైగా సాగు చేస్తే కేవలం పదివేల ఎకరాల్లో మాత్రమే పంట దెబ్బతింది అని ఈ క్రాప్ బుకింగ్‌లో నమోదు చేస్తారు. అంటే మిగిలిన పంట బాగుందా అంటే సమాధానం ఉండదు. వీటిని బట్టి అర్థం చేసుకోవచ్చు మిగిలిన రైతుల పరిస్థితి ఏవిధంగా ఉందో. 

పప్పు శనగ రైతుల పరిస్థితి అయితే మరింత దయనీయంగా మారింది. లక్షా ముప్పై ఎనిమిది వేల ఎకరాల పంటను సాగు చేయగా... ఒక్క ఎకరా కూడా పంట మిగిలింది లేదు. వేసింది వేసినట్లే పంట పోయింది. కొందరైతే రెండోసారి కూడా పంటను సాగు చేశారు. కానీ అదికూడా అలాగే పోయింది. ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా రైతుల దగ్గరకు వెళ్లి పరిస్థితి గురించి అడిగింది లేదు. ముఖ్యంగా రెండోసారి వర్షాలు , వరదలు రావడంతో మొదటిసారి పప్పుశనగను కోల్పోయిన రైతులకు ప్రభుత్వం మళ్ళీ పప్పుశగన విత్తనాలు అందిస్తోంది. అది కూడా సీజన్ అయిపోతున్న టైంలో ఏదో పెద్ద సహాయం చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తోందని రైతులు వాపోతున్నార.

జిల్లాలో నల్లరేగడి నేలలో సాగయ్యే పప్పుశనగ రైతులకు మళ్ళీ విత్తనాలు అందించడం ద్వారా పంటను సాగు చేయమని చెప్తుంది. కానీ పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు వచ్చే అవకాశాలు వుండవు. అందుకే అనంతపురం జిల్లా రైతులు ప్రకృతి పెట్టే విషమ పరీక్షలను తట్టుకోలేకపోతున్నారు.

మిరప రైతులది కూడా ఇదే పరిస్థితి. జిల్లాలో సాగయ్యే బ్యాడిగ మిర్చికి మంచి రేటు ఉంది. కానీ జిల్లాలో పంట మొత్తం పోయింది. ఉరవకొండ, తాడిపత్రి ప్రాంతాల్లో మిరప సాగు చేస్తారు. మొన్న కురిసిన వర్షాలకు పంట మొత్తం పోయింది. అందుకే జిల్లాలో విపక్షాలన్నీ పంట నష్ట పరిహారాన్ని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం నుంచి కానీ, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కానీ ఏమాత్రం స్పందించండం లేదు. కేవలం మేమున్నామని.. ధైర్యంగా ఉండమని చెప్తున్నారే కానీ ఎక్కడా ఇంత సహాయం చేస్తామని చెప్పడం లేదు. మరోవైపు వామపక్షాలు... ప్రతిపక్ష టిడిపి నేతలు క్షేత్రస్థాయిలో తిరుగుతూ రైతుల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నప్పటికి ఏమాత్రం చలనం లేదు.

వేరుశనగ, పప్పుశనగ రైతులకు ఎకరాకు ఇరవైఐదువేలు ఇవ్వాలని విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. గ్రౌండ్ లెవల్లో పరిస్థితులను అంచనా వేసి నష్టపోయన దానిలో కనీసం యాబై శాతమైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక్క వేరుశనగ పంటను సాగు చేసే సమయంలో ఒక్క బ్యాంక్‌ల నుంచే రైతులు నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారని, వాటన్నిటిని మాఫీ  చేయాలని పాదయాత్ర చేస్తున్న సీపీఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. గ్రామాల్లో దయనీయ పరిస్థితులు ఉన్నాయని, వాటిని చూస్తూ నడుస్తున్న తమకు రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులను తెలుస్తున్నాయని... ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

గ్రామంలో ఉన్న ఆర్బీకే సిబ్బంది ఏం చేస్తున్నారని... ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్లడంలో విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు సీపీఎం నేతలు. కేవలం అదికార పార్టీ నేతల ఒత్తిడి మేరకు వాస్తవాలు దాస్తున్నారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి  తీవ్రంగా నష్టపోయిన అనంతపురం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Vijayawada- Visakha High Speed Rail: విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
UTS మొబైల్ యాప్‌లో ట్రైన్ టికెట్ తీసుకుంటున్నారా.. యాప్ మూసేస్తున్న రైల్వే.. వాలెట్ లోని డబ్బులు ఏమవుతాయి..?
UTS మొబైల్ యాప్‌లో ట్రైన్ టికెట్ తీసుకుంటున్నారా.. యాప్ మూసేస్తున్న రైల్వే.. వాలెట్ లోని డబ్బులు ఏమవుతాయి..?

వీడియోలు

Ind vs Eng 2nd Semi Final Preview | ఫైనల్ కు కివీస్ పిలుస్తోంది..ప్రత్యర్థి ఎవరో తేలేది నేడే | ABP Desam
Dinesh karthik Counter on Pak Matches | మైఖేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ లకు డీకే మాస్ కౌంటర్ | ABP Desam
SA vs NZ Semis 1 Highlights | టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ కు దూసుకెళ్లిన న్యూజిలాండ్ | ABP Desam
South Africa ICC Bad Luck Continues | మరోసారి కప్పు లేకుండానే తిరుగుముఖం పట్టిన సౌతాఫ్రికా | ABP Desam
Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Eng 2nd Semi Final: సంజూ సెంచరీ మిస్.. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ రికార్డ్ స్కోరు.. ఇంగ్లాండ్‌కు బిగ్ టార్గెట్
సంజూ సెంచరీ మిస్.. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ రికార్డ్ స్కోరు.. ఇంగ్లాండ్‌కు బిగ్ టార్గెట్
Tolichawki building collapses : ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
Bengal governor resigns : బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
India Condoles Khamenei Death: ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
AP 10th Hall Tickets: ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
Operation Decapitation: ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్ నుండి బంకర్ బస్టర్ల వరకు.. ఖమేనీ అంతం వెనుక CIA, మోసాద్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!
ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్ నుండి బంకర్ బస్టర్ల వరకు.. ఖమేనీ అంతం వెనుక CIA, మోసాద్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!
Mrithyunjay OTT : మృత్యుంజయ్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మృత్యుంజయ్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Speaker chit chat: వైసీపీ సభ్యులు సభకు వస్తేనే మసాలా - జగన్ జీతం తీసుకోవడం లేదు - స్పీకర్ అయ్యన్న కీలక వ్యాఖ్యలు
వైసీపీ సభ్యులు సభకు వస్తేనే మసాలా - జగన్ జీతం తీసుకోవడం లేదు - స్పీకర్ అయ్యన్న కీలక వ్యాఖ్యలు
Embed widget