అన్వేషించండి

గ్యాస్‌ డెలవరీ బాయ్‌ రూ.30 అడిగితే ఏజెన్సీకి రూ. లక్ష జరిమానా- సిలిండర్‌పై అదనపు వసూలకు భారీ మూల్యం!

గ్యాస్ సిలిండర్ ఇచ్చే టైంలో వసూలు చేసే అదనపు రుసుంపై ఓ వ్యక్తి వినియోగదారుల ఫోరం ను ఆశ్రయించారు. విజయం సాధించారు.

గ్యాస్‌ సిలిండర్‌ ఇంటికి తీసుకొచ్చిన వ్యక్తి డబ్బులు అడగడం ఇప్పుడు కామన్‌గా మారిపోయింది. చాలా మంది దీన్ని పెద్దగా పట్టించుకోరు. మరికొందరు కాసేపు కోపం తెచ్చుకుంటారు. ఎందుకు ఇవ్వాలంటూ ఇంకొందరు వాగ్వాదానికి దిగుతారు. ఇలా ఎవరు ఎన్ని వాదనలు చేసినా సిలిండర్ తెచ్చిన వ్యక్తి మాత్రం తాను అడిగిన డబ్బులు తీసుకొనే వెళ్తాడు. 

అనంతపురం జిల్లాలో కూడా ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆయన కూడా సిలిండర్ తీసుకొచ్చే వ్యక్తితో గొడవ పడ్డాడు. తాను 30 రూపాయలు ఇవ్వనంటే ఇవ్వనంటూ తెగేసి చెప్పాడు. దీంతో డెలివరీ బాయ్‌ తాను తీసుకొచ్చిన సిలిండర్‌ను వెనక్కి తీసుకెళ్లిపోయాడు. ఈ ఘటనతో తిక్కరేగిన సదరు వినియోగదారు న్యాయపోరాటం చేశారు. అంతే లక్ష రూపాయలు జరిమానా విధించి కమిషన్. 

2019అక్టోబర్‌ 7న అనంతపురానికి చెందిన వ్యక్తి ఓ ఏజెన్సీలో హెచ్‌పీ గ్యాస్ బుక్ చేశారు. గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చిన డెలివరీ బాయ్ 30 రూపాయలు ఇవ్వాలని కోరాడు. దీనిపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. 30 రూపాయలు ఇవ్వడానికి వినియోగదారురు నిరాకరించడంతో సిలిండర్ డెలివరీ చేయకుండానే డెలివరీబాయ్ తిరిగి తీసుకెళ్లిపోయాడు. 

సిలిండర్ తిరిగి తీసుకెళ్లిపోవడంతో ఆగ్రహించిన వినియోగదారు పౌరసరఫరాల అధికారికి ఫిర్యాదు చేస్తే... వాళ్లు సీరియస్ అవ్వడంతో సిలిండర్‌ను ఏజెన్సీ వాళ్లు తీసుకొచ్చి ఇచ్చారు. 30 రూపాయలు అడుగుతున్నారని ఏజెన్సీకి చెబితే... సరఫరా ఖరర్చులు ఉంటాయని వాటనే అడుగుతారంటూ డెలివరీ బాయ్‌ను సమర్ధించారు. 

అక్కడితే ఈ వివాదం సద్దుమణింగిందని అంతా అనుకున్నారు. కానీ అక్కడే వివాదం మొదలైంది. 30 రూపాయలు ఇవ్వడానికి నిరాకరించిన వినియోగదారుడిని వేరే ఏజెన్సీకి బదిలీ చేస్తున్నట్టు గొడవ జరిగిన ఏజెన్సీ చెప్పింది. దీనిపై మండిపడ్డా వినియోగదారుడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అదే టైంలో అనంతపురం జిల్లా వినియోగదారుల ఫోరానికి కూడా ఫిర్యాదు చేశారు. 

తనకు జరిగిన అన్యాయంతోపాటు ఏజెన్సీ చేసిన నిర్వాకాన్ని తెలియజేశారు. తనకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వినియోగదారుడి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన వినియోగదారరుల ఫోరం... గ్యాస్ ఏజెన్సీకి, ఏపీ పౌర సరఫరాల సంస్థకు నోటీసులు ఇచ్చింది. విచారణలో భాగంగా తాను సదరు గ్యాస్ డెలవరీ బాయ్‌ను తొలగించామని ఏజెన్సీ వాదనలు వినిపించింది. అందుకే వివాదం ముగిసిందని తాము ఎలాంటి నష్టపరిహారం చెల్లించాల్సిన పని లేదని వాదించింది. బాధితుడు కూడా గట్టిగానే వాదనలు వినిపించారు. 30రూపాయల వివాదంపై ఏజెన్సీకి ఫిర్యాదు చేస్తే సమర్థించారని గుర్తు చేశారు. 

ఇలా ఇరు పక్షాల వాదనలు విన్న వినియోగదారుల ఫోరం ఏజెన్సీకి లక్ష రూపాయల జరిమానా విధించింది. బాధితుడికి చెల్లించాలని ఆదేశించింది. ఇది కచ్చితంగా సేవలలో జరిగిన లోపమని అందుకే లక్ష చెల్లించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ సభ్యులరాలు శ్రీలత తీర్పు చెప్పారు.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ATM Theft in Dharmavaram: ధర్మవరంలో ఏటీఎం మెషీన్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు.. ఇలా ఉన్నారేంట్రా బాబు!
ధర్మవరంలో ఏటీఎం మెషీన్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు.. ఇలా ఉన్నారేంట్రా బాబు!
Union Cabinet Decisions: ఏపీ, తెలంగాణ సహా 6 రాష్ట్రాల్లో 23,437 కోట్లతో 3 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం
ఏపీ, తెలంగాణ సహా 6 రాష్ట్రాల్లో 23,437 కోట్లతో 3 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం
Kadapa Crime News: భార్య లావుగా మారిందని పాలకోవాలో విషం కలిపి హత్య.. యూట్యూబ్‌లో వెతికి మరీ భర్త దారుణం
భార్య లావుగా మారిందని పాలకోవాలో విషం కలిపి హత్య.. యూట్యూబ్‌లో వెతికి మరీ భర్త దారుణం

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget