అన్వేషించండి

Anantapur Crime Report 2024: తగ్గిన పోక్సో కేసులు, పెరిగిన మర్డర్ కేసులు - రూ.19.16 కోట్ల విలువ చేసే ఫోన్లు రికవరీ

అనంతపురం జిల్లాలో ఈ ఏడాది హత్య, హత్యాయత్నం, కిడ్నాప్ కేసులు పెరగగా, పోక్సో కేసులు తగ్గాయి. భారీగా సెల్‌ఫోన్లు రికవరీ చేసి సంబంధిత వ్యక్తులకు అప్పగించినట్లు జిల్లా ఎస్పీ మీడియాకు తెలిపారు.

Anantapur Crime Roundup 2024:  అనంతపురం జిల్లాలో ఈ ఏడాది ఐ.పి.సి, సీఆర్పీసి, మిస్సింగు కేసులు తగ్గాయి. ఎన్నికల సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ విస్తృతం చేయడం వల్ల అక్రమ మద్యం, గ్యాంబ్లింగ్, ఇసుక అక్రమ రవాణ కేసులు అధికంగా నమోదు చేయడం వల్ల స్పెషల్ లోకల్ లాస్ కేసులు పాక్షికంగా పెరిగాయి. దేహ సంబంధిత నేరాలు 2023 సంవత్సరంలో హత్యలు, హత్యాయత్నాలు, కిడ్నాప్ కేసులు కలిపి 956 నమోదు కాగా.. 2024 లో 1051 నమోదయ్యాయి. 

ప్రాపర్టీ క్రైం రికవరీలో 51 శాతం పురోగతి : 
రాబరీ, పగలు మరియు రాత్రి దొంగతనాలు, సాధారణ దొంగతనాలు కలిపి జిల్లాలో ఈ ఏడాది 529 నమోదు చేయగా 289 కేసులను ఛేదించారు. నమోదు చేసిన కేసులలో రూ.7,31,69,765/- ప్రజలు సొమ్ము పోగొట్టుకోగా ఇందులో రూ.3,76,22,920/- రికవరీ చేశారు. 
 అనంతపురం నాల్గవ పట్టణం, కూడేరు, గార్లదిన్నె పోలీసు స్టేషన్ల పరిధిల్లో జరిగిన ఏటిఎం సెంటర్స్ లో దొంగతనాలను అనంత పోలీసులు ఛేదించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, పుటేజీలను విశ్లేషించడం లాంటి చర్యలతో హర్యాన, రాజస్టిన్ రాష్ట్రాలకు చెందిన ఐదుగురి అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు. సిసిఎస్ & రూరల్ పోలీసులు సంయుక్తంగా అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసి రూ. 22 లక్షలు విలువ చేసే 31 తులాల బంగారు రికవరీ చేశారు. 15 కేసులు ఛేదించారు. 

8 శాతం తగ్గిన ఫోక్సో కేసులు
మహిళలకు సంబంధించిన నేరాలు స్వల్పంగా పెరిగినా ఫోక్సో కేసులు మాత్రం 8 శాతం తగ్గాయి. మహిళా సంబందిత నేరాలు స్వల్పంగా పెరగడానికి తక్షణమే స్పందించి కేసులు కడుతున్నారు. వరకట్న వేధింపులు, గృహహింస కేసులు పెరగడం కూడా కారణమే.


Anantapur Crime Report 2024: తగ్గిన పోక్సో కేసులు, పెరిగిన మర్డర్ కేసులు - రూ.19.16 కోట్ల విలువ చేసే ఫోన్లు రికవరీ

వైట్ కాలర్ నేరాలు 25 శాతం తగ్గుదల 
చీటింగులు, నమ్మకద్రోహాలు, సైబర్ నేరాలు ఈ ఏడాది గత ఏడాదితో పోల్చితే 25 శాతం తగ్గాయి. గత ఏడాది 377 వైట్ కాలర్ నేరాలు జరుగగా... ఈ ఏడాది 283 జరిగాయి.

 లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారానికి తీవ్ర కృషి: 
లో కేసుల పరిష్కారానికి పోలీసులు తీవ్ర కృషి చేశారు. ఈ ఏడాది యు.ఐ. పి.టి మరియు పెట్టీ కేసులు 10,933 కేసులు పరిష్కారం అయ్యేలా విదులు నిర్వర్తించారు.

 బాధితులకు న్యాయం... నిందితులకు శిక్షలు 
ఈ ఏడాది వివిధ కేసుల్లోని నిందితులకు కఠిన కారాగార శిక్షలు పడ్డాయి. మొత్తం 77 కేసుల్లో శిక్షలు విధిస్తూ తీర్పు వెలువరించగా... వీటిల్లో రెండు జీవిత కాలాల శిక్ష 01, జీవితఖైదులు 11, పది సంవత్సరాల జైలు శిక్షలు-02, ఐదు సంవత్సరాల జైలు శిక్షలు-03, మూడు సంవత్సరాల జైలు శిక్షలు- 59 ఉన్నాయి.

 ఎన్ఫోర్స్మెంట్ వర్క్ : 
ఈ ఏడాది 15 NDPS కేసులు నమోదు చేసి 63 మందిని అరెస్టు చేశారు. రూ.4,70 లక్షల విలువ చేసే 60.955 కిలోల గంజాయి, 33 సెల్ ఫోన్లు, రూ 38 వేల నగదు సీజ్ చేశారు. గంజాయి కట్టడికి ప్రత్యేకంగా జిల్లాలో టాస్క్ ఫోర్స్ విభాగం ఏర్పాటు చేసి రంగంలోకి దింపారు. 1192 గ్యాంబ్లింగ్ కేసులు నమోదు చేసి 3,250 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. రూ. 1,98,37,629/- నగదు స్వాధీనం చేసుకున్నారు.

 రోడ్డు ప్రమాదాలు 
రోడ్డు ప్రమాదాల ఉల్లంఘనలపై ఓపెన్ డ్రింకింగ్ కేసులు 14,029... డ్రంకన్ డ్రైవ్ 2314 కేసులు మరియు 1,09,038 ఎం.వి కేసులు నమోదు చేసి రూ. 2,40,18,966/- ల ఫైన్లు వేశారు. వీటిల్లో 7595 కేసులు డిస్పోజల్ చేసి పైన్ మొత్తం రూ.19,15,875/- లు ఉల్లంఘనదారుల నుండీ కట్టించారు.

డయల్ - 100/112 కాల్స్ కు తక్షణ స్పందన

ఈ ఏడాది డయల్ 100/112 కు వచ్చిన కాల్స్  20,346 కు జిల్లా పోలీస్ సిబ్బంది నిర్ణీత సమయంలో ఘటనా స్థలాలకు వెళ్లి చర్యలు తీసుకున్నారు. ఆవరేజ్ రెస్పాన్స్ టైం 12 నిముషాలు, అర్బన్ ప్రాంతాలలో 6 నిముషాలు, రూరల్ ఏరియాలలో 18 నిముషాలు రెస్పాన్స్ టైంలో బాధితులకు పరిష్కారం చూపారు. వీటిల్లో 626 కేసులు కూడా నమోదు చేశారు. డయల్- 100, బ్లూకోల్ట్స్ బృందాలతో బాదిత ప్రజలు సకాలంలో ఊరట పొందారు. రక్షక్, హైవే పెట్రోలింగ్ బృందాలను వాడుతున్నారు.

Also Read: South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) : 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమానికి జిల్లాలో మంచి స్పందన లభించింది. మొత్తం 1579 పిటీషన్లు రాగా వీటిల్లో 1417 పిటీషన్లకు పరిష్కారం చూపారు. మిగితా 162 పిటీషన్లు ఆస్తి తగాదాలు, రస్తా వివాదాలు, తదితరాలకు సంబంధించినవి.

భారీగా సెల్ఫోన్స్  రికవరీ : 
ప్రజలు పోగొట్టుకున్న సెల్ ఫోన్లు దాట్ బాట్/ CEIR సేవల ద్వారా రూ.19.16 కోట్ల విలువ చేసే 10,501 మొబైల్ ఫోన్లను బాధిత ప్రజలకు అప్పగించారు. ఇందులో అనంతపురం జిల్లా ప్రజలకు 6,770.... ఇతర జిల్లాల ప్రజలకు 2,575... ఇతర రాష్ట్రాల ప్రజలకు 1,156 మొటైల్ పోన్లు అందజేశారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
Thalliki Vandanam Cybercrime: తల్లికి వందనం పథకంలో సైబర్ మోసం.. 28 మంది అకౌంట్లలో నగదు మాయం, ట్విస్ట్ ఏంటంటే
తల్లికి వందనం పథకంలో సైబర్ మోసం.. 28 మంది అకౌంట్లలో నగదు మాయం, ట్విస్ట్ ఏంటంటే
Kadapa Crime News: యువతి విషయంలో వివాదం.. యువకుడిని హత్య చేసిన ఇద్దరు మైనర్లు.. కడప జిల్లా మైదుకూరులో దారుణం
యువతి విషయంలో వివాదం.. యువకుడిని హత్య చేసిన ఇద్దరు మైనర్లు.. కడప జిల్లా మైదుకూరులో దారుణం
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget