By: ABP Desam | Updated at : 26 Jul 2022 07:42 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
కర్నూలులో ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్
Kurnool News : కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చక్కరాళ్ల గ్రామంలోని ప్రభుత్వం పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. మధ్యాహ్న భోజనంలో పెట్టిన గుడ్లు తిని 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఉడికీ ఉడకని బియ్యం, కుళ్లిన కోడిగుడ్లు
రాష్ట్ర ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పేరుతో విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటోందని కానీ కర్నూలు జిల్లాలో చాలా పాఠశాలలో విద్యార్థులకు పౌష్టికాహారం పెట్టకుండా ఉడికీ ఉడకని బియ్యం, కుళ్లిన కోడిగుడ్లు పెడుతున్నారని ఎస్ఎఫ్ఐ నేతలు ఆరోపించారు. పత్తికొండ మండలంలో చక్కరాళ్ల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చెడిపోయిన గుడ్లు పెట్టడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ఆరోపించారు. వారం రోజుల క్రితం కోడుమూరులో ఇలాంటి ఘటనే జరిగిందన్నారు. అయినా అధికారులు మాత్రం పట్టి పట్టినట్టు వ్యవహరిస్తున్నారన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత లేకుండా పోతుందని విమర్శించారు. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఫుడ్ ఇన్స్పెక్టర్లు, డీఈఓలు పాఠశాలలను తరచూ పరిశీలించాలని కోరుతున్నారు. కుళ్లిపోయిన గుడ్లు, ఉడికీ ఉడకని బియ్యం, పురుగులతో ఉన్న కూరగాయలు ఇలాంటివి పెట్టకుండా జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం చక్కరాళ్ల గ్రామంలోని పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో నాసిరకం కోడిగుడ్లను పెట్టడంతో 30 మందికి పైగా విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. (1/2) pic.twitter.com/ZUzUYDArRo
— Telugu Desam Party (@JaiTDP) July 26, 2022
బాధ్యులపై చర్యలకు టీడీపీ డిమాండ్
ఈ ఘటనపై టీడీపీ కూడా స్పందించింది. ఆ పార్టీ నాయకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చిక్కీలో పురుగులు
పత్తికొండ బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జగనన్న గోరుముద్ద కింద పంపిణీ చేసిన చిక్కీలలో పురుగులు ఉన్నట్లు విద్యార్థులు గుర్తించారు. చిక్కీలో పురుగులు చూసి విద్యార్థులు ఉపాధ్యాయులకు తెలియజేశారు. దీనిపై పాఠశాల హెడ్ మాస్టర్ స్పందించారు. కొన్ని చిక్కీలలో పురుగులు ఉన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆ చిక్కీలను బదులుగా వేరే చిక్కీలను విద్యార్థులకు ఇచ్చామన్నారు. అయితే డేట్ ఎక్స్పైర్ అయిన చిక్కీలు ఇస్తున్నారని, మధ్యాహ్నం భోజనంలో కూడా పురుగులు వస్తున్నాయని విద్యార్థులు అంటున్నారు.
Also Read : KA Paul : చంద్రబాబు ప్రధాని అయ్యేందుకు ఏపీని నాశనం చేశారు, కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
Breaking News Live Telugu Updates: గోరంట్ల మాధవ్ వ్యవహారంలో వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్ది కాదు: పోలీసులు
Varavararao Bail : వరవరరావుకు ఎట్టకేలకు ఊరట - శాశ్వత మెడికల్ బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు !
Krishna District: భార్యను అక్కడ కొరికిన భర్త, పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు
BJP Vishnu : కొద్ది సెకన్ల వీడియోతో దుష్చ్రచారం - జాతీయ జెండాను తిరగేసి పట్టుకున్న అంశంపై బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి క్లారిటీ !
Konaseema District: నిర్లక్ష్యంపై ప్రశ్నించినందుకు వాలంటీర్లపై సచివాలయ ఉద్యోగుల ప్రతాపం - కుర్చీలు తీయించి దారుణం !
Asia Cup, India's Predicted 11: పాక్ మ్యాచ్కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్ అంచనా నిజమవుతుందా?
SR Sekhar : నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు
Bihar New CM: టీమ్ మారింది, కానీ కెప్టెన్ ఆయనే- బిహార్ సీఎంగా 8వ సారి నితీశ్ కుమార్ ప్రమాణం!
Election For Congress Chief: కాంగ్రెస్ కార్యకర్తలకు గుడ్ న్యూస్- త్వరలోనే పార్టీకి కొత్త అధ్యక్షుడు!