అన్వేషించండి

Kurnool News : మధ్యాహ్న భోజనంలో కుళ్లిన కోడిగుడ్లు, 30 మంది విద్యార్థులకు అస్వస్థత!

Kurnool News : కర్నూలు జిల్లా చక్కరాళ్లలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసి 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Kurnool News : కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చక్కరాళ్ల  గ్రామంలోని ప్రభుత్వం పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. మధ్యాహ్న భోజనంలో పెట్టిన గుడ్లు తిని 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఉడికీ ఉడకని బియ్యం, కుళ్లిన కోడిగుడ్లు

రాష్ట్ర ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పేరుతో విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటోందని కానీ కర్నూలు జిల్లాలో చాలా పాఠశాలలో విద్యార్థులకు పౌష్టికాహారం పెట్టకుండా ఉడికీ ఉడకని బియ్యం, కుళ్లిన కోడిగుడ్లు పెడుతున్నారని ఎస్ఎఫ్ఐ నేతలు ఆరోపించారు. పత్తికొండ మండలంలో చక్కరాళ్ల  గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చెడిపోయిన గుడ్లు పెట్టడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ఆరోపించారు. వారం రోజుల క్రితం కోడుమూరులో ఇలాంటి ఘటనే జరిగిందన్నారు. అయినా అధికారులు మాత్రం పట్టి పట్టినట్టు వ్యవహరిస్తున్నారన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత లేకుండా పోతుందని విమర్శించారు. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఫుడ్ ఇన్స్పెక్టర్లు, డీఈఓలు పాఠశాలలను తరచూ పరిశీలించాలని కోరుతున్నారు. కుళ్లిపోయిన గుడ్లు, ఉడికీ ఉడకని బియ్యం, పురుగులతో ఉన్న కూరగాయలు ఇలాంటివి పెట్టకుండా జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

బాధ్యులపై చర్యలకు టీడీపీ డిమాండ్ 

ఈ ఘటనపై టీడీపీ కూడా స్పందించింది. ఆ పార్టీ నాయకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

చిక్కీలో పురుగులు 

పత్తికొండ బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జగనన్న గోరుముద్ద కింద పంపిణీ చేసిన చిక్కీలలో పురుగులు ఉన్నట్లు విద్యార్థులు గుర్తించారు. చిక్కీలో పురుగులు చూసి విద్యార్థులు ఉపాధ్యాయులకు తెలియజేశారు. దీనిపై పాఠశాల హెడ్ మాస్టర్ స్పందించారు. కొన్ని చిక్కీలలో పురుగులు ఉన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆ చిక్కీలను బదులుగా వేరే చిక్కీలను విద్యార్థులకు ఇచ్చామన్నారు. అయితే డేట్ ఎక్స్‌పైర్ అయిన చిక్కీలు ఇస్తున్నారని, మధ్యాహ్నం భోజనంలో కూడా పురుగులు వస్తున్నాయని విద్యార్థులు అంటున్నారు.  

Also Read : KA Paul : చంద్రబాబు ప్రధాని అయ్యేందుకు ఏపీని నాశనం చేశారు, కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

Also Read : No Special Status For AP : ప్యాకేజీ తీసుకుంటున్నారు.. ఇంకేం హోదా ? జీవీఎల్ ప్రశ్నతో మరోసారి కేంద్రం క్లారిటీ !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Vijaya ghee issue: విజయా నెయ్యిపై ఆగని దుమారం - లోకేష్‌కు గుత్తా అమిత్ మరో ఘాటు ట్వీట్
విజయా నెయ్యిపై ఆగని దుమారం - లోకేష్‌కు గుత్తా అమిత్ మరో ఘాటు ట్వీట్
Viral News:
"గుండెల నిండా దమ్ముతో ఎదురించాలి, జెండా ఎగరేయాలి" జనసేన ఆవిర్భావం రోజున ఓ బామ్మ కామెంట్స్ వైరల్‌!

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Embed widget