అన్వేషించండి

Kotamreddy Sridhar Reddy: ఒంటరిగా ప్రజల్లోకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి - లక్ష మందిని కలిసి ఏం చెప్పబోతున్నారంటే ?

Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లక్ష మందిని వ్యక్తిగతంగా కలిసేందుకు ప్రత్యేక కార్యక్రమం పెట్టుకున్నారు. ఒంటరిగా వెళ్లి ఒక్కొక్కరితో మాట్లాడనున్నారు.

 

Kotamreddy Sridhar Reddy:   నెల్లూరు రూరల్ టీడీపీ ఇంచార్జ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాజకీయాల్లో వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన ప్రజల్లోకి వెళ్లే విధానం భిన్నంగా ఉంటుంది. వైసీపీలో ఉన్నప్పటికీ ప్రభుత్వ తీరుపై వ్యతిరేకత వ్యక్తం చేయడంలో ఎప్పుడూ తగ్గలేదు. ప్రభుత్వాసుపత్రి సిబ్బందికి జీతాలు రావట్లేదని ధర్నా చేసినా.. డ్రైనేజీ పనులు చేయడం లేదని.. డ్రైనేజీలో కూర్చుని నిరసన తెలిపినా ఆయన ప్రత్యేకత ాయన చూపిస్తున్నారు. ఇప్పుడు విపక్ష పార్టీలోకి మారిపోయి.. వచ్చే ఎన్నికల కోసం వినూత్నంగా సిద్ధమవుతున్నారు. ఆయన ఇప్పుడు లక్ష మంది ప్రజలను నేరుగా కలిసి సమస్యలు వినేందుకు సిద్ధమయ్యారు.  ఒక్కడే ఒంటరిగా లక్ష మందితో మాటా మంతి పేరుతో  వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్‌నారు.  లక్ష మందిని కలిసి మాట మంతి ద్వారా సమస్యలు తెలుసుకొనున్నారు.              

ఈ నెల 25వ తేదీ నుంచి 33 రోజుల పాటు ‘ఒక్కడే.. ఒంటరిగా..’ పేరుతో కార్యక్రమం చేపట్టబోతున్నట్టు ప్రకటించారు.. ఇందులో భాగంగా లక్ష మంది ప్రజల్ని నేరుగా ముఖాముఖి కలసి వారితో మాట్లాడతానన్నారు. మీడియా కూడా లేకుండా కార్యక్రమం నిర్వహిస్తానని వెల్లడించారు కోటంరెడ్డి. ఎవరూ లేకుండా ఒంటరిగా వెళ్తేనే ప్రజలు తనతో ఎలాంటి ఇబ్బంది లేకుండా మాట్లాడతారని తెలిపారు. ప్రజాప్రతినిధిగా ప్రజల్లో ఉండడం నాకు ఇష్టం.. గత పదేళ్ల నుంచి ఎమ్మెల్యేగా ప్రజల కోసం పనిచేస్తున్నా.. ఇందులో భాగంగా ఈ నెల 25వ తేదీ నుంచి 33 రోజుల పాటు ‘ఒక్కడే.. ఒంటరిగా..’ పేరుతో కార్యక్రమం చేపట్టనున్నట్టు ప్రకటించారు.. ఇందులో భాగంగా లక్ష మందిని కలిసి చర్చిస్తా.. అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతా.. 25వ తేదీన ఉదయం నా సతీమణి సుజిత ఉప్పుటూరులో పెద్ద కుమార్తె హైందవి కోడూరు పాడు గ్రామం నుంచి.. చిన్న కూతురు వైష్ణవి.. దొంతాలి గ్రామం నుంచి.. ఇంటింటికీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలిపారు.            

గతంలో కూడా కోటంరెడ్డి ఇంటింటి ప్రచారాన్ని చేపట్టేవారు. ఎన్నికల టైమ్ లో నియోజకవర్గంలోని ప్రతి గడపకు వెళ్తున్నారు కోటంరెడ్డి . మీడియా  కూడా లేకుండా కార్యక్రమం నిర్వహిస్తాను అని వెల్లడించారు కోటంరెడ్డి.. గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి విజయం సాధించిన ఆయన.. ఆ తర్వాత వైసీపీకి గుడ్‌బై చెప్పి.. టీడీపీకి దగ్గరయ్యారు.    ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఆయనతో పాటు మరికొందరిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేటు వేశారు.                
 
ప్రజల్ని నేరుగా కలవడం కంటే ఓ నాయకుడికి పెద్ద ప్లస్ పాయింట్ ఉండదు. శ్రీధర్ రెడ్డి ఎప్పుడూ జనంలో ఉంటారు. ఆయన అగ్రెసివ్ గా ఉండే లీడర్. కానీ వైసీపీ అంతర్గత రాజకీయాల్లో నలిగిపోయారు. చివరికి నియోజకవర్గానికి వెళ్లవద్దన్న హెచ్చరికలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరికి టీడీపీలో చేరారు. ఆ తర్వాత ఆయన రాజకీయం మారిపోయింది. ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేసులు పెట్టినా తగ్గలేదు. టీడీపీ నేతలు కూడా కోటంరెడ్డిలా ప్రజల్లోకి వెళ్తే తిరుగు ఉండదన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వినిపిస్తోంది.                                      

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
Telangana: సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP DesamChahal Dhanashree Verma Divorce | చాహల్ ధనశ్రీకి విడాకులు మంజూరు చేసిన కోర్ట్ | ABP DesamVidya Veerappan Political Career | రాజకీయాల్లో వీరప్పన్ కూతురు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
Telangana: సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
APPSC: 'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Telangana Weather Update: తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు- అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు 
తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు- అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు 
Hari Hara Veera Mallu: పవన్ 'హరిహర వీరమల్లు' టీం నుంచి బిగ్ అప్ డేట్ - ఈ డేట్ మార్క్ చేసుకోండి అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా..
పవన్ 'హరిహర వీరమల్లు' టీం నుంచి బిగ్ అప్ డేట్ - ఈ డేట్ మార్క్ చేసుకోండి అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా..
Uttar Pradesh Crime News: భర్త మొండెంపైనే నిద్రపోయిన భార్య- తల తీసుకెళ్లిన ప్రియుడు- మీరట్ హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు
భర్త మొండెంపైనే నిద్రపోయిన భార్య- తల తీసుకెళ్లిన ప్రియుడు- మీరట్ హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు 
Embed widget