అన్వేషించండి

Kotamreddy Sridhar Reddy: ఒంటరిగా ప్రజల్లోకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి - లక్ష మందిని కలిసి ఏం చెప్పబోతున్నారంటే ?

Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లక్ష మందిని వ్యక్తిగతంగా కలిసేందుకు ప్రత్యేక కార్యక్రమం పెట్టుకున్నారు. ఒంటరిగా వెళ్లి ఒక్కొక్కరితో మాట్లాడనున్నారు.

 

Kotamreddy Sridhar Reddy:   నెల్లూరు రూరల్ టీడీపీ ఇంచార్జ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాజకీయాల్లో వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన ప్రజల్లోకి వెళ్లే విధానం భిన్నంగా ఉంటుంది. వైసీపీలో ఉన్నప్పటికీ ప్రభుత్వ తీరుపై వ్యతిరేకత వ్యక్తం చేయడంలో ఎప్పుడూ తగ్గలేదు. ప్రభుత్వాసుపత్రి సిబ్బందికి జీతాలు రావట్లేదని ధర్నా చేసినా.. డ్రైనేజీ పనులు చేయడం లేదని.. డ్రైనేజీలో కూర్చుని నిరసన తెలిపినా ఆయన ప్రత్యేకత ాయన చూపిస్తున్నారు. ఇప్పుడు విపక్ష పార్టీలోకి మారిపోయి.. వచ్చే ఎన్నికల కోసం వినూత్నంగా సిద్ధమవుతున్నారు. ఆయన ఇప్పుడు లక్ష మంది ప్రజలను నేరుగా కలిసి సమస్యలు వినేందుకు సిద్ధమయ్యారు.  ఒక్కడే ఒంటరిగా లక్ష మందితో మాటా మంతి పేరుతో  వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్‌నారు.  లక్ష మందిని కలిసి మాట మంతి ద్వారా సమస్యలు తెలుసుకొనున్నారు.              

ఈ నెల 25వ తేదీ నుంచి 33 రోజుల పాటు ‘ఒక్కడే.. ఒంటరిగా..’ పేరుతో కార్యక్రమం చేపట్టబోతున్నట్టు ప్రకటించారు.. ఇందులో భాగంగా లక్ష మంది ప్రజల్ని నేరుగా ముఖాముఖి కలసి వారితో మాట్లాడతానన్నారు. మీడియా కూడా లేకుండా కార్యక్రమం నిర్వహిస్తానని వెల్లడించారు కోటంరెడ్డి. ఎవరూ లేకుండా ఒంటరిగా వెళ్తేనే ప్రజలు తనతో ఎలాంటి ఇబ్బంది లేకుండా మాట్లాడతారని తెలిపారు. ప్రజాప్రతినిధిగా ప్రజల్లో ఉండడం నాకు ఇష్టం.. గత పదేళ్ల నుంచి ఎమ్మెల్యేగా ప్రజల కోసం పనిచేస్తున్నా.. ఇందులో భాగంగా ఈ నెల 25వ తేదీ నుంచి 33 రోజుల పాటు ‘ఒక్కడే.. ఒంటరిగా..’ పేరుతో కార్యక్రమం చేపట్టనున్నట్టు ప్రకటించారు.. ఇందులో భాగంగా లక్ష మందిని కలిసి చర్చిస్తా.. అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతా.. 25వ తేదీన ఉదయం నా సతీమణి సుజిత ఉప్పుటూరులో పెద్ద కుమార్తె హైందవి కోడూరు పాడు గ్రామం నుంచి.. చిన్న కూతురు వైష్ణవి.. దొంతాలి గ్రామం నుంచి.. ఇంటింటికీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలిపారు.            

గతంలో కూడా కోటంరెడ్డి ఇంటింటి ప్రచారాన్ని చేపట్టేవారు. ఎన్నికల టైమ్ లో నియోజకవర్గంలోని ప్రతి గడపకు వెళ్తున్నారు కోటంరెడ్డి . మీడియా  కూడా లేకుండా కార్యక్రమం నిర్వహిస్తాను అని వెల్లడించారు కోటంరెడ్డి.. గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి విజయం సాధించిన ఆయన.. ఆ తర్వాత వైసీపీకి గుడ్‌బై చెప్పి.. టీడీపీకి దగ్గరయ్యారు.    ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఆయనతో పాటు మరికొందరిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేటు వేశారు.                
 
ప్రజల్ని నేరుగా కలవడం కంటే ఓ నాయకుడికి పెద్ద ప్లస్ పాయింట్ ఉండదు. శ్రీధర్ రెడ్డి ఎప్పుడూ జనంలో ఉంటారు. ఆయన అగ్రెసివ్ గా ఉండే లీడర్. కానీ వైసీపీ అంతర్గత రాజకీయాల్లో నలిగిపోయారు. చివరికి నియోజకవర్గానికి వెళ్లవద్దన్న హెచ్చరికలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరికి టీడీపీలో చేరారు. ఆ తర్వాత ఆయన రాజకీయం మారిపోయింది. ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేసులు పెట్టినా తగ్గలేదు. టీడీపీ నేతలు కూడా కోటంరెడ్డిలా ప్రజల్లోకి వెళ్తే తిరుగు ఉండదన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వినిపిస్తోంది.                                      

 

టాప్ హెడ్ లైన్స్

Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
మోదీకి ఆగష్టు అగ్నిపరీక్ష, పెరగనున్న అమిత్ షా పాత్ర! యువత ఉద్యమం, పరీక్షల సంస్కరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు
మోదీకి ఆగష్టు అగ్నిపరీక్ష, పెరగనున్న అమిత్ షా పాత్ర! యువత ఉద్యమం, పరీక్షల సంస్కరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget