అన్వేషించండి

AP Liquor Scam: దుబాయ్, ముంబైకు సిట్ టీమ్స్ - ఏపీ లిక్కర్ స్కామ్‌లో వచ్చే వారం సంచలనాలు?

AP liquor scam: ఏపీ లిక్కర్ స్కాంలో వారం, పది రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. పది రోజుల్లో మరో నలుగురు నిందితుల్ని చేర్చి అదనపు చార్జిషీటు దాఖలు చేయనున్నారు.

AP liquor scam  take place new Turn in  ten days :  ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ను దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం దుబాయ్, ముంబైలకూ వెళ్లినట్లుగా తెలుస్తోంది. దుబాయ్ లో లిక్కర్ స్కామ్ నిందితులు షెల్టర్ తీసుకున్నారు. అదే సమయంలో అక్కడికి పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ చేసినట్లుగా గుర్తించారు. వాటి ఆధారాలతో పాటు అక్కడ నిందితులు ఏం చేస్తున్నారో పూర్తి సమాచారం తెలుసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ కు పాల్పడినట్లుగా గుర్తించారు. ఆ షెల్ కంపెనీల ఆచూకీ, డైరక్టర్ల వివరాలు.. వాటి  గురించి పూర్తి సమాచారం సేకరించేందుకు ఓ టీం ముంబై వెళ్లింది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల సహకారంతో మొత్తం నగదు చెలామణి గుట్టును సిట్ టీములు బయటకు లాగుతున్నాయి. 

మరో వైపు దర్యాప్తు కీలక దశకు చేరుకోవడంతో..  డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు..సిట్ దర్యాప్తు బృందం పురోగతిని వివరించింది. తాజాగా బయటపడిన ఆధారాలు.. ఇంకా సోదాలు చేయాల్సిన ప్రాంతాలతో పాటు..మరో పది రోజుల్లో దాఖలు చేయాల్సిన అదనపు చార్జిషీటు గురించి కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది. మరో నలుగురు పాత్ర బయటపడిందని.. వారిపై పక్కా ఆధారాలు ఉన్నాయని వారిని ఈ స్కామ్‌లో బలంగా చూపిస్తూ అదనపు చార్జిషీటు దాఖలుచేయాల్సిన అంశంపై చర్చించారు. ఈ అంశంలో ఎలాంటి చిన్న ఆధారాన్ని వదిలి పెట్టకుండా దర్యాప్తు చేయాలని.. సూత్రధారుల్ని కూడా అరెస్టు చేయాలని భావిస్తున్నారు. 

మరో పది రోజుల్లో దాఖలు చేయబోతున్న అదనపు చార్జిషీట్ లో ఉండబోయే నలుగురు కీలక వ్యక్తులు ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పేరు ఎక్కువగా ప్రచారంలోకి వస్తోంది. కారణం ఏదైనా లిక్కర్ స్కామ్ పై ఆయన ఎక్కువగా మాట్లాడటం లేదు. చాలా మంది వైసీపీ నేతలు జైలుకెళ్తున్నారు. వారిని జగన్ వెళ్లి పరామర్శిస్తున్నారు కానీ లిక్కర్ కేసులో అరెస్టు అయిన వారిని మాత్రం పరామర్శించేందుకు వెళ్లడం లేదు. తనకు అత్యంత సన్నిహితులు అయిన మిథున్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి లాంటి వాళ్లు అరెస్టు అయినా వారిని పరామర్శించేందుకు జగన్ వెళ్లకపోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 

ఈ లిక్కర్ కేసులో తన పేరు కూడా వినిపిస్తూండటం వల్లనే జగన్ వెళ్లడం లేదని చెబుతున్నారు. జగన్ అరెస్టు ప్రచారం కారమంగా ఇప్పటికే తన లీగల్ టీమ్ ను అప్రమత్తం చేసినట్లుగా తెలుస్తోంది. చార్జిషీటులో ఇప్పటికే తనపేరు ప్రస్తావించారు. కానీ ఇంకా నిందితుడిగా చేర్చలేదు. ఇలా నిందితుడిగా చేర్చిన వెంటనే ముందస్తు బెయిల్ పిటిషన్లు.. క్వాష్ పిటిషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. జగన్ ను నిందితుడిగా చేర్చినా అరెస్టు చేసే అవకాశాలు ఉండవు. ఇతర నిందితులకు.. అన్ని రకాల న్యాయపరమైన అవకాశాలు కల్పించినట్లే జగన్  కూడా సుప్రీంకోర్టు వరకూ వెళ్లే అవకాశాలు కల్పించిన తర్వాతనే అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొత్తంగా వచ్చే పది రోజుల్లో.. లిక్కర్ స్కామ్‌లో సంచలన పరిణామాలు ఉండబోతున్నాయని ఏపీలో గట్టిగా ప్రచారం జరుగుతోంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 1st T20: కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
Telangana Rising Summit: సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
Karthigai Deepam Row: ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం

వీడియోలు

Smriti In Nets After Wedding Cancellation | బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స్మృతి మంధాన
SKY about Sanju Samson as Opener | టీమ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన SKY
Gambhir about Team India Batting Order | గంభీర్ కొత్త స్టేట్మెంట్ అర్థం ఏంటి..?
Irfan Pathan Comments on Captain Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌
Irfan Pathan Comments on Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 1st T20: కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
Telangana Rising Summit: సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
Karthigai Deepam Row: ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
Pilot Rostering Issues: భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
IPL 2026 Auction :ఐపీఎల్ 2026 వేలం కోసం ఎంపికైన 350 మంది ఆటగాళ్ల వివరాలు ఇవే!
ఐపీఎల్ 2026 వేలం కోసం ఎంపికైన 350 మంది ఆటగాళ్ల వివరాలు ఇవే!
Dekhlenge Saala Song Promo: 'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
Satya Nadella: భారత్‌లో మైక్రోసాప్ట్ 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి -ప్రధాని మోదీతో భేటీ తర్వాత సత్యనాదెళ్ల ప్రకటన
భారత్‌లో మైక్రోసాప్ట్ 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి -ప్రధాని మోదీతో భేటీ తర్వాత సత్యనాదెళ్ల ప్రకటన
Embed widget