అన్వేషించండి

AP Liquor Scam: దుబాయ్, ముంబైకు సిట్ టీమ్స్ - ఏపీ లిక్కర్ స్కామ్‌లో వచ్చే వారం సంచలనాలు?

AP liquor scam: ఏపీ లిక్కర్ స్కాంలో వారం, పది రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. పది రోజుల్లో మరో నలుగురు నిందితుల్ని చేర్చి అదనపు చార్జిషీటు దాఖలు చేయనున్నారు.

AP liquor scam  take place new Turn in  ten days :  ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ను దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం దుబాయ్, ముంబైలకూ వెళ్లినట్లుగా తెలుస్తోంది. దుబాయ్ లో లిక్కర్ స్కామ్ నిందితులు షెల్టర్ తీసుకున్నారు. అదే సమయంలో అక్కడికి పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ చేసినట్లుగా గుర్తించారు. వాటి ఆధారాలతో పాటు అక్కడ నిందితులు ఏం చేస్తున్నారో పూర్తి సమాచారం తెలుసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ కు పాల్పడినట్లుగా గుర్తించారు. ఆ షెల్ కంపెనీల ఆచూకీ, డైరక్టర్ల వివరాలు.. వాటి  గురించి పూర్తి సమాచారం సేకరించేందుకు ఓ టీం ముంబై వెళ్లింది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల సహకారంతో మొత్తం నగదు చెలామణి గుట్టును సిట్ టీములు బయటకు లాగుతున్నాయి. 

మరో వైపు దర్యాప్తు కీలక దశకు చేరుకోవడంతో..  డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు..సిట్ దర్యాప్తు బృందం పురోగతిని వివరించింది. తాజాగా బయటపడిన ఆధారాలు.. ఇంకా సోదాలు చేయాల్సిన ప్రాంతాలతో పాటు..మరో పది రోజుల్లో దాఖలు చేయాల్సిన అదనపు చార్జిషీటు గురించి కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది. మరో నలుగురు పాత్ర బయటపడిందని.. వారిపై పక్కా ఆధారాలు ఉన్నాయని వారిని ఈ స్కామ్‌లో బలంగా చూపిస్తూ అదనపు చార్జిషీటు దాఖలుచేయాల్సిన అంశంపై చర్చించారు. ఈ అంశంలో ఎలాంటి చిన్న ఆధారాన్ని వదిలి పెట్టకుండా దర్యాప్తు చేయాలని.. సూత్రధారుల్ని కూడా అరెస్టు చేయాలని భావిస్తున్నారు. 

మరో పది రోజుల్లో దాఖలు చేయబోతున్న అదనపు చార్జిషీట్ లో ఉండబోయే నలుగురు కీలక వ్యక్తులు ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పేరు ఎక్కువగా ప్రచారంలోకి వస్తోంది. కారణం ఏదైనా లిక్కర్ స్కామ్ పై ఆయన ఎక్కువగా మాట్లాడటం లేదు. చాలా మంది వైసీపీ నేతలు జైలుకెళ్తున్నారు. వారిని జగన్ వెళ్లి పరామర్శిస్తున్నారు కానీ లిక్కర్ కేసులో అరెస్టు అయిన వారిని మాత్రం పరామర్శించేందుకు వెళ్లడం లేదు. తనకు అత్యంత సన్నిహితులు అయిన మిథున్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి లాంటి వాళ్లు అరెస్టు అయినా వారిని పరామర్శించేందుకు జగన్ వెళ్లకపోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 

ఈ లిక్కర్ కేసులో తన పేరు కూడా వినిపిస్తూండటం వల్లనే జగన్ వెళ్లడం లేదని చెబుతున్నారు. జగన్ అరెస్టు ప్రచారం కారమంగా ఇప్పటికే తన లీగల్ టీమ్ ను అప్రమత్తం చేసినట్లుగా తెలుస్తోంది. చార్జిషీటులో ఇప్పటికే తనపేరు ప్రస్తావించారు. కానీ ఇంకా నిందితుడిగా చేర్చలేదు. ఇలా నిందితుడిగా చేర్చిన వెంటనే ముందస్తు బెయిల్ పిటిషన్లు.. క్వాష్ పిటిషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. జగన్ ను నిందితుడిగా చేర్చినా అరెస్టు చేసే అవకాశాలు ఉండవు. ఇతర నిందితులకు.. అన్ని రకాల న్యాయపరమైన అవకాశాలు కల్పించినట్లే జగన్  కూడా సుప్రీంకోర్టు వరకూ వెళ్లే అవకాశాలు కల్పించిన తర్వాతనే అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొత్తంగా వచ్చే పది రోజుల్లో.. లిక్కర్ స్కామ్‌లో సంచలన పరిణామాలు ఉండబోతున్నాయని ఏపీలో గట్టిగా ప్రచారం జరుగుతోంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Embed widget