అన్వేషించండి

Kasu Mahesh Reddy Controversial Comments: అధికారంలోకి వచ్చాక ప్రతీకారం ఫస్ట్ - ప్రజలు నెక్ట్స్ - కాసు మహేష్ రెడ్డి వ్యాఖ్యలతో దుమారం !

Kasu Mahesh Reddy Revenge First: అధికారంలోకి వచ్చాక మొదట పగ సాధిస్తాం..తర్వాతే అభివృద్ధి అంటూ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.

 Palnadu Politics Gurazala:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పల్నాడు ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర, శైలి ఉన్నాయి. అక్కడ సాగే ఫ్యాక్షన్, రాజకీయ సవాళ్లు ఎప్పుడూ కాకరేపుతుంటాయి. అయితే, తాజాగా గురజాల నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో దావానలంలా వ్యాపించాయి. పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు ప్రజాస్వామ్య విలువలను, రాజకీయ నైతికతను ప్రశ్నించేలా ఉన్నాయంటూ నెటిజన్లు, విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.                      

 కాసు మహేష్ రెడ్డి ఏమన్నారంటే.. "మనం మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మొదట అభివృద్ధి గురించి ఆలోచించం. మనల్ని ఇబ్బంది పెట్టిన వారిపై, మన కార్యకర్తలను వేధించిన వారిపై పగ సాధిస్తాం, ప్రతీకారం తీర్చుకుంటాం. ఆ తర్వాతే ఏ అభివృద్ధైనా, పనైనా చూసుకుంటాం" అంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. కార్యకర్తల్లో జోష్ నింపేందుకు ఆయన ఈ తరహా ‘ఫ్యాక్షన్’ డైలాగులు చెప్పినప్పటికీ, ఒక బాధ్యతాయుతమైన మాజీ ప్రజాప్రతినిధి నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం రాజకీయ వర్గాలను సైతం ముక్కున వేలేసుకునేలా చేసింది.      


ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కూటమి నేతలు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఈ వీడియోను విస్తృతంగా షేర్ చేస్తూ..   ఐదేళ్ల వైఎస్సార్సీపీ వినాశకర పాలనలో రాష్ట్రం ఎందుకు వెనకబడిందో చెప్పడానికి కాసు మహేష్ రెడ్డి మాటలే ప్రత్యక్ష సాక్ష్యం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంలోకి వస్తే ప్రజలకు సేవ చేయాలి, ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనే ఆలోచన కాకుండా, కేవలం ప్రత్యర్థులపై కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం వారి రాక్షస మనస్తత్వానికి  అద్దం పడుతోందని మండిపడుతున్నారు.   

 ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో పల్నాడు వ్యాప్తంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, వేధింపుల కారణంగా .. నైరాశ్యంలో ఉన్న క్యాడర్‌లో ధైర్యం నింపడానికే ఆయన అలా మాట్లాడాల్సి వచ్చిందని, దాన్ని ప్రతిపక్షాలు కావాలనే వక్రీకరిస్తున్నాయని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఒక వైపు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురదజల్లుతున్నారంటూ తాడేపల్లిలో ప్రెస్ మీట్లు పెడుతుంటే.. క్షేత్రస్థాయిలో ఇలాంటి 'పగ, ప్రతీకారం' వ్యాఖ్యలు చేయడం పార్టీ ఇమేజ్‌ను మరింత పాతాళానికి నెడుతోందని  భావిస్తున్నారు.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: లార్డ్స్ వన్డేలో చెలరేగిన ఇంగ్లాండ్ బ్యాటర్లు.. భారత్ మీద రికార్డు స్కోరు
లార్డ్స్ వన్డేలో చెలరేగిన ఇంగ్లాండ్ బ్యాటర్లు.. భారత్ మీద రికార్డు స్కోరు
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
AP Local Body Elections: కూటమిలో జనసేన కుంపటి! వైసీపీ ట్రాప్‌లో పడొద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
కూటమిలో జనసేన కుంపటి! వైసీపీ ట్రాప్‌లో పడొద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
Visakha Road Accident: విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
Advertisement

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ENG Record Score VS IND In 3rd ODI: లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
CM Revanth Reddy: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Visakha Road Accident: విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
Embed widget