By: ABP Desam | Updated at : 18 May 2022 09:36 AM (IST)
Edited By: Satyaprasad Bandaru
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
Chandrababu Tour : టీడీపీ అధినేత చంద్రబాబు మూడు రోజులపాటు రాయలసీమ జిల్లాల్లో పర్యటించున్నారు. టీడీపీ చేపట్టిన 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో నేడు(18వ తేదీ) కడప జిల్లాలోని కమలాపురంలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో జిల్లా స్థాయి నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాల నేతలు, కార్యకర్తలు పాల్గొనున్నారు. సాయంత్రం కమలాపురంలో 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో పాల్గొనున్న చంద్రబాబు అనంతరం బహిరంగసభలో ప్రసంగించనున్నారు.
చంద్రబాబు రాయలసీమ టూర్
ఈ నెల 19న నంద్యాల జిల్లాలోని డోన్ లో చంద్రబాబు పర్యటించనున్నారు. 20న సత్యసాయి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయా జిల్లాల్లో ఉదయం కార్యకర్తలు, ముఖ్య నేతల సమావేశంలో పాల్గొంటారు. మహానాడు లోపు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను చుట్టేలా చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.
పర్యటనలు షురూ
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీ కేడర్లో ఉత్సాహం నింపేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. బాదుడే బాదుడు కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొంటూ వైసీపీ సర్కార్ పై విరుచుకుపడుతున్నారు. ఉత్తరాంధ్ర, కుప్పంలో పర్యటించిన ఆయన ఈసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లాను టార్గెట్ చేశారు. చంద్రబాబు రాయలసీమ జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది.
ఇవాళ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం, రేపు నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం, 20న అనంతపురం జిల్లా పెనుకొండలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నియోజకవర్గాల్లో బాదుడే బాదుడు కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొంటారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సొంత నియోజకవర్గం డోన్ లో చంద్రబాబు పర్యటించనున్నారు. ఉత్తరాంధ్ర, కుప్పంలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన రావడంతో రాయలసీమ జిల్లాల్లో నిర్వహణకు టీడీపీ సిద్ధమైంది. రాయలసీమ తర్వాత కోస్తా జిల్లాల్లో చంద్రబాబు టూర్ కు టీడీపీ ప్లాన్ చేస్తోంది. అయితే అధికార వైసీపీ "గడప గడపకు మన ప్రభుత్వం" అంటూ పర్యటనలు చేస్తుంది. టీడీపీ బాదుడే బాదుడు అంటూ జనాల్లోకి వెళ్తోంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ టూర్ మొదలయ్యాయి. పవన్ కల్యాణ్ కూడా కౌలు రైతు భరోసా యాత్ర చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉన్నా వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ పర్యటనలు స్టార్ట్ చేశాయి. అలాగే పొత్తుల రాజకీయాలు చేస్తున్నాయి.
మహానాడు తేదీలు ఖరారు
తెలుగుదేశం పార్టీ మహానాడు తేదీలు ఖరారు చేశారు. ఈ నెల 27, 28 తేదీల్లో ఒంగోలులో టీడీపీ మహానాడు నిర్వహించనున్నారు. మహానాడు నిర్వహణకు 80 ఎకరాల స్థలాన్ని టీడీపీ శ్రేణులు ఎంపిక చేశాయి. ఒంగోలు శివారు మండవవారిపాలెంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. మహానాడు పనులకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు భూమిపూజ చేయనున్నారు. బుధవారం ఉదయం 11.11 నుంచి 11.20 గంటల మధ్య భూమిపూజ చేయనున్నారు. భూమిపూజ చేసిన అనంతరం మహానాడు పనులు ప్రారంభంకానున్నాయి.
AP Schools: ప్రభుత్వ పాఠశాలల విలీనంపై ప్రజల ఆగ్రహం- చిత్తూరు, అనంత జిల్లాల్లో అధికారులను నిలదీస్తున్న జనం
Pegasus House Committee : గత ప్రభుత్వంలో డేటా చోరీ జరిగింది - నివేదికను అసెంబ్లీకిస్తామన్న భూమన !
Breaking News Live Telugu Updates: ఐదో టెస్టు మ్యాచ్లో ఇంగ్లండ్ విజయం
Case On Raghurama : ఏపీ ఇంటలిజెన్స్ పోలీసుపై దాడి - రఘురామపై హైదరాబాద్లో కేసు !
APPSC Group 1- 2018: గ్రూప్-1 పరీక్షా ఫలితాలు విడుదల- నాలుగేళ్ల నిరీక్షణకు తెర
Twitter Moves Court : ప్రభుత్వం చెప్పినట్లు చేయలేం - కర్ణాటక హైకోర్టులో ట్విట్టర్ పిటిషన్ !
IND vs ENG 5th Test: బాజ్ బాలా? అదేంటో తెలియదంటున్న రాహుల్ ద్రవిడ్
Shaitan Web Series: ఓటీటీ కోసం 'యాత్ర' దర్శకుడి వెబ్ సిరీస్ - 'సైతాన్'
Cat Owners Benefits: పిల్లులను పెంచితే ‘బెడ్ రూమ్’లో రెచ్చిపోతారట, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!