అన్వేషించండి

Rajampeta Mla House Attack: రాజంపేట ఎమ్మెల్యే ఇంటిపై దాడి, వాహనంతో గేటును ఢీకొట్టిన దుండగులు

రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి ఇంటిపై దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తుల వాహనంతో ఎమ్మెల్యే ఇంటి గేటును ఢీకొట్టి, కట్టెలు, టైర్లు వేసి తగలబెట్టేందుకు ప్రయత్నించారు.

కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి(Mla Mallikarjuna Reddy) ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. మంగళవారం రాత్రి వాహనంతో ఎమ్మెల్యే(Mla) ఇంటి మెయిన్ గేట్ ఢీకొట్టి, టైర్లు, కట్టెలు గేటు ముందు వేసి తగలబెట్టడానికి యత్నించారు. ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి ఇంటిలో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దుండగలు దుశ్చర్యతో వాచ్ మెన్ కుటుంబం భయాందోళనకు గురైంది. వాచ్ మెన్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు(Police) సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన దుండగలు అక్కడి నుంచి పరారయ్యారు.  ఈ ఘటన గురించి తెలుసుకున్న వైసీపీ నాయకులు(Ysrcp Leaders), కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. దుండగుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. గతంలో కూడా ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి ఇంటి వద్ద గుర్తుతెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా(Annamayya District) కేంద్రంగా రాజంపేట(Rajampeta)ను ప్రకటించాలని కోరుతూ గత కొద్దిరోజులుగా నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మేడా ఇంటిపై దాడి సంచలనం సృష్టిస్తుంది. 

Rajampeta Mla House Attack: రాజంపేట ఎమ్మెల్యే ఇంటిపై దాడి, వాహనంతో గేటును ఢీకొట్టిన దుండగులు

రాజంపేట వర్సెస్ రాయచోటి

కొత్త జిల్లాల అంశం కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party)లో ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తోంది. రాజంపేట ఎమ్మెల్యే, రాయచోటి ఎమ్మెల్యే(Rayachoti Mla)  మధ్య విభేదాలకు కారణం అవుతోంది. రెండు చోట్ల వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు, నేతలు తమ ప్రాంతానికి మ్దదతుగా రోడ్డు మీదకు వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వివాదానికంతటికి కారణం కడప జిల్లాను విభజించి కొత్తగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేశారు. అయితే జిల్లా కేంద్రం(Districti Headquarter)గా రాయచోటిని నిర్ణయించారు. ఇది రాజంపేట వాసుల్ని తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. అన్నమ్మయ్య జిల్లా కేంద్రంగా రాజంపేట కావాలని కోరుతూ జిల్లా కలెక్టర్ విజయరామరాజును కలిసి ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వినతి పత్రం అందించారు. ఈ మధ్య జరిగిన పరిణామాలు చాలా బాధించాయని మేడా మల్లికార్జున రెడ్డి అన్నారు.  గతంలో సీఎం జగన్(CM Jagan) రాజంపేటను జిల్లాగా చేస్తామని హామీ ఇచ్చారన్నారు.  వైసీపీ విధానం ప్రకారం పార్లమెంట్ నియోజకవర్గాలను జిల్లా కేంద్రం చేయాలి. రాజంపేట పార్లమెంట్ కేంద్రం అయినప్పటికీ రాయచోటిని జిల్లా కేంద్రం చేశారు. గతంలో హామీ ఇచ్చిన సీఎం జగన్ అన్నమయ్య జిల్లాగా రాయచోటిని చేయడం బాధాకరమని ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

ఇప్పటికే ఈ విషయాన్ని  సీఎం దృష్టికి సమస్యను తీసుకెళ్లామని ఎమ్మెల్యే మేడా గతంలో తెలిపారు. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గానికి(Parliament Constituency) కు ఒక ప్రత్యేకత ఉందన్నారు.  ఇలాంటి నిర్ణయం తీసుకోడానికి వెనుక  పరిణామాలు ఏమి జరిగాయి అన్నది తెలియదన్నారు. రాజంపేటకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నా కూడా ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. అన్నమయ్య(Annamayya) జన్మస్థలం రాజంపేట అని.. బ్రిటిష్ కాలం నాటి నుంచి రాజంపేటకు ప్రత్యేకత ఉందని ఎమ్మెల్యే తెలిపారు. రాయచోటి జిల్లాగా చేస్తూ తాళ్ళపాక అన్నమయ్య పేరును పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
KCR Bus Yatra :  పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం  సిద్ధం
పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Allari Naresh on Aa okkati Adakku | మళ్లీ కామెడీ సినిమాలు చేయటంపై అల్లరి నరేష్ | ABP DesamDuvvada Srinivas Interview | టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఇంటర్వ్యూ | ABPHyderabad 16Cars Fire Accident | హైదరాబాద్ యూసుఫ్ గూడలో అగ్నికి ఆహుతైపోయిన 16కార్లు | ABP DesamPawan kalyan Touches feet of Pastor | పిఠాపురంలో మహిళా పాస్టర్ కాళ్లు మొక్కిన పవన్ కళ్యాణ్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
KCR Bus Yatra :  పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం  సిద్ధం
పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం
Pemmasani Chandra Sekhar: ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
Duvvada Vani: టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
Malaysia: గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
Bridge Collapsed: మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
Embed widget