Hyderabad common capital Issue : ఉమ్మడి రాజదాని కోసం జేడీ లక్ష్మినారాయణ పోరాటం - పట్టించుకోని ఇతర ఏపీ పార్టీలు !
Andhra News : హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కోసం జేడీ లక్ష్మినారాయణ పదే పదే డిమాండ్ చేస్తున్నారు. అయితే ఏపీ నుంచి ఆయన ఒక్కరే ఈ డిమాండ్ చేస్తున్నారు. ఇతర పార్టీల్ని తనతో పాటు డిమాండ్ చేయాలని కోరుతున్నారు.

Hyderabad common capital News : జూన్ రెండో తేదీతో విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే హోదాను కోల్పోతుంది. పూర్తి స్థాయిలో తెలంగాణకు రాజధానిగా మారుతుంది. అయితే మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా చూడాలని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మినారాయణ డిమాండ్ చేస్తున్నారు. సమయం ముంచుకొస్తున్నందున అందరూ స్పందించాలని కోరుతున్నారు. హైదరాబాద్ ను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా పదేళ్లకు మించి కొనసాగించాలనే అంశాన్ని ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు వెంటనే లేవనెత్తాలని పిలుపునిచ్చారు. ఇదే అంశంపై లక్ష్మీనారాయణ కొన్ని రోజుల కిందట కూడా స్పందించారు. ఏపీకి ఇంత వరకు రాజధాని ఏర్పడనందున, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మరో పదేళ్లు పొడిగిస్తూ భారత రాష్ట్రపతి ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరారు.
APలోని అన్ని రాజకీయ పార్టీలు తక్షణమే హైదరాబాద్ను తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ల ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలనే అంశాన్ని లేవనెత్తాలి. (ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సె.5, 2014) @ncbn @ysjagan @PawanKalyan @PurandeswariBJP @realyssharmila
— V. V. Lakshmi Narayana , A+ (JD) (@VVL_Official) May 31, 2024
అయితే ఉమ్మడి రాజధాని కొనసాగింప అంశంపై ఏపీలో మరి ఏ ఇతర రాజకీయ పార్టీ కూడా స్పందించడం లేదు. ప్రధన పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేన ఈ విషయంలో మౌనంగా ఉంటున్నాయి. గతంలో వైసీపీకి చెందిన కొంత మంది నేతలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాలన్న ప్రస్తావన తెచ్చారు. తర్వాత మళ్లీ మాట్లాడలేదు. ఇప్పుడు అసలు పట్టించుకోవడం లేదు. తెలుగుదేశం, జనసేన నేతలు అసలు ఈ టాపిక్ పై ఆసక్తి లేనట్లుగా ఉన్నారు.
మరో వైపు జూన్ రెండో తేదీ తర్వాత ఏపీ అధీనంలో ఉన్న భవనాలను తెలంగాణ ప్రభుత్వం స్వాధీవం చేసుకోనుంది. ప్రస్తుతం లేక్ వ్యూ గెస్ట్ హౌస్ తో పాటు మరికొన్ని భవనాలు మాత్రమే ఏపీ అధీనంలో ఉన్నాయి. విభజన చట్టం ప్రకారం వాటిని ఏపీకి కేటాయించినందున.. ఆటోమేటిక్ గా అవి పదేళ్ల తర్వాత అంటే జూన్ రెడో తేదీన తెలంగాణ పరం అవుతాయి. ఏపీ అధికారులు తాము స్వాధీనం చేయబోమని నిరాకరించే అవకాశం ఉండదు. ప్రదాన పార్టీలు ఉమ్మడి రాజధానిపై సైలెంట్ గా ఉండాటనికి కారణం... ఎలాంటి వ్యవహారాలు ప్రస్తుతం హైదరాబాద్ నుంచి జరగకపోవడమేనని భావిస్తున్నారు.
ఉమ్మి రాజధానిగా ఉన్నప్పటికీ గత ఆరేడేళ్లుగా ఏపీ పాలన పూర్తిగా ఏపీ నుంచే జరుగుతోంది. హైదరాబాద్ నుంచి చిన్న అధికారిక కార్యక్రమం కూడా జరగడం లేదు. ఇలాంటి ఉమ్మడి రాజధాని అనే ప్రస్తావన తీసుకు వస్తే.. సొంత రాజధాని విషయంలో మరింత గందరగోళం అవుతుందన్న ఉద్దేశంతో ఏపీ రాజకీయ పార్టీలు సైలెంట్ గా ఉంటున్నాయి. పైగా ప్రస్తతం ఎన్నికల ఫలితాల హడావుడిలో అక్కడి రాజకీయ పార్టీలు ఉన్నాయి. అందుకే పెద్దగా పట్టించుకోవడం లేదు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















