అన్వేషించండి

మెగస్టార్ బర్త్‌డే రోజున జనసేన కీలక భేటీ- కేడర్‌కు ఏం చెప్పబోతున్నారు?

ఆగస్టు 22న జనసేన కీలక సమావేశం నిర్వహించింది. పార్టీపై కేడర్, లీడర్లకు ఉన్న అనుమానాాలపై క్లారిటీ ఇస్తారా?

అక్టోబర్‌ నుంచి చేపట్టే పాదయాత్ర, పొత్తుల అంశంపై కేడర్‌లో ఉన్న అనుమానాలు తీర్చేందుకు జనసేన సిద్ధమైందా... అధికార పార్టీ చేస్తున్న విమర్శలకు దీటుగా ఎలాంటి కౌంటర్‌ ఇవ్వాలనే విషయంలో కూడా క్లారిటీ ఇవ్వబోతోందా... ఇంతకీ రాజకీయ వ్యవహారాల కమిటీలో ఏం చర్చించనుంది. ఎలాంటి నిర్ణయం తీసుకోనంది... ఇప్పుడు జనసేనలో నడుస్తున్న చర్చ ఇదే. 

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఈ నెల 22వ తేదీన నిర్వహించాలని అధ్యక్షుడు పవన్ నిర్ణయించారు. మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో జనసేన పార్టీ చేపట్టిన జనవాణి, కౌలు రైతు భరోసా యాత్ర, రోడ్ల దుస్థితిపై డిజిటల్ ప్రచారం గురించి చర్చిస్తారని తెలుస్తోంది. 

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, గోదావరి వరదలు కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందజేయడంలో రాష్ట్ర ప్రభుత్వ విఫలమైందని ఆరోపిస్తున్న జనసేన... దీనిపై ప్రత్యేకంగా చ‌ర్చ జరపనున్నట్టు సమాచారం. రాబోయే మూడు నెలల కాలంలో పార్టీ పరంగా చేపట్టబోయే కార్యక్రమాలపై కేడర్‌కు క్లారిటీ ఇవ్వబోతున్నారట. అక్టోబర్ 5న ప్రారంభంకానున్న పవన్ కల్యాణ్ రాష్ట్ర పర్యటన విధి విధానాల రూపకల్పనపై సమగ్ర చర్చించనున్నారు. ఈ భేటీలో పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తోపాటు పీఏసీ సభ్యులు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు పాల్గొంటారు.  

భ‌విష్యత్ కార్యచ‌ర‌ణపై క్లారిటి ఉంటుందా....

రాష్ట్రంలో రాజకీయ ప‌రిస్థితులు, పొత్తుల వ్యవ‌హ‌రంపై తీవ్రస్థాయిలో జనసేన పార్టీ పీఏసీలో చ‌ర్చ ఛాన్స్ ఉందని టాక్. ఈ విషయంలో జ‌న‌సేన, ప‌వ‌న్‌ను మంత్రులు, వైసీపీ లీడర్లు నేరుగా టార్గెట్ చేశారు. విమ‌ర్శల దాడి కూడా పెంచారు. అయితే అదే స్థాయిలో జ‌న‌సేన వాటిని తిప్పికొట్టేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. కానీ ఆశించిన స్థాయిలో ప్రజ‌ల్లోకి వెళ్ళలేక‌పోతున్నామ‌నే భావ‌నలో పార్టీ నేత‌ల్లో ఉంది. దీంతో కేడ‌ర్ కూడా తీవ్ర గంద‌ర‌గోళంలో ఉంటోంది. 

నియోజకవర్గంలోని జనసేన నేతల్లో కూడా డైలమా కనిపిస్తోంది. అభ్యర్దులు ఉంటారా.. ఉండ‌రా... పొత్తుల విష‌యంలో ఇప్పటికే ఉన్న నాయ‌క‌త్వానికి ఇబ్బందులు ఎదుర‌వుతాయా అనే అనుమానాలు వారిని కుదురుగా ఉండనియ్యడం లేదు. దీంతో ఎవ‌రికి వారే అన్న తీరులో లీడర్లు ఉంటున్నారు. 

ఈ ప‌రిస్థితుల‌ను అదిగ‌మించి పార్టీ నాయ‌కులకు, కార్యక‌ర్తల‌కు ప‌వ‌న్ ఎలాంటి భ‌రోసా ఇస్తారు. రాజ‌కీయంగా జ‌న‌సేన కీల‌కంగా మారేందుకు ఎలాంటి వ్యూహరచన చేస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది. జనంలోకి వెళ్తున్నప్పుడల్లా మాకూ ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను రిక్వస్ట్ చేస్తున్నారు పవన్. ఆయన కనిపించినప్పుడల్లా సీఎం సీఎం అంటూ కేడర్‌ ఊగిపోతోంది. కానీ ఆయన వెళ్లిపోయిన మరుక్షణం సోషల్ మీడియాలో తప్ప క్షేత్రస్థాయిలో ఆ ఊపు కనిపించడం లేదు. ఏదో కొన్ని ప్రాంతాల్లో ఈ మధ్య రోడ్లు లాంటి ప్రజాసమస్యలపై కొంతమంది స్పందించినా రాష్ట్రవ్యాప్తంగా ఆ స్థాయి స్పందన రాలేదు. 

ఇప్పుడున్న పరిస్థితుల్లో జ‌న‌సేన‌, బీజేపి క‌లిస్తే ఎన్ని సీట్లు వ‌స్తాయ‌నే దానిపై తీవ్ర స్థాయిలో మాట్లాడుకుంటోంది జనసేన కేడర్. ఇలాంటి టైంలోనే ప‌వ‌న్ యాత్రకు రెడీ అవుతున్నారు. రాష్ట్ర ప‌ర్యట‌నకు సమాయ‌త్తం అవుతున్న వేళ జ‌నానికి ప‌వ‌న్ ఎలాంటి హామీలు ఇస్తారు.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీని గ‌ద్దె దించేందుకు ప‌వ‌న్ చేసే ప‌ర్యట‌న ఎంత వ‌ర‌కు యూజ్ అవుతుందనే దానిపై కూడా అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. అక్టోబ‌ర్ 5 నుంచి ఏపీలో చేపట్టే యాత్రకు అవ‌స‌రమైన రోడ్ మ్యాప్‌తోపాటుగా రాజ‌కీయంగా అనుస‌రించాల్సిన వ్యూహాలపై కూడా పీఎసీ స‌మావేశంలో క్లారిటి వ‌స్తుంద‌ని చెబుతున్నారు నాయకులు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

LRS In Andhra Pradesh: ఏపీలో అనుమతులు లేని ప్లాట్లు ఉన్నాయా.. మరో 4 రోజులే గడువు, 50 శాతం రాయితీ
ఏపీలో అనుమతులు లేని ప్లాట్లు ఉన్నాయా.. మరో 4 రోజులే గడువు, 50 శాతం రాయితీ
Mysterious Boiling Water: అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
Elephant Death:చిత్తూరు జిల్లాలో అనుమానాస్పద స్థితిలో ఏనుగు మృతి... కరెంటు షాక్ పెట్టి చంపేశారని అనుమానాలు
చిత్తూరు జిల్లాలో అనుమానాస్పద స్థితిలో ఏనుగు మృతి... కరెంటు షాక్ పెట్టి చంపేశారని అనుమానాలు
Revanth Reddy At WEF: దావోస్‌‌లో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పరిచయం చేయనున్న రేవంత్ రెడ్డి టీం
దావోస్‌‌లో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పరిచయం చేయనున్న రేవంత్ రెడ్డి టీం

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LRS In Andhra Pradesh: ఏపీలో అనుమతులు లేని ప్లాట్లు ఉన్నాయా.. మరో 4 రోజులే గడువు, 50 శాతం రాయితీ
ఏపీలో అనుమతులు లేని ప్లాట్లు ఉన్నాయా.. మరో 4 రోజులే గడువు, 50 శాతం రాయితీ
Mysterious Boiling Water: అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
Elephant Death:చిత్తూరు జిల్లాలో అనుమానాస్పద స్థితిలో ఏనుగు మృతి... కరెంటు షాక్ పెట్టి చంపేశారని అనుమానాలు
చిత్తూరు జిల్లాలో అనుమానాస్పద స్థితిలో ఏనుగు మృతి... కరెంటు షాక్ పెట్టి చంపేశారని అనుమానాలు
Revanth Reddy At WEF: దావోస్‌‌లో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పరిచయం చేయనున్న రేవంత్ రెడ్డి టీం
దావోస్‌‌లో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పరిచయం చేయనున్న రేవంత్ రెడ్డి టీం
Ikkis Box Office Collection Worldwide Total: ధర్మేంద్ర లాస్ట్ సినిమా... అమితాబ్ మనవడి ఫస్ట్ సినిమా... థియేటర్లలో హిట్టా? ఫట్టా?
ధర్మేంద్ర లాస్ట్ సినిమా... అమితాబ్ మనవడి ఫస్ట్ సినిమా... థియేటర్లలో హిట్టా? ఫట్టా?
Saina Nehwal Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్
రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్
Kodangal Narayanapet Lift Irrigation Scheme: కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల భూ సేకరణకు నిర్ణయం.. ఎకరాకు రూ.20 లక్షల పరిహారం!
కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల భూ సేకరణకు నిర్ణయం.. ఎకరాకు రూ.20 లక్షల పరిహారం!
Renu Desai : పాలిటిక్స్‌లోకి వెళ్లడం లేదు - కుక్కల కోసం పోరాడడం లేదు... రేణు దేశాయ్ రియాక్షన్
పాలిటిక్స్‌లోకి వెళ్లడం లేదు - కుక్కల కోసం పోరాడడం లేదు... రేణు దేశాయ్ రియాక్షన్
Embed widget