By: ABP Desam | Updated at : 21 Oct 2021 08:08 PM (IST)
వైసీపీ కండువాతో జనసేన ఎమ్మెల్యే రాపాక
ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీకి ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. రాజోలు నుంచి రాపాక వరప్రసాదరావు గెలిచారు. అయితే కొన్నాళ్ల తర్వాత జనసేన పార్టీతో విభేదించి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి మద్దతు తెలిపారు. అయితే అధికారికంగా ఆ పార్టీలో చేరలేదు. అలా చేరితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హతా వేటు వేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఎవరైనా ఎమ్మెల్యే పార్టీ మారితే తక్షణం అనర్హతా వేటు వేస్తామని సీఎం జగన్ తో పాటు స్పీకర్ తమ్మినేని సీతారం కూడా గతంలో పలుమార్లు అసెంబ్లీలోనే చెప్పారు. ఈ కారమంగా ఆయనకు వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పలేదు.
అధికారికంగా ఆయన ఇప్పటికి జనసేన ఎమ్మెల్యేనే. అయితే గురువారం ఆయనో తప్పు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న జనాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. వైసీపీ జెండా కప్పుకుని తాను అచ్చమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలా ఇతర పార్టీలపై విమర్శలు చేశారు. మెడలో వైసీపీ జెండా వేసుకుని మరీ ఇతర పార్టీలపై విమర్శలు చేశారు. దీంతో ఇప్పుడు ఆయన అధికారికంగా పార్టీ ఫిరాయించారనేదానికి ఆధారాలు లభించినట్లయింది.
Also Read: పోలీసులకు సిగ్గు లేదా?, నీ కథ ఏంటో చూస్తా..! ఆ పని చేస్తే జగన్కి మేమూ సహకరిస్తాం: చంద్రబాబు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తాము ఫిరాయింపుల్ని ప్రోత్సహించబోమని గతంలో చెప్పారు. అయితే ఆయన పార్టకి పలువురు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు సంఘిభావం చెప్పారు. టీడీపీ నుంచి వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ వంటి వారు మద్దతు పలికారు. అయితే వారి కుటుంబసభ్యులకు సీఎం జగన్ కండువాలు కప్పారు కానీ వారికి కప్పలేదు. దాంతో వారిపై అనర్హతా వేటు వేయాల్సిన అవసరం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రాపాక కూడా అంతే. అధికారికంగా వైసీపీలో చేరలేదు. ఈ కారణంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదని వాదిస్తూ వచ్చారు.
Also Read: సీఎంనా ? సజ్జలనా ? ఎవరిని ఉద్దేశించి పట్టాభి " ఆ పదం " వాడారు ?. పూర్తి ప్రెస్మీట్ డీటైల్స్ ఇవిగో..
ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు రాపాక కూడా అసెంబ్లీలో ఎప్పుడైనా ఓటింగ్ జరిగితే ఆయన వాకౌట్ చేస్తున్నారు. ఇప్పుడు అత్యాత్సాహంతో పార్టీ కండువా కప్పుకుని మరీ నిరసనలో పాల్గొన్నారు. ఇప్పుడు ఆయనపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇలా వైసీపీ కండువాతో ఉండకూడదని సభకు వచ్చిన వాళ్లుచెప్పడంతో తర్వాత తీసేశారు. కానీ అప్పటికీ దృశ్యాలు సోషల్ మీడియాలోకి వచ్చాయి.
Also Read: అంతా చంద్రబాబే చేశారు.. వైసీపీ మంత్రులు, నేతల ఘాటు విమర్శలు!
Weather Updates: పూర్తిగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు, నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు - ఎల్లో అలర్ట్ జారీ చేసిన IMD
Gold Rate Today 1st July 2022: పసిడి ప్రియులకు గుడ్న్యూస్, మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు - లేటెస్ట్ రేట్లు ఇవీ
AP Govt GPF Issue : ఉద్యోగుల ఖాతాల్లో నగదు మాయంపై న్యాయపోరాటం చేస్తాం - సూర్యనారాయణ
Chittoor News : మేయర్ దంపతుల హత్య కేసులో మరో ట్విస్ట్, విచారణ నుంచి తప్పుకున్న ఏపీపీ
Minister Gudivada Amarnath : పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం, ఆగస్టులో రూ. 500 కోట్ల ఇన్సెంటివ్ లు- మంత్రి గుడివాడ అమర్నాథ్
AP Weekly Five Days : వారానికి ఐదు రోజులే పని - మరో ఏడాది పొడిగించిన ఏపీ ప్రభుత్వం !
Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!
PSLV C53 Success : పీఎస్ఎల్వీ సీ53 ప్రయోగం సక్సెస్, నిర్ణీత కక్ష్యలో మూడు ఉపగ్రహాలు
IND Vs ENG Squads: ఇంగ్లండ్తో వన్డేలు, టీ20లకు జట్లను ప్రకటించిన బీసీసీఐ - మొత్తం మూడు జట్లు!