అన్వేషించండి

Visakha News: 'మోదీజీ గంజాయి రాజధాని అనే చెడ్డపేరు తొలగించండి' - జన జాగరణ సమితి ఫ్లెక్సీ

Jana Jagarana Samiti: విశాఖ నగరం గంజాయికి రాజధాని అన్న చెడ్డపేరు తొలగించాలని జన జాగరణ సమితి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఓ ఫ్లెక్సీని ప్రభుత్వ అధికారి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసింది.

Jana Jagarana Samithi Flexi On Visakha Ganza Issue: విశాఖలో (Visakha) గంజాయి సమస్య తీవ్రమైందని పేర్కొంటూ జన జాగరణ సమితి (Jana Jagarana Samiti) ప్రభుత్వ అధికారి కార్యాలయం వద్ద ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) దృష్టికి సమస్యను తీసుకెళ్లేలా.. 'మోదీజీ విశాఖ గంజాయికి రాజధాని అన్న చెడ్డ పేరును దయచేసి తొలగించండి.' అంటూ మధురవాడ రిజిస్టార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో అభ్యర్థించింది. 'ప్రపంచంలోనే అధిక శాతం యువత ఉన్న మన దేశంలో లక్షలాది మంది గంజాయి మత్తుకు బానిసలై బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్నారు. దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిన యువశక్తి నిర్వీర్యం అవుతోంది. మరీ ముఖ్యంగా ఏపీలో ఎక్కడ చూసినా గంజాయి విచ్చలవిడిగా అందరికీ అందుబాటులో ఉండడం వల్ల స్కూల్ పిల్లల నుంచి యూనివర్సిటీ విద్యార్థుల వరకు గంజాయికి బానిసలు అవుతున్నారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు విశాఖ ఏజెన్సీతో ముడిపడి ఉంటున్నాయి. దేశం మొత్తం 7 లక్షల కేజీలు గంజాయి పట్టుబడితే అందులో 5 లక్షల కేజీలు విశాఖ ఏజెన్సీకి సంబంధించినదని అధికారికంగా నిర్ధారించబడింది. అందువల్ల విశాఖ దేశంలోనే గంజాయి రాజధానిగా బాగా ప్రసిద్ధి చెందింది. గంజాయి సాగు, అక్రమ రవాణాను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం 25 శాతం మాత్రమే విజయవంతమైంది. ఎందుకంటే అంతర్జాతీయ గంజాయి ముఠాల ఆట కట్టించాలంటే కేవలం కేంద్ర ప్రభుత్వం వల్లే సాధ్యమవుతుంది. ఇది ఎన్నికల సమయం కాబట్టి విశాఖ ఏజెన్సీలో గంజాయి సమస్యను జాతీయ సమస్యగా గుర్తించి బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి విశాఖ.. గంజాయికి రాజధాని అన్న చెడ్డ పేరును దయచేసి తొలగించండి.' అని ప్రధానికి జన జాగరణ సమితి విజ్ఞప్తి చేసింది.

తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన

మరోవైపు, ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మార్చి 4న ఆయన ఆదిలాబాద్ జిల్లాలో, మార్చి 5వ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ మోదీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అంతే కాకుండా, మోదీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి వస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని మోదీ జాతికి అంకితం చేసే అవకాశం ఉంది. అనంతరం సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నట్టు సమాచారం. మరోవైపు మార్చి 4న తెలంగాణలో జరగాల్సిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటన రద్దైంది. 

ఇదీ షెడ్యూల్

మార్చి 4న ఉదయం 10:30 నుంచి 11 గంటల వరకు ఆదిలాబాద్‌లో కొన్ని కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. మరికొన్ని ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేస్తారు. 11.15 గంటల నుంచి 12 గంటల వరకు ఆదిలాబాద్ లోనే బహిరంగ సమావేశంలో పాల్గొంటారు. అదే రోజు రాత్రికల్లా హైదరాబాద్ చేరుకొని హైదరాబాద్ రాజ్ భవన్‌లో బస చేస్తారు. ఈలోపు బీజేపీ నాయకులతో సమావేశాలు ఉంటాయి. మార్చి 5న సంగారెడ్డిలో పర్యటన ఉండనుంది. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోని రాజ్ భవన్ నుంచి బయలుదేరి ఉదయం 10.45 నుంచి 11.15 వరకు వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం ఉదయం 11.30 నుంచి 12.15 వరకు సంగారెడ్డిలో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. దాంతో ప్రధాని పర్యటన తెలంగాణలో ముగుస్తుంది. అనంతరం ప్రధాని ఒడిశా వెళ్లనున్నట్లు తెలిసింది.

Also Read: Sharmila News: అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ మథనం- ఆశావాహులకు షర్మిల ఇంటర్వ్యూ

టాప్ హెడ్ లైన్స్

Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
Bullet Train Corridors: హైదరాబాద్- చెన్నై, హైదరాబాద్- బెంగళూరు బుల్లెట్ రైళ్ల పనుల్లో తొలి అడుగు.. మార్కింగ్ చేస్తున్న అధికారులు
హైదరాబాద్- చెన్నై, హైదరాబాద్- బెంగళూరు బుల్లెట్ రైళ్ల పనుల్లో తొలి అడుగు.. మార్కింగ్ చేస్తున్న అధికారులు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
AIADMK MLA MR Vijayabhaskar Resigns: టీవీకే విజయ్ ప్లాన్‌కు అల్లాడిపోతున్న అన్నాడీఎంకే - మరో ఎమ్మెల్యే రాజీనామా - లైన్‌లో ఇంకా ఉన్నారా?
టీవీకే విజయ్ ప్లాన్‌కు అల్లాడిపోతున్న అన్నాడీఎంకే - మరో ఎమ్మెల్యే రాజీనామా - లైన్‌లో ఇంకా ఉన్నారా?
Kodangal Duplicate Votes: కొడంగల్‌లో 11 వేల కర్ణాటక వాసుల ఓట్లు - కవిత సంచలన ఆరోపణలు
కొడంగల్‌లో 11 వేల కర్ణాటక వాసుల ఓట్లు - కవిత సంచలన ఆరోపణలు
ENE Sequel Release Date : ఓవైపు కుర్రాళ్లు రెడీ... మరోవైపు నవ్వుల తుపాన్ - ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఓవైపు కుర్రాళ్లు రెడీ... మరోవైపు నవ్వుల తుపాన్ - ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్
Rice Water For Face : 30 రోజులు రైస్ వాటర్‌ను ముఖానికి అప్లై చేస్తే కలిగే లాభాలివే.. ఎలా ఉపయోగించాలంటే
30 రోజులు రైస్ వాటర్‌ను ముఖానికి అప్లై చేస్తే కలిగే లాభాలివే.. ఎలా ఉపయోగించాలంటే
Embed widget