అన్వేషించండి

AP New Scheme : నేను మీ జగన్ ను మాట్లాడుతున్నాను.. మీ సమస్య చెప్పండి. .. ! - బెంగాల్ ఫార్ములాతో వస్తున్న ఏపీ సీఎం !

కార్పొరేట్ కంపెనీలు కస్టమర్ల సమస్యను పరిష్కరించినట్లుగానే ప్రజల సమస్యలను పరిష్కరించే కొత్త స్కీమే జగనన్నకు చెప్పుకుందాం. ఇవిగో ఎక్స్‌ క్లూజివ్ డీటైల్స్ ..

AP New Scheme : "జగనన్నకు చెప్పుకుందాం"  అనే కొత్త స్కీమ్‌ను 13వ తేదీ నుంచి ప్రారంభించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇది కొత్త పథకం. అయితే ఇది సీఎం జగన్ చెప్పే డీబీటీ స్కీం కాదు., ప్రజల  సమస్యలను అదే పద్దతిలో నీట నొక్కి పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ అనుకోవచ్చు.  సీఎం జగన్‌కు తమ సమస్యలు చెప్పుకోవాలనుకునేవాళ్లు లక్షల మంది ఉంటారు. కారణాలు ఏమైనా సీఎం జగన్ ప్రజాదర్బార్ లాంటివి పెట్టలేకపోయారు. ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలను విపక్షాల నుంచి ఎదుర్కొంటున్నారు. స్పందన కార్యక్రమం ప్రభావవంతంగా లేదన్న విమర్శలూ ఉన్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు  "జగనన్నకు చెప్పుకుందాం"  కార్యక్రమాన్ని డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. 

నేరుగా జగన్ వాయిస్‌తోనే సమస్యలు వినేలా ప్రోగ్రామింగ్ ! 

 "జగనన్నకు చెప్పుకుందాం"  కార్యక్రమం కోసం ముందుగా ఓ నెంబర్ ప్రకటిస్తారు. ఆ నెంబర్‌కు ఫోన్ చేసి సీఎం జగన్‌కు సమస్య చెప్పుకోవచ్చు.  ఈ వ్యవస్థ ఎలా పని చేస్తుందంటే... మనం ఫ్లిప్ కార్ట్ లేదా అమెజాన్‌లోనే లేకపోతే ఇంకో ఆన్ లైన్ వ్యవస్థలో సేవలు పొందినప్పుడో.. మనకు సమస్య వస్తే..... వెంటనే వారి కాల్ సెంటర్‌కు ఫోన్ చేస్తాం. వారు ఐవీఆర్ఎస్ పద్దతిలో సమస్యను వర్గీకరించి .. నమోదు చేసుకుని ఓ టిక్కెట్ నెంబర్ కేటాయిస్తారు. ఆ టిక్కెట్ ను ఫలానా సమయంలోపు పరిష్కరిస్తారు.  అచ్చంగా ఇదే పద్దతిని ప్రభుత్వంలోకి తీసుకు వస్తున్నారు సీఎం జగన్.  సమస్య చెప్పుకునేందుకు ఎవరైనా కాల్ చేయగానే.  ఫస్ట్ జగన్ వాయిస్ వస్తుంది. మీ సమస్య ఏంటో చెప్పమని జగన్ చెప్పే ఇంటారాక్టివ్ వాయిస్ ఉంటుంది. వాళ్లు ఐవీఆర్ఎస్ లో  విభాగాల వారీగా సమస్యను వర్గీకరించుకున్న తర్వాత   మళ్లీ జగన్ వాయిస్ లో దీన్ని మా విభాగం వాళ్లకి పంపుతున్నాను అనే వాయిస్ వస్తుంది. ఆ తర్వాత టిక్కెట్ రైజ్ అవుతుంది.   ఇందు కోసం ప్రత్యేకంగా సిబ్బందిని  నియమిస్తున్నందున ఫిర్యాదు చేసే వారికి నమ్మకం కల్పించేందుకు వారితో ఫోన్‌లో మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరిని నేరుగా సీఎంవో మానిటర్ చేస్తుందని చెబుతున్నారు.  

సమస్యను పరిష్కరిస్తామనే భరోసా ఇవ్వడమే లక్ష్యం ! 

ప్రభుత్వం తరపు నుంచి సమస్యల పరిష్కారం కోసం ఎంతో మంది సీఎం జగన్ కు వినతి పత్రాలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారందరికీ ఈ వ్యవస్థ మేలు చేస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  అప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని  భావిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి వచ్చే స్పందనకు తగ్గట్లుగా అధికారులు వేగంగా సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం కొత్త ఇబ్బందులు వస్తాయన్న అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే స్పందనలో లక్షల సంఖ్యలో ఫిర్యాదులు పెండింగ్ లో ఉన్నాయి. చాలా వరకూ పరిష్కరించకపోయినా పరిష్కరించినట్లుగా మెసెజులు వచ్చాయి.  ఇలా .. జగనన్నకు చెప్పుకుందాం కార్యక్రమంలోనూ జరిగితే ప్రజలు నమ్మకం కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇలాంటివి జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

బెంగాల్‌లో దీదీకో బోలో - ఇక్కడ జగనన్నకు చెప్పుకుందాం ! 

 అయితే ఇది కొత్త స్కీమ్ ఏమీ కాదు.  ఇప్పటికే బెంగాల్‌లో అమల్లో ఉంది. అక్కడ దీదీకి బోలో  (  https://www.didikebolo.com/ ) పేరుతో ప్రత్యేకంగా వెబ్ సైట్ కూడా నిర్వహిస్తున్నారు. కాల్ సెంటర్ కూడా ఉంది.  అక్కడి ప్రభుత్వం  అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడానికి ముందు ఈ కార్యక్రమాన్ని తెచ్చింది. ఓ నెంబర్ కు విస్తృతంగా ప్రచారం చేసింది. వాటికి ప్రజలు తమ సమస్యలు చెప్పుకున్నారు. అక్కడ తర్వాత ఎన్నికల్లో  మమతా బెనర్జీ విజయం సాధించారు.  దీంతో ఇది బాగుందని ఏపీలో అమలు చేయాలనుకుంటున్నారు.  జగన్ పుట్టిన రోజు నాటికే సిద్ధం చేయాలనుకున్నారు. కానీ ఆలస్యం అయింది. దీని ద్వారా పబ్లిక్ తో నేరుగా కనెక్ట్ అవ్వొచ్చని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రే నేరుగా మాట్లాడుతూ భరోసా కల్పించిన భావన ప్రజలకు కలుగుతుందని భావిస్తున్నారు. 

మొత్తం ఐ ప్యాక్ పర్యవేక్షణే !

మొత్తంగా ఐ ప్యాక్ పర్యవేక్షణలోనే ఈ స్కీమ్ అమలవుతుందని చెబుతున్నారు. బెంగాల్‌లో  దీదీకో బోలోను ప్రశాంత్ కిషోర్ డిజైన్ చేశారు. ఇప్పుడు దాన్నే ఏపీకి తీసుకు వస్తున్నారు. అక్కడ ఐ ప్యాక్ పర్యవేక్షణ చేసినట్లుగానే ఏపీలోనూ అదే పద్దతి అమలు చేస్తారని భావిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

AP NDA Leaders Meeting Chandrababu Naidu: ఎన్డీయే రాజ్యసభ సీట్ల పంపకం పూర్తి - ఏపీలో 3 భారీ బహిరంగ సభలకు షెడ్యూల్ ఖరారు!
ఎన్డీయే రాజ్యసభ సీట్ల పంపకం పూర్తి - ఏపీలో 3 భారీ బహిరంగ సభలకు షెడ్యూల్ ఖరారు!
Dhee Show Pandu Accident : పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
Kesineni Nani: విజయవాడలో కేశినేని నాని పొలిటికల్ బాంబ్ - ఎంపీ చిన్నిపై రూ.27 కోట్ల బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
విజయవాడలో కేశినేని వర్సెస్ కేశినేని - ఎంపీ చిన్నిపై నాని బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
AP Cabinet Meeting Decisions June 2026: అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు చెల్లించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు - ఏపీ కేబినెట్‌లో సంచలన నిర్ణయాలు
అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు చెల్లించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు - ఏపీ కేబినెట్‌లో సంచలన నిర్ణయాలు

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kesineni Nani: విజయవాడలో కేశినేని నాని పొలిటికల్ బాంబ్ - ఎంపీ చిన్నిపై రూ.27 కోట్ల బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
విజయవాడలో కేశినేని వర్సెస్ కేశినేని - ఎంపీ చిన్నిపై నాని బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
Metro Pillar 1043 Crack: అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
Dhee Show Pandu Accident : పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
Rajesh Exports SEBI Interim Order 2026: దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
Foods to Reduce Gas : గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
Lalit Modi :
"సోనియాగాంధీ సహా అప్పటి ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేశారు" బాంబులు పేలుస్తున్న లలిత్ మోడీ!
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Embed widget