అన్వేషించండి

Breaking News Live: ఏపీలో నైట్‌ కర్ఫ్యూ ఎత్తివేత, మాస్క్‌ మస్ట్

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live: ఏపీలో నైట్‌ కర్ఫ్యూ ఎత్తివేత, మాస్క్‌ మస్ట్

Background

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణంలో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో కొన్ని చోట్ల వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కనిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గే అవకాశం ఉంది. తూర్పు దిశ నుంచి గాలుల ప్రభావం తగ్గగా, మరోవైపు ఈశాన్య దిశ నుంచి గాలులు తక్కువ ఎత్తులో వేగంగా వీస్తున్నాయి. దీని ఫలితంగా ఏపీ మరో మూడు రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది.

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.  చలి తీవ్రత కాస్త పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు నేడు ఎలాంటి వర్ష సూచన లేదు. జంగమేశ్వరపురంలో అత్యల్పంగా 15.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కళింగపట్నంలో 15.9 డిగ్రీలు, నందిగామలో 17.1 డిగ్రీలు, బాపట్లలో 19.7 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఎలాంటి సమస్యలు లేవని వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్ని చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు పెరగడంతో వాతావరణం కాస్త వేడిగా మారనుంది. వర్ష సూచన లేకపోవడంతో రైతులు ధాన్యం విషయంలో ఆందోళన చెందవద్దని అధికారులు పేర్కొన్నారు.

దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో నేడు తేలికపాటి జల్లులు కురవనున్నాయి. ఈ ప్రాంతాల్లో నేడు కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకావం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో అనూహ్యంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యవరంలో ఏకంగా 17 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అనంతపురంలో 18.6 డిగ్రీలు, కర్నూలులో 19.2 డిగ్రీలు, తిరుపతిలో 19.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కోస్తాంధ్రతో పోల్చితే రాయలసీమలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నాయి.

తెలంగాణలో చలి
తెలంగాణలో ఆకాశాన్ని మేఘాలు కప్పేస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదయం వేళ పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలు ఉండగా, పగటి వేళ గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా నమోదు కానున్నాయి. తెలంగాణలో తూర్పు దిశ నుంచి ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. వర్షాలు లేకపోయినా కనిష్ట ఉష్ణోగ్రతలు అంతగా పెరగడం లేదు.

బంగారం వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వరుసగా నేడు స్వల్పంగా పెరిగింది. గ్రాముకు రూ.1 చొప్పున పెరిగింది. అంతకుముందు రోజు ఏకంగా రూ.100 ఎగబాకింది. వెండి ధర మాత్రం నేడు స్థిరంగా ఉంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.46,810 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,060 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలోకు రూ.67,400గా నిలకడగా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,810 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,060గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.67,400 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.46,810 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,060గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.67,400గా ఉంది.

18:58 PM (IST)  •  14 Feb 2022

Praveen Prakash: సీఎం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ బదిలీ, ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా నియామకం

సీఎం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ బదిలీ అయ్యారు. ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ప్రవీణ్ ప్రకాశ్‌ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనాను రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ప్రవీణ్ ప్రకాశ్ ను బదిలీ  చేస్తూ సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. 

18:05 PM (IST)  •  14 Feb 2022

Corona In AP: ఏపీలో నైట్‌క‌ర్ఫ్యూ తొల‌గింపు.. మాస్క్‌ మస్ట్ 

ఏపీలో నైట్‌క‌ర్ఫ్యూ తొల‌గింపు. మాస్క్‌లు త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాల‌ని ప్రభుత్వం ఆదేశం.  కోవిడ్ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాలి.  

ఫీవ‌ర్ స‌ర్వే కొన‌సాగించాలి. ఆరోగ్య‌శాఖ‌లో రిక్రూట్‌మెంట్ ను పూర్తిచేయాలి సీఎం జ‌గ‌న్‌ ఆదేశం

17:09 PM (IST)  •  14 Feb 2022

సాంబార్ గిన్నెలో పడి రెండేళ్ల పసిపాప మృతి

కృష్ణాజిల్లా జిల్లా విస్సన్నపేట కలగరలో విషాదం నెలకొంది. కారుమంచి శివ, బన్ను దంపతుల రెండు సంవత్సరాల తేజస్వినికి పుట్టినరోజు వేడుకలను జరుపుతుండగా భోజనాలు జరిగే ప్రాంతంలో కూర్చీలో కూర్చుని ఆడుకుంటూ తేజస్విని సాంబార్ గిన్నెలో పడిపోయింది. వెంటనే చిన్నారిని తిరువూరు పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం తేజస్విని చనిపోయింది. పసిపాప మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

14:57 PM (IST)  •  14 Feb 2022

మంత్రి కేటీఆర్ పర్యటనలో ఉద్రిక్తత, అడుగడుగునా అడ్డుకుంటున్న కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటనలో అడ్డంకుల పర్వం కొనసాగుతోంది. మంత్రిని అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు స్టేషన్ కు తరలించారు. అనంతరం బీజేపీ నాయకులు కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకోవడానికి యత్నించారు. దీంతో పోలీసులు బీజేపీ నాయకులను కూడా అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. దీంతో ఉద్రిక్తతల నడుమ మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది. 

13:50 PM (IST)  •  14 Feb 2022

18న మేడారానికి సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 18న మేడారం జాతరకు వెళ్లనున్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ కేసీఆర్ మేడారం పర్యటన గురించి తెలిపారు. మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఇప్పటికే మంత్రులు తెలిపారు. జాతరకు అన్ని వర్గాల ప్రజలకు సహరించాలని కోరారు. రాజకీయాలతో సంబంధం లేకుండా జాతరను అన్ని వర్గాల వారు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మేడారం వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా 34 పార్కింగ్ ప్లేస్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులకు ఎక్కడా ఏ సమస్య రాకుండా చూసేందుకు జాతరలో మొత్తం 40 వేల మంది సిబ్బంది విధుల్లో ఉంటారని మంత్రులు తెలిపారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Stampedes in Railway Stations: రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
Jayalalitha Assets: 1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
New Delhi Railway Station Stampede: ఢిల్లీలో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MLC Elections ఏపి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెడుతున్న ఆధారాలు చూపిన శ్రీరాజ్Deputy CM Pawan Kalyan South India Temples Full Video | పవన్ తిరిగిన దక్షిణాది ఆలయాలు ఇవే | ABPDy CM Pawan Kalyan మురుగన్ ఆలయంలో ప్రత్యేక పూజలు | Tamil Nadu | ABP DesamKiran Royal Laxmi Comments On Pawan Kalyan | కిరణ్ రాయల్ వెనుక పవన్ ! | ABP DESAM

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Stampedes in Railway Stations: రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
Jayalalitha Assets: 1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
New Delhi Railway Station Stampede: ఢిల్లీలో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
Satya Kumar: ‘ఇలాంటి సినిమాలు సమాజానికి మంచివి కాదు’.. మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలు
‘ఇలాంటి సినిమాలు సమాజానికి మంచివి కాదు’.. మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలు
Sirpur Politics: తగ్గేదేలే- సిర్పూర్ లో ఆసక్తికరంగా మారుతున్న కోనప్ప రాజకీయం..!
తగ్గేదేలే- సిర్పూర్ లో ఆసక్తికరంగా మారుతున్న కోనప్ప రాజకీయం..!
Sreeleela: బాలీవుడ్‌లో శ్రీలీల ఫస్ట్ మూవీ - రొమాన్స్ డోస్ పెంచేసిందిగా.. ఫస్ట్ లుక్ చూశారా!
బాలీవుడ్‌లో శ్రీలీల ఫస్ట్ మూవీ - రొమాన్స్ డోస్ పెంచేసిందిగా.. ఫస్ట్ లుక్ చూశారా!
Anantha Babu: ఎమ్మెల్సీ అనంతబాబు బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందించిన కూటమి ప్రభుత్వం
ఎమ్మెల్సీ అనంతబాబు బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందించిన కూటమి ప్రభుత్వం
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.