అన్వేషించండి

IAS Krishna Teja: కేరళకు సెలవు, ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీలోకి ఐఏఎస్ కృష్ణతేజ

Andhra Pradesh Deputy CM Pawan Kalyan: యువ ఐఏఎస్, కేరళ త్రిసూర్ కలెక్టర్‌ కృష్ణతేజ డిప్యూటేషన్ మీద ఏపీకి వస్తున్నారు. ఇక సెలవు, ధన్యవాదాలు అని ఫేస్‌బుక్ లో ఆయన పోస్ట్ చేశారు.

IAS Krishna Teja to Andhra Pradesh: కేరళ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ మైలవరపు కృష్ణతేజ అక్కడి డ్యూటీ నుంచి రిలీవ్ అయ్యారు. ప్రస్తుతం యువ ఐఏఎస్ కృష్ణతేజ త్రిసూర్ జిల్లా కలెక్టర్‌‌గా సేవలు అందిస్తున్నారని తెలిసిందే. ఆయన ఏపీకి డిప్యూటేషన్ మీద రానున్నారు. ఏపీ ప్రభుత్వం కోరడంతో కేంద్ర ప్రభుత్వం కేరళ నుంచి కృష్ణతేజను రిలీవ్ చేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కృష్ణతేజ మూడేళ్ల పాటు డిప్యూటేషన్ మీద తన సొంత రాష్ట్రానికి వస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ ఏరికోరి యువ ఐఏఎస్ కృష్ణతేజను రాష్ట్రానికి వచ్చేలా ప్రయత్నాలు చేశారు.

త్రిసూర్ జిల్లా కలెక్టర్ గా తాను ఈరోజు రిలీవ్ అవుతున్నానని, ఇప్పటివరకు మద్దతు తెలిపిన, తనపై ప్రేమ చూపించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఐఏఎస్ కృష్ణతేజ Thrissur District Collector ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. దాంతో కేరళ నుంచి ఐఏఎస్ కృష్ణతేజ ఏపీకి రావడం ఫిక్స్ అయింది. త్వరలోనే ఆయన ఏపీలో సేవలు అందించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఓఎస్డీగా కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు. సమర్థవంతమైన అధికారులకు బాధ్యతలు అప్పగించి, ఏపీని మళ్లీ గాడిన పెడతామని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూసీ సీఎం పవన్ కళ్యాణ్ కోరిక మేరకు యువ ఐఏఎస్ కృష్ణతేజను డిప్యూటేషన్ మీద కేరళ నుంచి రప్పిస్తున్నారు.

IAS Krishna Teja: కేరళకు సెలవు, ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీలోకి ఐఏఎస్ కృష్ణతేజ

ఏపీకి డైనమిక్ ఆఫీసర్ కృష్ణతేజ
మైలవరపు కృష్ణ తేజ(Krishna Teja) తొలిపోస్టింగ్‌ నుంచి సంచలనమే. ఆపరేషన్ కుట్టునాడు పేరిట 2 రోజుల్లోనే రెండున్నర లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఐఏఎస్‌ అధికారి కృష్ణతేజ. తక్కువ సమయంలో వరద ముప్పు నుంచి లక్షల మంది ప్రాణాలు కాపాడి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఆయన డిప్యూటేషన్ మీద సొంత రాష్ట్రం ఏపీకి వస్తున్నారు. 2017 కేరళ కేడర్‌కు చెందిన కృష్ణ తేజ తొలిపోస్టింగ్‌ కేరళలోని అలెప్పి జిల్లా సబ్‌ కలెక్టర్‌. సరిగ్గా ఏడాదిలోపే కేరళను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఆయన బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోపే తొలి పోస్టింగ్, కొత్త అధికారి అయినా కృష్ణతేజ వెనక్కి తగ్గలేదు. తెలివిగా వ్యవహరించి, అన్నిశాఖలను సమన్వయం చేసుకుని కేవలం 48 గంటల్లోనే సుమారు రెండున్నర లక్షల మందిని  సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొందర్ని స్వయంగా బోటులో తరలించి ప్రాణాలు కాపాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డులతో సత్కరించాయి. దాతల సాయంతో అనంతరం వారికి పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చారు.

అలెప్పిని పర్యాటకంగా డెవలప్ చేసి, ప్రాజెక్ట్‌లు తీసుకొచ్చారు. అనుమతుల్లేని విల్లాలను కూల్చివేసే సమయంలో ఎంత ఒత్తిడి చేసినా తట్టుకుని అనుకున్నది సాధించారు. డ్యూటీ విషయంలో ఎవరిని లెక్కచేయని మనస్తత్వం ఆయనది. అవినీతి రహిత సమర్థుడైన అధికారిగా ఆయన పేరు మారుమోగిపోయింది. గతంలో అలెప్పి నుంచి బదిలీ అయిన సమయంలో స్థానిక ప్రజలు అడ్డుకునే ప్రయత్నం చేశారంటే కృష్ణతేజపై వారికి ఉన్న నమ్మకం అది. త్రిసూరు కలెక్టర్‌గా చేస్తున్న కృష్ణతేజ సేవల్ని ఏపీ ప్రభుత్వం వినియోగించుకోవాలని నిర్ణయించుకుంది. కేంద్రాన్ని ఒప్పించి, డిప్యూటేషన్ మీద రాష్ట్రానికి రప్పిస్తున్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
Embed widget