అన్వేషించండి

Andhra pradesh News: గర్భిణీ నరకయాతన, బిడ్డను ప్రసవించిన ఆస్పత్రికే భర్త మృతదేహం - ఏపీలో తీవ్ర విషాదం

Andhra pradesh News: ఏపీలో తీవ్ర విషాదం జరిగింది. ఓ గర్భిణీ ఆస్పత్రిలో చేరేందుకు 70 కి.మీ ప్రసవ వేదన పడగా, ప్రమాదంలో మరణించిన ఆమె భర్త మృతదేహాన్ని అదే ఆస్పత్రికి తరలించారు.

ఏపీ పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. ప్రసవ వేదన అనుభవించిన ఓ గర్భిణీ 3 గంటలుగా 3 ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. చివరకు 70 కి.మీల దూరంలోని ఓ ఆస్పత్రిలో చేర్చగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, తోడుగా వచ్చిన ఆమె భర్త డబ్బులు తీసుకువస్తానని వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. ఈ క్రమంలో స్థానికులు అతన్ని తన భార్య ప్రసవించిన ఆస్పత్రికే చికిత్స కోసం తరలించగా, ఇంతలోనే ప్రాణాలు కోల్పోయాడు. బిడ్డను కళ్లారా చూడక ముందే తండ్రి కన్నుమూశాడని కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

ఏం జరిగిందంటే?

పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన రామాంజిని అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో శుక్రవారం రాత్రి 10 గంటలకు ఆమెను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ సదుపాయాలు సరిగా లేవని గురజాల ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో రాత్రి 11 గంటలకు గురజాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, అక్కడ కూడా సదుపాయాలు లేవని నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సిఫారసు చేశారు. దీంతో చేసేదేమీ లేక గర్భిణీని కుటుంబ సభ్యులు 70 కిలోమీటర్ల దూరంలోని నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దారి పొడవునా ఆమె 3 గంటలుగా నరకయాతన అనుభవించింది. ఆస్పత్రిలో రామాంజిని పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. 

భర్తకు ప్రమాదం

అయితే, గురజాల వరకూ గర్భిణీకి తోడుగా వచ్చిన ఆమె భర్త ఆనంద్ ఇంటికి వెళ్లి డబ్బులు తెస్తానని బయలుదేరాడు. బైక్ పై ఇంటికి వెళ్లి తిరిగి వస్తూ మార్గమధ్యంలో జోలకల్లు వద్ద రహదారిపై భారీ గుంతలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు, బాధితున్ని నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికే చికిత్స కోసం తరలించారు. ఆస్పత్రి వద్దకు చేరగానే ఆనంద్ మృతి చెందాడు. దీంతో బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

బిడ్డను చూడకుండానే

తనకు పుట్టిన బిడ్డను కనులారా చూడకుండానే ఆనంద్ కన్నుమూశాడని బంధువులు విలపించారు. భార్యను దగ్గరుండి చూసుకోవాల్సిన సమయంలో ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర సమయంలో గర్భిణీలకు సాధారణ కాన్పులు కూడా చేయలేని స్థితిలో కారంపూడి, గురజాల ఆస్పత్రులు ఉన్నాయని విమర్శించారు. ప్రసవం కోసం 70 కి.మీల దూరంలోని ఆస్పత్రికి వెళ్లాల్సి రావడం బాధాకరమని వాపోయారు. 

Also Read: జనసేన నేత కోటిరెడ్డి రాజారెడ్డిపై దాడి-వైఎస్‌ఆర్‌సీపీ పనే అంటూ ఆరోపణలు

 

 

 

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget