అన్వేషించండి

CRDA Happynest : సీఆర్డీఏకు హ్యాపీనెస్ట్ గండం - నష్టపరిహారం ఇవ్వాలని కొనుగోలుదారుల నోటీసులు !

హ్యాపీ నెస్ట్ కొనుగోలుదారులు సీఆర్డీఏకు నోటీసులు ఇచ్చారు. ఒప్పందం ఉల్లంఘించినందున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే కోర్టుకెళ్లేందుకు సిద్ధమని హెచ్చరించారు.

ఒప్పందం ప్రకారం ఇళ్లు కట్టించి ఇవ్వనందుకు.. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు రూ. 20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని సీఆర్డీఏకు అమరావతి  హ్యాపీనెస్ట్ ( Happy Nest ) కొనుగోలు దారులు లీగల్ నోటీసులు పంపారు. సీఆర్డీఏ స్పందనను బట్టి సీఆర్డీఏపై ‘రేరా’ ( Rera Act ) చట్టం కింద కేసు వేస్తామనిహ టున్న కొనుగోలుదారులు స్పష్టం చేశారు. హ్యాపీ నెస్ట్ అనేది అమరావతిలో సీఆర్డీఏ చేపట్టిన ప్రాజెక్ట్. రాజధానిలో  ఇళ్లు కొనుగోలు చేయాలనుకునేవారి కోసం ప్రత్యేకంగా అపార్టుమెంట్ల ( Happynest Apartments ) సముదాయాన్ని నిర్మించాలని సీఆర్డీఏ నిర్ణయించింది. అందుబాటు ధరల్లో 12 టవర్స్, 1200 ప్లాట్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. బుకింగ్స్ ప్రారంభించిన గంటలోనే అన్ని ఫ్లాట్స్ అమ్మకాలు పూర్తయ్యాయి. కొనుగోలు చేసిన వారు పది శాతం డబ్బులు కట్టేశారు. ఒప్పందం ప్రకారం వారికి గత ఏడాది డిసెంబర్ నాటికి ఫ్లాట్స్ హ్యాండోవర్ చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు పునాదుల్లో కూడా ఆ ప్రాజెక్టు లేదు. 

మూడు రాజధానుల అంశం సరికాదు : కేంద్రమంత్రి అథవాలే

హ్యాపీ నెస్ట్ కోసం నేలపాడులో ( Nelapadu )  స్థల సేకరణ చేశారు. 18 అంతస్థుల నిర్మాణాలతో 12టవర్లు నిర్మించటానికి టెండర్లు పిలిచారు. ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కంపెనీగా సీబీఆర్‌ఈని నియమించారు. కాంట్రాక్ట్‌ను షాపూర్జీపల్లోంజీ సంస్థ పొందింది. ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్లను అందుబాటులోకి తీసుకురావాలనుకున్నారు. అన్నివర్గాలకు అనువుగా ఎంఐజీ, హెచ్‌ఐజీలకు అవకాశం కల్పించింది. టెండర్లలో ఎస్‌పీసీఎల్‌ సంస్థ ప్రాజెక్టు పనులను దక్కించుకుంది. సన్నాహాలు పూర్తిచేసుకుని హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టు శ్రీకారం చుట్టుకుంటుందనగా రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారడంతో ఆ ప్రాజెక్టును పట్టించుకోలేదు. 1200 ఫ్లాట్లకు  దాదాపు రూ. 90 కోట్ల మేర కొనుగోలు దారులు అడ్వాన్స్‌ చెల్లించారు. 

అమరావతిలో కేంద్ర సంస్థల నిర్మాణాలు షురూ.. ఢిల్లీ నుంచి ఇవే సిగ్నల్సా ?

అడ్వాన్స్ కట్టిన వారితో సీఆర్డీఏ ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పంద ప్రకారం ఇళ్లను ఇవ్వలేకపోయింది. దీంతో ఇప్పుడు వారంతా కోర్టును నష్టపరిహారం కోసం ఆశ్రయించే ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకే ముందస్తుగా నోటీసులు జారీ చేశారు. 2020లో పనులు ముందుకు సాగకపోవడంతో న్యాయపోరాటానికి వెళతామని కొనుగోలుదారుల హెచ్చరించారు. ఆ సమయంలో ప్రభుత్వం రివర్స్ టెండర్లకు వెళ్లింది. అయితే టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.  ఒప్పందం ప్రకారం గడువు తీరిపోవడంతో ముందస్తుగా చెల్లించిన 10% సొమ్ము, 14% వడ్డీతో చెల్లించాలని  చెల్లించాలని..  నష్టపరిహారం కింద రూ.20 లక్షలు ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సీఆర్డీఏ స్పందించకపోతే కోర్టులో పిటిషన్ వేసే అవకాశాలు ఉన్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget