అన్వేషించండి

Amaravati : అమరావతిలో కేంద్ర సంస్థల నిర్మాణాలు షురూ.. ఢిల్లీ నుంచి ఇవే సిగ్నల్సా ?

అమరావతిలో కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన కార్యాలయాల నిర్మాణం మళ్లీ ప్రారంభమయింది. అమరావతే రాజధాని అనేదానికి ఇవే సిగ్నల్స్ అని రాజధాని రైతులు భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థలు మళ్లీ నిర్మాణాలు ప్రారంభిస్తున్నాయి. అమరావతిని రాజధానిగా ఖరారు చేసిన తర్వాత రాష్ట్రాల రాజధానుల్లో కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థల కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి అప్పటి ప్రభుత్వం భూములు కేటాయించింది. చాలా సంస్థలు శంకుస్థాపనలు కూడా చేసి.. పునాదులు వేయడం వంటి పనులు కూడా చేశాయి. అయితే ప్రభుత్వం మారడం.. ప్రభుత్వ ప్రయారిటీలు మారడంతో రాజధాని నిర్మాణం ఎక్కడిదక్కడ ఆగిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా నిర్మాణాలు నిలిపివేశాయి. అయితే రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ నిర్మాణాలు ప్రారంభిస్తున్నాయి. 

తుళ్లూరు-రాయపూడి మధ్య  నేషనల్ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కార్యాలాయనికి గత ప్రభుత్వం భూమి కేటాయించింది. రెండెకరాల స్థలంలో తొమ్మిది అంతస్తుల భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. కానీ తర్వాత ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారడంతో నిర్మాణం ఆగిపోయింది. శంకుస్థాపన చేసిన రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు నిర్మాణ పనులను ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా సంస్థ తమ కార్యాలయం చుట్టూ ప్రహరి నిర్మాణ పనులు చేపట్టారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా అసంపూర్తిగా మిగిలిపోయిన నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్ణయించింది. హైకోర్టు అదనపు భవనానికి కూడా శంకుస్థాపన చేశారు. ఈ పరిణామాలతో అమరావతిలో నిర్మాణాలు మళ్లీ జోరందుకుంటాయన్న అంచనాల్లో రైతులు ఉన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే రాజధాని అని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో స్పష్టం చేసింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు.  ఆంధ్రప్రదేశ్  రాజధాని అమరావతేనని స్పష్టం చేశారు. మూడు రాజధానుల ప్రతిపాదన ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని తెలిసిందన్నారు. విభజన తర్వాత ఏపీలో ఏర్పడిన మొదటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఖరారు చేసిందని తెలిపారు. హోంశాఖ సహాయ మంత్రి ఇలాంటి ప్రకటన చేసిన మూడు రోజుల వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన విభాగం అమరావతిలో నిర్మాణాలు ప్రారంభించడం  అమరావతి రైతుల్ని సంతోషానికి గురి చేస్తోది. 

కేంద్రం అమరావతే రాజధాని స్పష్టత ఇవ్వడంతో ఇప్పుడు మిగతా కేంద్ర సంస్థలు కూడా నిర్మాణాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని రాజధాని రైతులు ఆశా భావంతో ఉన్నారు. రాజధాని ఏదో తెలిస్తే తాము ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాన్ని నిర్మిస్తామని ఆ సంస్థ ఇటీవలే లేఖ రాసింది. ఈ పరిణామాలతో అమరావతి కోసం ఉద్యమిస్తున్న వారికి కాస్త ఊరట లభిస్తోంది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Minister Peddireddy: నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
Thota Trimurtulu Case :  అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Nirai Mata Temple | గర్భగుడిలో దేవత ఉండదు... కానీ ఉందనుకుని పూజలు చేస్తారుSiricilla Gold Saree | Ram Navami | మొన్న అయోధ్య.. నేడు భద్రాద్రి సీతమ్మకు... సిరిసిల్ల బంగారు చీరVijayawada CP On CM Jagan Stone Attack:ప్రాథమిక సమాచారం ప్రకారం సీఎంపై దాడి వివరాలు వెల్లడించిన సీపీRCB IPL 2024: చేతిలో ఉన్న రికార్డ్ పోయే.. చెత్త రికార్డ్ వచ్చి కొత్తగా చేరే..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Minister Peddireddy: నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
Thota Trimurtulu Case :  అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
Andhra News : ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి బదిలీ - ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ
ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి బదిలీ - ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ
IPL 2024: ఇక నా వల్ల కాదు గుడ్‌ బై! మ్యాక్స్‌వెల్‌ సంచలన ప్రకటన
ఇక నా వల్ల కాదు గుడ్‌ బై! మ్యాక్స్‌వెల్‌ సంచలన ప్రకటన
CM Jagan: సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
Embed widget